Asaduddin Owaisi: నితీష్ కుమార్ “గోద్రా అల్లర్ల” సమయంలో బీజేపీలోనే ఉన్నారు.
Asaduddin Owaisi comments on nitish kumar, mamata banerjee: ఇటీవల ఎన్డీఏ పార్టీకి, బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పారు బీహార్ సీఎం నితీష్ కుమార్. లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీతో కలిసి బీహార్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేసే పనిలో నితీష్ కుమార్ ఉన్నారు. ఇటీవల ఢిల్లీలో మూడు రోజులు పర్యటించి విపక్ష నేతలు రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ వంటి వారిని కలిశారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. గుజరాత్ అహ్మదాబాద్ పర్యటనలో ఉన్న ఆయన ప్రతిపక్షాలపై ఈ విమర్శలు చేశారు.
Read Also: Telangana VC Ravinder Gupta: మరోసారి వివాదంలో వీసీ.. డబ్బులు ఎగురవేస్తూ విద్యార్థులతో నృత్యాలు..
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
ఇదిలా ఉంటే నితీష్ కుమార్ పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. నితీష్ కుమార్ బీజేపీలో ఉంటూనే సీఎం అయ్యారని ఆయన విమర్శించారు. గోద్రా అల్లర్లు, హత్యాకాండ సమయంలో ఆయన బీజేపీతోనే ఉన్నారంటూ విమర్శించారు. 2015లో బీజేపీని వదలిపెట్టి ఆర్జేడీతో కలిసిన ఆయన.. మళ్లీ 2017లో బీజేపీతో చేరారని.. 2019లో నరేంద్ర మోదీని గెలిపించేందుకు ఎన్నికల్లో కలిసి పోటీ చేశారని అన్నారు. ప్రస్తుతం మళ్లీ బీజేపీని వదిలేశారని అన్నారు. గతంలో మమతా బెనర్జీ కూడా ఎన్డీయేలో సభ్యురాలే అని.. ఆర్ఎస్ఎస్ ను పలు సందర్భాల్లో పొగిడారని గుర్తు చేశారు ఓవైసీ.
మేము మైనారిటీ హక్కులు, అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు, వారికి జరగాల్సిన న్యాయం గురించి మాట్లాడేటప్పుడు వీరంతా మమ్మల్ని వివర్శిస్తుంటారని.. అర్థం లేని మాటలు మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వీరంతా సెక్యులరిజం నిపుణులుగా మారి.. ఎవరు సెక్యులర్, ఎవరు మతతత్వ వాదో అని తేల్చే విధంగా వంచనకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. వీరి నాటకాన్ని దేశం గమనిస్తోందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!