Ashok Gehlot: కాంగ్రెస్లో నాపై కుట్ర.. అధ్యక్ష పదవి లాక్కున్నారు
- కాంగ్రెస్ అధ్యక్షుడిని కాకుండా నాపై కుట్ర..
- సంచలన వ్యాఖ్యలు చేసిన అశోక్ గెహ్లాట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashok Gehlot: రాజస్థాన్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ సొంత పార్టీపై బాంబ్ పేల్చారు. తాను దాదాపుగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖాయం అయిన సమయంలో ఒక కుట్ర అన్నింటిని తలకిందులు చేసిందని ఆయన అన్నారు. ఈ నిజం ఇప్పటికీ ప్రజలకు తెలియదని చెప్పారు. కొన్నేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి కోసం ఎన్నికల గురించి చర్చ నడిచింది. ఆ సమయంలో సోనియా గాంధీ, కాంగ్రెస్ అగ్ర నాయకత్వం అశోక్ గెహ్లాట్ను జాతీయాధ్యక్షుడిగా నియమించాలని నిర్ణయించింది. అయితే, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు తీసుకున్నారు.
ఈ విషయం గురించి మాట్లాడుతూ.. తాను దాదాపుగా కాంగ్రెస్ అధ్యక్షుడిని అవుతున్న సమయంలో, రాజస్థాన్ పరిస్థితుల్ని పరిశీలించడానికి కాంగ్రెస్ పరిశీలకుల్ని పంపిందని, ఆ తర్వాత పరిస్థితి వేగంగా మారిపోయిందని ఆయన అన్నారు. ఈ మొత్తం సంఘటన వెనక ఒక పెద్ద కుట్ర ఉందని, తనను కాంగ్రెస్ అధ్యక్షుడు కాకుండా అడ్డుకుందని చెప్పారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
ఈ సమయంలో తాను రాజస్థాన్ సీఎం పదవి వదులుకునేందుకు ఇష్టం లేక అధ్యక్ష పదవిని వద్దనుకున్నట్లు ప్రజలు భావించారని, దేశవ్యాప్తంగా కూడా ఇదే పుకార్లు వ్యాపించాయని గెహ్లాట్ అన్నారు. తన సన్నిహితులు, మద్దతుదారులు కూడా ఇదే నమ్మారని చెప్పారు. ఈ కుట్ర తన ప్రతిష్టను దిగజార్చిందని చెప్పారు. కామరాజ్, మహాత్మా గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్ వంటి ప్రముఖ నాయకులను ఉదహరిస్తూ, కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష పదవికి ఎల్లప్పుడూ అత్యంత గౌరవం ఉందని అన్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!