Himanta Biswa Sarma: సోనియాగాంధీపై విద్వేష వ్యాఖ్యలు.. అస్సాం సీఎంపై ఎఫ్ఐఆర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Biswa Sarma: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వసర్మ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని అస్సాం కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీంతో హిమంతపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అస్సాం ప్రతిపక్షనేత, కాంగ్రెస్ పార్టీకి చెందిన దేబబ్రత సైకియా ఫిర్యాదు చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విదిషాలో ఎన్నికల ప్రచారంలో ‘జన ఆశీర్వాద ర్యాలీ’లో పాల్గొన్న హిమంత బిశ్వసర్మ సోనియా గాంధీపై విద్వేశపూరిత ప్రసంగం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
సోనియా గాంధీ అధికారిక నివాసమైన 10 జన్పథ్ని తగలబెట్టాలని అస్సాం సీఎం పిలుపునిచ్చారని సైకియా ఆరోపించారు. విదిషా ర్యాలీలో హిమంత ఈ వ్యాఖ్యలు చేసినందుకు తాను ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వచ్చిందని సైకియా తెలిపారు. ఆ ర్యాలీలో హిమంత మాట్లాడుతూ..‘‘ కాంగ్రెస్ నేత, మాజీ సీఎం కమల్ నాథ్ హనుమంతుడి భక్తుడైతే, హనుమంతుడు లంకను తగలబెట్టిన విధంగా 10 జన్పథ్ని తగలబెట్టాలి’’ అని పిలుపునివ్వడం వివాదాస్పదం అయింది.
Also Read
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
Read Also: Wipro: విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్ దాలా రాజీనామా..
చట్టపాలన ఉన్న దేశంలో ఇలాంటి వ్యాఖ్యలు మంచిది కాదని కాంగ్రెస్ నేత సైకియా అన్నారు. సోనియాగాంధీ పార్లమెంటులో సీనియర్ సభ్యురాలు, కాంగ్రెస్, యూపీఏలకు ప్రాతినిధ్యం వహించారని, ఆమెపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నానని, అస్సాం ముఖ్యమంత్రి నుంచి ఇలాంటి మాటు వస్తాయని అనుకోలేదని సైకియా అన్నారు.
ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. వరసగా నాలుగు సార్లు బీజేపీ ఆ రాష్ట్రంలో అధికారంలో ఉంటోంది. ఈ సారి ఎలాగైనా బీజేపీని, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ని గద్దె దించాలని కాంగ్రెస్ భావిస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల ముందు మధ్యప్రదేశ్ ఎన్నికలకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు కీలకం కానున్నాయి. మధ్యప్రదేశ్ తో పాటు చత్తీస్గఢ్, మిజోరాం, తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
Director Arrested: డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి రేప్.. దర్శకుడు అరెస్ట్
-
Manchu Manoj: సినిమాకు కులం, గోత్రం ఉండదు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్ వైరల్!
-
Shehnaaz Gill : షూటింగ్లో ప్రమాదం: పొరపాటున ముక్కు పుడక మింగేసిన నటి!
-
Palamuru Rangareddy Project: పాలమూరుకు కేంద్రం షాక్.. జాతీయ హోదాపై క్లారిటీ.!
-
SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!