Kejriwal: జైల్లో చంపేందుకు బీజేపీ కుట్ర.. కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
- జైల్లో చంపేందుకు బీజేపీ కుట్ర
- కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
- ఢిల్లీ ఓటర్లకు కేజ్రీవాల్ లేఖ
- రాజీనామాకు గల కారణాలతో లెటర్
- ఇంటింటికీ పంపిణీ చేయనున్న కార్యకర్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తీహార్ జైల్లో తనను చంపేందుకు బీజేపీ కుట్ర చేసిందని మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. పార్టీ ప్రజా ప్రచార కార్యక్రమంలో భాగంగా జరిగిన ర్యాలీలో కేజ్రీవాల్ ప్రసంగించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తీహార్ జైల్లో ఉన్నప్పుడు తనకు ఇన్సులిన్ ఇచ్చేందుకు నిరాకరించారని.. సకాలంలో ఇంజెక్షన్ తీసుకోకపోతే చనిపోయే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు తీహార్ జైల్లో చంపేందుకు బీజేపీ కుట్ర చేసిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే.. ఉచిత విద్యుత్ పథకం ఎత్తేస్తారన్నారు. పదేళ్లుగా ఢిల్లీ అభివృద్ధి పనులను బీజేపీ నిలిపివేసిందని కేజ్రీవాల్ ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Iddaru: రిలీజ్కు రెడీ అయిన కళాతపస్వి కె విశ్వనాథ్ చివరి సినిమా.. ఎప్పుడంటే?
Also Read
- Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
- Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
ఇక తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, ఢిల్లీలో ప్రజల కోసం పనిచేస్తున్నందున తనను జైలుకు పంపారని తెలిపారు. తాను బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత పగిలిన రోడ్ల మరమ్మతులు, డ్రైనేజీలు శుభ్రం చేయడం, నీటి సరఫరా నిరాంతరాయంగా ఆప్ ప్రభుత్వం కొనసాగిస్తుందని చెప్పారు.
ఇది కూడా చదవండి: Viral News: ఏఐ ద్వారా సీవీని రూపొందించిన నిరుద్యోగి.. దాన్ని చూసి కంపెనీ సీఈవో షాక్..
ఇక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి గల కారణాలను వివరిస్తూ ఢిల్లీ ఓటర్లకు కేజ్రీవాల్ లేఖ రాశారు. ఈ లేఖను ఆప్ కార్యకర్తలు అక్టోబర్ 29 వరకు 70 నియోజకవర్గాల్లోని ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేస్తారు. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. మరోసారి అధికారం కోసం ప్రణాళికలు రచిచూస్తోంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి తీహార్ జైల్లో పెట్టారు. ఆరు నెలల తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఇంటికి వచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో అతిషిని ముఖ్యమంత్రిని చేశారు.
తాజావార్తలు
-
Iran War: మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు..
-
Maa Inti Bangaram: 73 కోట్ల వసూళ్లతో అన్-స్టాపబుల్ ‘బంగారం’!
-
Joker : నిర్మాతగా బన్నీ బెస్ట్ ఫ్రెండ్.. అల్లు అరవింద్ క్లాప్’తో ‘జోకర్’ గ్రాండ్ లాంచ్!
-
Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..