Asaduddin Owaisi: నితీష్ కుమార్ “గోద్రా అల్లర్ల” సమయంలో బీజేపీలోనే ఉన్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi comments on nitish kumar, mamata banerjee: ఇటీవల ఎన్డీఏ పార్టీకి, బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పారు బీహార్ సీఎం నితీష్ కుమార్. లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీతో కలిసి బీహార్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేసే పనిలో నితీష్ కుమార్ ఉన్నారు. ఇటీవల ఢిల్లీలో మూడు రోజులు పర్యటించి విపక్ష నేతలు రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ వంటి వారిని కలిశారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. గుజరాత్ అహ్మదాబాద్ పర్యటనలో ఉన్న ఆయన ప్రతిపక్షాలపై ఈ విమర్శలు చేశారు.
Read Also: Telangana VC Ravinder Gupta: మరోసారి వివాదంలో వీసీ.. డబ్బులు ఎగురవేస్తూ విద్యార్థులతో నృత్యాలు..
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
ఇదిలా ఉంటే నితీష్ కుమార్ పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. నితీష్ కుమార్ బీజేపీలో ఉంటూనే సీఎం అయ్యారని ఆయన విమర్శించారు. గోద్రా అల్లర్లు, హత్యాకాండ సమయంలో ఆయన బీజేపీతోనే ఉన్నారంటూ విమర్శించారు. 2015లో బీజేపీని వదలిపెట్టి ఆర్జేడీతో కలిసిన ఆయన.. మళ్లీ 2017లో బీజేపీతో చేరారని.. 2019లో నరేంద్ర మోదీని గెలిపించేందుకు ఎన్నికల్లో కలిసి పోటీ చేశారని అన్నారు. ప్రస్తుతం మళ్లీ బీజేపీని వదిలేశారని అన్నారు. గతంలో మమతా బెనర్జీ కూడా ఎన్డీయేలో సభ్యురాలే అని.. ఆర్ఎస్ఎస్ ను పలు సందర్భాల్లో పొగిడారని గుర్తు చేశారు ఓవైసీ.
మేము మైనారిటీ హక్కులు, అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు, వారికి జరగాల్సిన న్యాయం గురించి మాట్లాడేటప్పుడు వీరంతా మమ్మల్ని వివర్శిస్తుంటారని.. అర్థం లేని మాటలు మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వీరంతా సెక్యులరిజం నిపుణులుగా మారి.. ఎవరు సెక్యులర్, ఎవరు మతతత్వ వాదో అని తేల్చే విధంగా వంచనకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. వీరి నాటకాన్ని దేశం గమనిస్తోందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..