Places of Worship Act: ప్రార్థనా స్థలాలపై అసదుద్దీన్ ఒవైసీ పిటిషన్.. నేడే విచారణ..
- దేశవ్యాప్తంగా ప్రార్థనా స్థలాల చట్టం-1991ను అమలు చేయాలని అసదుద్దీన్ ఒవైసీ పిటిషన్..
- ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించాలని ఒవైసీ తన పిటిషన్లో వెల్లడి..
- నేడు అసదుద్దీన్ ఒవైసీ వేసిన పిటిషన్ను విచారించనున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Places of Worship Act: భారతదేశ వ్యాప్తంగా ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనల) చట్టం-1991ను అమలు చేయాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈరోజు (జనవరి2) విచారణ జరపనుంది. కాగా, ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఒవైసీ తన పిటిషన్లో తెలిపారు. ఇప్పటికే, హిందూ పక్షం వ్యాజ్యాలపై పలు మసీదుల సర్వేకు న్యాయస్థానాలు ఆదేశించిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఇక, ఈ అంశంలో విచారణ పెండింగ్లో ఉన్న పిటిషన్లతో అసదుద్దీన్ వ్యాజ్యాన్ని కలిపే ఛాన్స్ ఉంది. అయితే, 1947 ఆగస్టు 15 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రార్థనా స్థలాల మత స్వభావాన్ని మార్చడానికి వీల్లేకుండా 1991లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది.
Read Also: R.Krishnaiah : కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంత మంది మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారు
Also Read
అయితే, ఇటీవల పలు మసీదులు, దర్గాల ప్రాంగణాల్లో సర్వేలు జరపాలంటూ హిందూ సంస్థలు కింది న్యాయస్థానాలను ఆశ్రయించడంతో అలాంటి పిటిషన్లను తీసుకోవద్దని సుప్రీంకోర్టు ధర్మాసనం డిసెంబర్ మాసంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ విశ్వనాథన్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఒవైసీ పిటిషన్ను విచారణ చేయనుంది.
తాజావార్తలు
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
-
Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
-
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!