Asaduddin Owaisi: నితీష్ కుమార్ “గోద్రా అల్లర్ల” సమయంలో బీజేపీలోనే ఉన్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi comments on nitish kumar, mamata banerjee: ఇటీవల ఎన్డీఏ పార్టీకి, బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పారు బీహార్ సీఎం నితీష్ కుమార్. లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీతో కలిసి బీహార్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేసే పనిలో నితీష్ కుమార్ ఉన్నారు. ఇటీవల ఢిల్లీలో మూడు రోజులు పర్యటించి విపక్ష నేతలు రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ వంటి వారిని కలిశారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. గుజరాత్ అహ్మదాబాద్ పర్యటనలో ఉన్న ఆయన ప్రతిపక్షాలపై ఈ విమర్శలు చేశారు.
Read Also: Telangana VC Ravinder Gupta: మరోసారి వివాదంలో వీసీ.. డబ్బులు ఎగురవేస్తూ విద్యార్థులతో నృత్యాలు..
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
ఇదిలా ఉంటే నితీష్ కుమార్ పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. నితీష్ కుమార్ బీజేపీలో ఉంటూనే సీఎం అయ్యారని ఆయన విమర్శించారు. గోద్రా అల్లర్లు, హత్యాకాండ సమయంలో ఆయన బీజేపీతోనే ఉన్నారంటూ విమర్శించారు. 2015లో బీజేపీని వదలిపెట్టి ఆర్జేడీతో కలిసిన ఆయన.. మళ్లీ 2017లో బీజేపీతో చేరారని.. 2019లో నరేంద్ర మోదీని గెలిపించేందుకు ఎన్నికల్లో కలిసి పోటీ చేశారని అన్నారు. ప్రస్తుతం మళ్లీ బీజేపీని వదిలేశారని అన్నారు. గతంలో మమతా బెనర్జీ కూడా ఎన్డీయేలో సభ్యురాలే అని.. ఆర్ఎస్ఎస్ ను పలు సందర్భాల్లో పొగిడారని గుర్తు చేశారు ఓవైసీ.
మేము మైనారిటీ హక్కులు, అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు, వారికి జరగాల్సిన న్యాయం గురించి మాట్లాడేటప్పుడు వీరంతా మమ్మల్ని వివర్శిస్తుంటారని.. అర్థం లేని మాటలు మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వీరంతా సెక్యులరిజం నిపుణులుగా మారి.. ఎవరు సెక్యులర్, ఎవరు మతతత్వ వాదో అని తేల్చే విధంగా వంచనకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. వీరి నాటకాన్ని దేశం గమనిస్తోందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!