Asaduddin Owaisi: మదర్సాల్లో జాతీయగీతం… జ్ఞానవాపి మసీదు సర్వేపై అసదుద్దీన్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మదర్సాల్లో జాతీయ గీతం, జ్ఞానవాపి మసీదు సర్వే అంశాలపై ఎంఐఎం పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యాడు. యూపీలోని యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ మసీదుల్లో జాతీయగీతం జనగణమనను తప్పనిసరి చేసింది. గురువారం నుంచే యూపీలోని అన్ని మసీదుల్లో జాతీయగీతాన్ని ఆలపించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు జ్ఞానవాపి మసీదు సర్వేకు అనుకూలంగా వారణాసి కోర్ట్ ఇచ్చిన తీర్పుపై అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
యోగీ ఆదిత్యనాథ్, బీజేపీ నాకు దేశభక్తి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో సంఘ్ పరివార్ లేదని.. బ్రిటిష్ కు వ్యతిరేఖంగా ఈ మదర్సాలే నిలిచాయని అన్నారు. ఆగస్టు 15, జనవరి 26 తేదీల్లో అన్ని మదర్సాల్లో దేశభక్తి గురించి మాట్లాడుతామని.. మరద్సాలలో దేశం పట్ల ప్రేమ నేర్పుతున్నారని అన్నారు. వాళ్లను అనుమానంగా చూస్తున్నారంటూ.. ఇందుకోసమే అలాంటి చట్టాలు తీసుకువస్తున్నారని మండిపడ్డారు.
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
జ్ఞానవాపి మసీదు సర్వేపై వారణాసి కోర్ట్ తీర్పు 1991 నాటి ప్రార్థన స్థలాల చట్టాన్ని ఉల్లంఘించడమే అని… బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పును ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు. 1947 ఆగస్టు 15 నాటి మతపరమైన స్థలాల స్వభావాన్ని మార్చాలనుకుంటే అది 1991 చట్టం కింద నేరంగా పరిగణించబడుతుందని…యోగీ ప్రభుత్వం అలాంటి వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కోర్ట్ ఇలాంటి వారికి 3 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించవచ్చని అన్నారు. మేము ఒక బాబ్రీ మసీదును కోల్పోయామని… మరో మసీదును కోల్పోవాలని కోరుకోవడం లేదని అన్నారు. జ్ఞానవాపి వివాదంపై ఆల్ ఇండియా పర్సనల్ లాబోర్డ్, మసీదు కమిటీ సుప్రీంకు వెళ్తాయని వెళ్తాయని ఆశిస్తున్నట్లు అసదుద్దీన్ వెల్లడించారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!