Assam: ముస్లిం వివాహాలు-విడాకుల చట్టాన్ని రద్దు చేసిన అస్సాం..
- ముస్లిం వివాహాలు-విడాకుల బిల్లుకు అస్సాం ఆమోదం..
- యూనిఫాం సివిల్ కోడ్కి కీలక ముందడుగు..
- బాల్యవివాహాలు..బహు భార్యత్వంపై ఉక్కుపాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam: యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేసే దిశగా అస్సాంలోని హిమంత బిశ్వ సర్మ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. అస్సాం అసెంబ్లీ గురువారం రాష్ట్రంలోని ముస్లిం వివాహాలు-విడాకులుకు సంబంధించి పాత చట్టాన్ని తొలగించి, వివాహాలు విడాకులకు ప్రభుత్వ నమోదును తప్పనిసరి చేసే బిల్లును ఆమోదించింది. ‘‘అస్సాం తప్పనిసరి ముస్లిం వివాహాలు మరియు విడాకుల నమోదు బిల్లు- 2024’’ని రాష్ట్ర రెవెన్యూ మినిస్టర్ జోగెన్ మోహన్ మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ముస్లిం వివాహాలు మరియు విడాకుల నమోదు చట్టం-1935ని రద్దు చేసింది.
Read Also: PM Modi: శుక్రవారం మహారాష్ట్రలో మోడీ పర్యటన.. ముంబై జీఎఫ్ఎఫ్ సదస్సులో ప్రసంగం
Also Read
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Sonam Wangchuk: "నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
ఈ విషయంపై ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ, కాజీలు గతంలో జరిపిన వివాహాల రిజిస్ట్రేషన్లన్నీ చెల్లుబాటు అవుతాయని, కొత్తవి మాత్రమే చట్టం పరిధిలోకి వస్తాయని అన్నారు. “ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఇస్లామిక్ ఆచారాల ప్రకారం జరిగే వివాహాలకు మేము అస్సలు జోక్యం చేసుకోవడం లేదు. మా ఏకైక షరతు ఏమిటంటే ఇస్లాం నిషేధించిన వివాహాలు నమోదు చేయబడవు.’’ అని అన్నారు. బాల్య వివాహాలను నిర్మూలించడంతో పాటు, కాజీ వ్యవస్థను దూరం చేయడమే మా లక్ష్యమని చెప్పారు. ముస్లిం వివాహాలు, విడాకులను రిజిస్ట్రేషన్ ద్వారా ప్రభుత్వం వ్యవస్థ కిందకు తీసుకురావాలని అనుకున్నామన్నారు.
ఈ కొత్త చట్టం బాల్య వివాహాలను పూర్తిగా నిషేధిస్తుందని సీఎం చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని వివాహాల రిజిస్ట్రేషన్ జరగాలని, అయితే ఈ ప్రయోజనాల కోసం కాజీల వంటి ప్రైవేట్ సంస్థలకు రాష్ట్రం మద్దతు ఇవ్వదని చెప్పారు. ‘‘సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడే మా ప్రయత్నంలో ఈ రోజు చారిత్రాత్మకమైంది. ఈ బిల్లు ద్వారా ప్రభుత్వం వివాహాల రిజిస్ట్రేషన్లను తప్పనిసరి చేస్తుంది. బాలికలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్ల వయసుని చట్టబద్ధం చేస్తుంది’’ అని ఆయన ట్వీట్ చేశారు. ఈ బిల్లు బాల్యవివాహాలను నిరోధించడంతో పాటు ఆడ పిల్లలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించే సాధనం, బహు భార్యత్వాన్ని నిషేధిస్తుందని అన్నారు. గతంలో ముస్లిం వివాహాలు కాజీలు అమలుపరిచేవారు. వీటి ద్వారా బాల్య వివాహాలు జరిగేవి. వీటిపై ప్రభుత్వ పర్యవేక్షణ కూడా లేదు.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?