Asaduddin Owaisi: కావాలనే బీజేపీ ముస్లింలను టార్గెట్ చేస్తోంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi on survey of Madrasas in UP, Uttarakhand: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కావాలనే ముస్లిం సమాాజాన్ని టార్గెట్ చేస్తున్నాయంటూ.. ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు మదర్సాలపై సర్వే నిర్వహిస్తున్నాయి. దీన్ని అసదుద్దీన్ వ్యతిరేకిస్తున్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా ఈ చర్య ఉందని బీజేపీపై విమర్శలు గుప్పించారు.
ఇటీవల ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల్లో మదరసాలపై సర్వే చేయాలని నిర్ణయించాయి. దీన్ని అసదుద్దీన్ ఖండించారు. ఇది ముస్లిం సమాజాన్ని టార్గెట్ చేయడమే అని మండిపడ్డారు. ప్రైవేటు పాఠశాలలు, ఆర్ఎస్ఎస్ పాఠశాలలు, మిషనరీ పాఠశాలను ఎందుకు సర్వే చేయడం లేదని.. వాటిల్లో కూడా సర్వేలు జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read
- Congress: సంచలన నిర్ణయాలు దిశగా కాంగ్రెస్.. భారీ నాయకత్వ మార్పుల వైపు అడుగులు?
- Lalit Modi: 'ఆమె డబ్బు కోసం ఆశపడేది కాదు', సుష్మితా సేన్తో తన బ్రేకప్పై మౌనం వీడిన లలిత్ మోడీ..
- Sonam Bail Cancellation: రాజా రఘువంశీ హత్య కేసు.. బెయిల్ పై సోనమ్.. మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
Read Also: Madhya Pradesh: యాక్సిడెంట్ బాధితుడిని బుల్డోజర్లో ఆసుపత్రికి తరలింపు.. వీడియో వైరల్
తమ రాష్ట్రంలోని అన్ని మదరసాలపై సర్వే జరుగుతుందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మంగళవారం తెలియజేసిన తర్వాత ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డారు అసదుద్దీన్ ఓవైసీ. ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మదరసాలపై సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. గుర్తింపు లేని మదరసాలను గుర్తించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. మంగళవారం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో సర్వే ప్రారంభం అయింది.
ఇప్పటికే అస్సాంలో బీజేపీ ప్రభుత్వం అక్కడ అక్రమంగా నిర్వహిస్తున్న మదరసాలపై చర్యలు ఆరంభిస్తోంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో 4 మదరసాలు నేల కూలాయి. అస్సాం రాష్ట్రంలో మదరసా కేంద్రంగా ఉగ్రవాద కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో సీఎం హిమంత బిశ్వ శర్మ రాష్ట్రంలోని అన్ని మదరసాలను సర్వే చేయాలని ఆదేశించారు. ఎవరైనా మదరసాల్లో బోధన చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వస్తే తప్పకుండా ప్రభుత్వం తీసుకువచ్చిన వెబ్ సైట్లో వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు.
తాజావార్తలు
-
KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
-
Mystery Crime Thriller OTT : కంటైనర్లో ఒంటరి మహిళ.. ఓటీటీలోకి మైండ్ బెండ్ చేసే మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Congress: సంచలన నిర్ణయాలు దిశగా కాంగ్రెస్.. భారీ నాయకత్వ మార్పుల వైపు అడుగులు?
-
Housing Loan: అలెర్ట్..అలెర్ట్.. హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొంటున్నారా? ఆర్థిక నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
-
Pawan Kalyan: ప్రెస్మీట్కు అయినా అనుమతి ఇస్తారా?.. పవన్ కల్యాణ్ సెటైర్లు!
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!