Arvind Kejriwal: కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయకపోవడంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేయకుండా అక్కడ నుంచే విధులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే సీఎం పదవికి రాజీనామా చేయని కేజ్రీవాల్పై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తీవ్రస్థాయిలో మండిపడింది. సీఎం పదవికి రాజీనామా చేయకుండా ఆయన జాతీయ ప్రయోజనాల కన్నా వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారని వ్యాఖ్యానించింది. ఆప్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వానికి “అధికారంపై మాత్రమే ఆసక్తి” ఉందని కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ని ఈడీ గత నెలలో అరెస్ట్ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందుబాటులో లేవని ఢిల్లీ ప్రభుత్వాన్ని కోర్టు నిలదీసింది. విద్యార్థులకు పుస్తకాలు లేకుంటే ఢిల్లీ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని పేర్కొంది. ‘‘మీ క్లయింట్(కేజ్రీవాల్) కేవలం అధికారంపై ఆసక్తి కలిగి ఉన్నాడు. మీరు ఎంత అధికారం కావలో మాకు తెలియదు’’ అని కోర్టు చీవాట్లు పెట్టింది. విద్యార్థులు, చదువుతున్న పిల్లల ఆసక్తి కంటే మీరు మీ ఆసక్తిని ఎక్కువగా ఉందని చెప్పడానికి నేను చింతిస్తున్నాను, మీరు మీ రాజకీయ ఆసక్తిని ఉన్నత స్థానంలో ఉంచారని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్, జస్టిస్ మన్మీత్ పీఎస్ అరోరాలో కూడిన ధర్మాసనం పేర్కొంది.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
Read Also: Uttarpradesh : ఉత్తరాఖండ్ అడవిలో చెలరేగిన మంటలు.. ముగ్గురు అరెస్ట్
నోట్బుక్లు, స్టేషనరీ వస్తువులు, యూనిఫాంలు మరియు స్కూల్ బ్యాగ్లు పంపిణీ చేయకపోవడానికి ప్రధాన కారణాలలో ఒకటి అని మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) కమిషనర్ కోర్టుకు వెల్లడించారు. రూ. 5 కోట్ల కంటే ఎక్కువ విలువైన కాంట్రాక్టులను రివార్డ్ చేసే అధికారం ఉన్న స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయకపోవడం వల్లే సౌకర్యాల పంపిణీ జరగలేదని గతంలో ఎంసీడీ కమిషనర్ ప్రకటించారు. స్టాండింగ్ కమిటీ లేనప్పుడు శూన్యత ఉండకూడదని, అటువంటి పరిస్థితిలో, ఆర్థిక అధికారాన్ని ఢిల్లీ ప్రభుత్వం వెంటనే మరొక అథారిటీకి అప్పగించాలని కోర్టు ప్రాథమికంగా పేర్కొంది.
అయితే, రూ.5 కోట్ల కంటే విలువైన కాంట్రాక్టులు ఇచ్చే అధికారం ఉన్న ప్రతినిధి బృందం ఏర్పాటుకు కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి సమ్మతి అవసరంమని ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ నుంచి తమకు ఆదేశాలు అందాయని ఢిల్లీ ప్రభుత్వం తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనికి న్యాయస్థానం.. సీఎం కస్టడీలో ఉన్నప్పటికీ ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పడం మీ ఇష్టం, మేము వెళ్లకూడదనుకున్న దారిలో వెళ్లమని మీరు మమ్మల్ని బలవంతం చేస్తున్నారంటూ మండిపడింది. విద్యార్థుల కష్టాలను చూసి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మొసలి కన్నీరు కారుస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
-
T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!