Asaduddin Owaisi: నితీష్ కుమార్ “గోద్రా అల్లర్ల” సమయంలో బీజేపీలోనే ఉన్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi comments on nitish kumar, mamata banerjee: ఇటీవల ఎన్డీఏ పార్టీకి, బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పారు బీహార్ సీఎం నితీష్ కుమార్. లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీతో కలిసి బీహార్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేసే పనిలో నితీష్ కుమార్ ఉన్నారు. ఇటీవల ఢిల్లీలో మూడు రోజులు పర్యటించి విపక్ష నేతలు రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ వంటి వారిని కలిశారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. గుజరాత్ అహ్మదాబాద్ పర్యటనలో ఉన్న ఆయన ప్రతిపక్షాలపై ఈ విమర్శలు చేశారు.
Read Also: Telangana VC Ravinder Gupta: మరోసారి వివాదంలో వీసీ.. డబ్బులు ఎగురవేస్తూ విద్యార్థులతో నృత్యాలు..
Also Read
- UPI Transactions: యూపీఐ సేవలు ఉచితం కాదు.. ఆర్బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
- Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే నితీష్ కుమార్ పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. నితీష్ కుమార్ బీజేపీలో ఉంటూనే సీఎం అయ్యారని ఆయన విమర్శించారు. గోద్రా అల్లర్లు, హత్యాకాండ సమయంలో ఆయన బీజేపీతోనే ఉన్నారంటూ విమర్శించారు. 2015లో బీజేపీని వదలిపెట్టి ఆర్జేడీతో కలిసిన ఆయన.. మళ్లీ 2017లో బీజేపీతో చేరారని.. 2019లో నరేంద్ర మోదీని గెలిపించేందుకు ఎన్నికల్లో కలిసి పోటీ చేశారని అన్నారు. ప్రస్తుతం మళ్లీ బీజేపీని వదిలేశారని అన్నారు. గతంలో మమతా బెనర్జీ కూడా ఎన్డీయేలో సభ్యురాలే అని.. ఆర్ఎస్ఎస్ ను పలు సందర్భాల్లో పొగిడారని గుర్తు చేశారు ఓవైసీ.
మేము మైనారిటీ హక్కులు, అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు, వారికి జరగాల్సిన న్యాయం గురించి మాట్లాడేటప్పుడు వీరంతా మమ్మల్ని వివర్శిస్తుంటారని.. అర్థం లేని మాటలు మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వీరంతా సెక్యులరిజం నిపుణులుగా మారి.. ఎవరు సెక్యులర్, ఎవరు మతతత్వ వాదో అని తేల్చే విధంగా వంచనకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. వీరి నాటకాన్ని దేశం గమనిస్తోందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
UPI Transactions: యూపీఐ సేవలు ఉచితం కాదు.. ఆర్బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..
-
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
-
Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
-
Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!