Arvind Kejriwal: జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపగలనని ప్రధాని మోడీకి చూపిస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయనని మరోసారి స్పష్టం చేశారు. శుక్రవారం ఓ జాతీయ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన పదవికి రాజీనామా చేస్తే దేశ ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుందని అన్నారు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపగలనని ప్రధాని నరేంద్రమోడీకి చూపించబోతున్నానని అన్నారు. తన రాజీనామా గురించి మాట్లాడుతూ..‘‘ నరేంద్రమోడీకి కావాల్సింది ఇదే. ఎన్నికల్లో కేజ్రీవాల్ని ఓడించలేనని ఆయనకు తెలుసు. అందుకే ఈ ప్లాన్కి శ్రీకారం చుట్టారు. వారి తదుపరి లక్ష్యం పశ్చమ బెంగాల్, తమిళనాడు సీఎంలు మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్. తాను రాజీనామా చేస్తే దేశ ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుంది’’ అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
Read Also: T. Harish Rao: బస్సు తప్పా అన్ని పథకాలు తుస్సే.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు
Also Read
- Mumbai: భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని అతలాకుతలం.. 12 గంటల్లో 200 మి.మీ రికార్డ్ వర్షం
- PoK: పీఓకేలో పాక్ అణచివేత.. భారత్ జోక్యం కోరిన JAAC
- Stocks Double: రూ. లక్షకు రూ.2 లక్షలు.. రూ.3 లక్షలకు రూ.6 లక్షలు.. ఇలాంటి స్టాక్స్ మనం ఎలా మిస్సయామబ్బా..
- Ketan Agarwal Case: ‘పురుషులకు రక్షణ లేదు’.. జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలన్న ఎంపీ మిట్టల్
తనకు ఏ పదవిపై అత్యాశ లేదని చెప్పారు. ఢిల్లీలో మురికివాడల్లో పనిచేయడం కోసం ఇన్కమ్ ట్యాక్స్ మేనేజర్ ఉద్యోగాన్ని వదిలేశానని, 49 రోజులకే ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేశానని, కానీ ఈ రోజు నా పోరాటంలో భాగంగానే రాజీనామా చేయడం లేదని, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని కేజ్రీవాల్ అన్నారు. సీఎం పదవికి రాజీనామాపై వారు పిల్ కూడా దాఖలు చేశారు, కానీ సుప్రీంకోర్టు రాజీనామా చేయమని బలవంతం చేయలేమని చెప్పిందని ఆయన గుర్తు చేశారు. సీఎంగా తన విధుల్ని నిర్వర్తించడానికి నాకు జైలులో ప్రాథమిక సౌకర్యాలను కల్పించాలని కోర్టును కోరుతానని చెప్పారు.
ఎక్కడ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయానా ప్రధాని మోడీ ప్రతిపక్ష ముఖ్యమంత్రుల్ని, ఇతర నేతల్ని అరెస్ట్ చేస్తారని, నేను రాజీనామా చేయకుంటే ఇతర ముఖ్యమంత్రులను ప్రధాని టచ్ చేయడానికి సాహసించరని అన్నారు. ఢిల్లి లిక్కర్ స్కామ్లో ఈడీ మార్చి 12న కేజ్రీవాల్ని అరెస్ట్ చేసింది. అయితే, ఎన్నికల్లో ప్రచారం కోసం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న లొంగిపోవాలని ఆదేశించింది.
తాజావార్తలు
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Kannappa: యూట్యూబ్లో విష్ణు మంచు ‘కన్నప్ప’
-
Story Bord : పార్లమెంట్ మాన్సూన్ సెషన్ కీలకం కాబోతుందా..?
-
CM Chandrababu: ‘స్వర్ణ కుప్పం విజన్ 2029’కు శ్రీకారం.. కుప్పం రూపురేఖలు మార్చే మాస్టర్ ప్లాన్పై సీఎం సమీక్ష
-
Mumbai: భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని అతలాకుతలం.. 12 గంటల్లో 200 మి.మీ రికార్డ్ వర్షం
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..