Arvind Kejriwal: కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయకపోవడంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేయకుండా అక్కడ నుంచే విధులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే సీఎం పదవికి రాజీనామా చేయని కేజ్రీవాల్పై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తీవ్రస్థాయిలో మండిపడింది. సీఎం పదవికి రాజీనామా చేయకుండా ఆయన జాతీయ ప్రయోజనాల కన్నా వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారని వ్యాఖ్యానించింది. ఆప్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వానికి “అధికారంపై మాత్రమే ఆసక్తి” ఉందని కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ని ఈడీ గత నెలలో అరెస్ట్ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందుబాటులో లేవని ఢిల్లీ ప్రభుత్వాన్ని కోర్టు నిలదీసింది. విద్యార్థులకు పుస్తకాలు లేకుంటే ఢిల్లీ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని పేర్కొంది. ‘‘మీ క్లయింట్(కేజ్రీవాల్) కేవలం అధికారంపై ఆసక్తి కలిగి ఉన్నాడు. మీరు ఎంత అధికారం కావలో మాకు తెలియదు’’ అని కోర్టు చీవాట్లు పెట్టింది. విద్యార్థులు, చదువుతున్న పిల్లల ఆసక్తి కంటే మీరు మీ ఆసక్తిని ఎక్కువగా ఉందని చెప్పడానికి నేను చింతిస్తున్నాను, మీరు మీ రాజకీయ ఆసక్తిని ఉన్నత స్థానంలో ఉంచారని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్, జస్టిస్ మన్మీత్ పీఎస్ అరోరాలో కూడిన ధర్మాసనం పేర్కొంది.
Also Read
- IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
- NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
- India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
Read Also: Uttarpradesh : ఉత్తరాఖండ్ అడవిలో చెలరేగిన మంటలు.. ముగ్గురు అరెస్ట్
నోట్బుక్లు, స్టేషనరీ వస్తువులు, యూనిఫాంలు మరియు స్కూల్ బ్యాగ్లు పంపిణీ చేయకపోవడానికి ప్రధాన కారణాలలో ఒకటి అని మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) కమిషనర్ కోర్టుకు వెల్లడించారు. రూ. 5 కోట్ల కంటే ఎక్కువ విలువైన కాంట్రాక్టులను రివార్డ్ చేసే అధికారం ఉన్న స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయకపోవడం వల్లే సౌకర్యాల పంపిణీ జరగలేదని గతంలో ఎంసీడీ కమిషనర్ ప్రకటించారు. స్టాండింగ్ కమిటీ లేనప్పుడు శూన్యత ఉండకూడదని, అటువంటి పరిస్థితిలో, ఆర్థిక అధికారాన్ని ఢిల్లీ ప్రభుత్వం వెంటనే మరొక అథారిటీకి అప్పగించాలని కోర్టు ప్రాథమికంగా పేర్కొంది.
అయితే, రూ.5 కోట్ల కంటే విలువైన కాంట్రాక్టులు ఇచ్చే అధికారం ఉన్న ప్రతినిధి బృందం ఏర్పాటుకు కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి సమ్మతి అవసరంమని ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ నుంచి తమకు ఆదేశాలు అందాయని ఢిల్లీ ప్రభుత్వం తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనికి న్యాయస్థానం.. సీఎం కస్టడీలో ఉన్నప్పటికీ ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పడం మీ ఇష్టం, మేము వెళ్లకూడదనుకున్న దారిలో వెళ్లమని మీరు మమ్మల్ని బలవంతం చేస్తున్నారంటూ మండిపడింది. విద్యార్థుల కష్టాలను చూసి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మొసలి కన్నీరు కారుస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది.
తాజావార్తలు
-
IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
-
NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
-
Laikey Laikaa: రాషా థడానీ ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ ఆగిపోలేదు.. వాలెంటైన్స్ డేకు వస్తోంది..
-
China: వేలాది కుటుంబాల కన్నీటి వేదన..నిజాలను సమాధి చేసే పాలన.. చైనా నిజస్వరూపం ఇదే!
-
TVS, Vida, Zelio, Bounce: బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. రూ.36,000కే చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్..!
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!