Arvind Kejriwal: కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయకపోవడంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేయకుండా అక్కడ నుంచే విధులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే సీఎం పదవికి రాజీనామా చేయని కేజ్రీవాల్పై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తీవ్రస్థాయిలో మండిపడింది. సీఎం పదవికి రాజీనామా చేయకుండా ఆయన జాతీయ ప్రయోజనాల కన్నా వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారని వ్యాఖ్యానించింది. ఆప్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వానికి “అధికారంపై మాత్రమే ఆసక్తి” ఉందని కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ని ఈడీ గత నెలలో అరెస్ట్ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందుబాటులో లేవని ఢిల్లీ ప్రభుత్వాన్ని కోర్టు నిలదీసింది. విద్యార్థులకు పుస్తకాలు లేకుంటే ఢిల్లీ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని పేర్కొంది. ‘‘మీ క్లయింట్(కేజ్రీవాల్) కేవలం అధికారంపై ఆసక్తి కలిగి ఉన్నాడు. మీరు ఎంత అధికారం కావలో మాకు తెలియదు’’ అని కోర్టు చీవాట్లు పెట్టింది. విద్యార్థులు, చదువుతున్న పిల్లల ఆసక్తి కంటే మీరు మీ ఆసక్తిని ఎక్కువగా ఉందని చెప్పడానికి నేను చింతిస్తున్నాను, మీరు మీ రాజకీయ ఆసక్తిని ఉన్నత స్థానంలో ఉంచారని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్, జస్టిస్ మన్మీత్ పీఎస్ అరోరాలో కూడిన ధర్మాసనం పేర్కొంది.
Also Read
- US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
- PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
- Udhampur Anti-Terror Operation: ఉధంపూర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
Read Also: Uttarpradesh : ఉత్తరాఖండ్ అడవిలో చెలరేగిన మంటలు.. ముగ్గురు అరెస్ట్
నోట్బుక్లు, స్టేషనరీ వస్తువులు, యూనిఫాంలు మరియు స్కూల్ బ్యాగ్లు పంపిణీ చేయకపోవడానికి ప్రధాన కారణాలలో ఒకటి అని మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) కమిషనర్ కోర్టుకు వెల్లడించారు. రూ. 5 కోట్ల కంటే ఎక్కువ విలువైన కాంట్రాక్టులను రివార్డ్ చేసే అధికారం ఉన్న స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయకపోవడం వల్లే సౌకర్యాల పంపిణీ జరగలేదని గతంలో ఎంసీడీ కమిషనర్ ప్రకటించారు. స్టాండింగ్ కమిటీ లేనప్పుడు శూన్యత ఉండకూడదని, అటువంటి పరిస్థితిలో, ఆర్థిక అధికారాన్ని ఢిల్లీ ప్రభుత్వం వెంటనే మరొక అథారిటీకి అప్పగించాలని కోర్టు ప్రాథమికంగా పేర్కొంది.
అయితే, రూ.5 కోట్ల కంటే విలువైన కాంట్రాక్టులు ఇచ్చే అధికారం ఉన్న ప్రతినిధి బృందం ఏర్పాటుకు కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి సమ్మతి అవసరంమని ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ నుంచి తమకు ఆదేశాలు అందాయని ఢిల్లీ ప్రభుత్వం తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనికి న్యాయస్థానం.. సీఎం కస్టడీలో ఉన్నప్పటికీ ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పడం మీ ఇష్టం, మేము వెళ్లకూడదనుకున్న దారిలో వెళ్లమని మీరు మమ్మల్ని బలవంతం చేస్తున్నారంటూ మండిపడింది. విద్యార్థుల కష్టాలను చూసి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మొసలి కన్నీరు కారుస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది.
తాజావార్తలు
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
-
ViewSonic Google TV Series: భారత్లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!