Asaduddin Owaisi assault case: అసదుద్దీన్ ఓవైసీ హత్యా నిందితులకు బెయిల్.. యూపీ ప్రభుత్వ స్పందన కోరిన సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi assault case: ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఉత్తర్ ప్రదేశ్ పర్యటిస్తున్న ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీపై ఇద్దరు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఇద్దరు నిందితులకు తాజగా బెయిల్ లభించింది. అయితే వారికి బెయిల్ లభించడాన్ని సవాల్ చేస్తూ అసదుద్దీన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా శుక్రవారం ఈ అంశంపై సుప్రీంకోర్టు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర స్పందన కోరింది. న్యాయమూర్తులు ఎంఆర్ షా, కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వంతో పాటు ఇద్దరు నిందితులు సచిన్ శర్మ, శుభమ్ గుర్జార్లకు నోటీసులు జారీ చేసింది. మూడో నిందితుడు అలీమ్ కు మంజూరైన బెయిల్ ను సవాల్ చేయడాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
Read Also: Russia-Ukraine War: ఉక్రెయిన్ భూభాగాలు రష్యాలో విలీనం.. అధికారికంగా ప్రకటించిన పుతిన్
Also Read
- PM Modi’s Message to Gen Z: రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు.. షార్ట్కట్లు వద్దు.. జెన్-జెడ్కు మోడీ సందేశం
- Ram Nath Kovind Autobiography: సామాన్య కుటుంబం నుంచి రాష్ట్రపతి వరకు.. కోవింద్ జీవితంఆదర్శం-ప్రధాని మోడీ
- Explainer: రెస్టారెంట్ కిచెన్లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
- Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
ఈ కేసును సుప్రీంకోర్టు నవంబర్ 11కు వాయిదా వేసింది. ఫిబ్రవరి 3న ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఓ రాజకీయ కార్యక్రమానికి హాజరై, ఢిల్లీ వస్తున్న క్రమంలో అసదుద్దీన్ ఓవైసీపై దాడి జరిగింది. ఈ దాడి నుంచి ఆయన తప్పించుకున్నారు. హాపూర్ లో ఓ టోల్ గేట్ సమీపంలోకి అసదుద్దీన్ కారు రాగానే నిందితులు దాడికి ప్రయత్నించారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. పక్షపాతం, ద్వేషానికి సంబంధించిన నేరానికి ఇది ఉదాహరణ అని.. ఇది హత్యాయత్నానికి దారి తీసిందని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ లో అసదుద్దీన్ పేర్కొన్నారు. నిందితుడు సచిన్ బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత పిటీషనర్ ను బెదిరించాడని పిటిషన్ లో పేర్కొన్నాడు.
ఈ కేసులో నిందితులు తమ ప్రమేయం లేదని చెప్పలేదని.. పైగా నేరం పట్ల గర్వంగా భావిస్తున్నారంటూ అసదుద్దీన్ తరుపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసులో సీసీ కెమెరాల ఆధారాలు కీలకంగా మారాయి. నిందితులు ఇద్దరి నుంచి రెండు పిస్టల్స్, ఓ ఆల్టో కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులిద్దరిపై 307 సెక్షన్ హత్యా నేరం కింది పిలుఖువా పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు అయింది.
తాజావార్తలు
-
Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. ‘బాండెడ్ క్రైట్’గా గుర్తించిన అటవీ అధికారులు!
-
PM Modi’s Message to Gen Z: రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు.. షార్ట్కట్లు వద్దు.. జెన్-జెడ్కు మోడీ సందేశం
-
Independence Day Special: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కథలు… ఇండిపెండెన్స్ డేకి మస్ట్ వాచ్ సినిమాలు!
-
HCU Drugs: హెచ్సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
-
Hardik Pandya: “కెప్టెన్సీ ఇస్తేనే వస్తా”.. గుజరాత్ ఫ్రాంచైజీకి హార్దిక్ పాండ్యా షాక్..
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!