Sunita Kejriwal: కేజ్రీవాల్ సింహం.. ఎక్కువ కాలం జైలులో ఉంచలేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunita Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేయడంపై ఈ రోజు రామ్ లీలా మైదానంలో ‘లోక్తంత్ర బచావో’ పేరుతో ఇండియా కూటమి మెగా ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తన భర్త సింహమని, చాలా కాలం ఆయనను జైలులో ఉంచలేరని ఆమె అన్నారు.
Read Also: MK Stalin: బీజేపీలో 261 మంది రౌడీలు ఉన్నారు.. ప్రధాని మోడీపై స్టాలిన్ ఆరోపణ..
Also Read
- School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్పై మంత్రి కీలక ప్రకటన
- IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్లో నిరసనలు
- iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
- Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
ఇండియా కూటమి నేతృత్వంలో జరిగిన ఆ కార్యక్రమానికి పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, రాహుల్ గాంధీ, ఉద్ధవ్ ఠాక్రే, ప్రియాంకాగాంధీ, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, సంజయ్ రౌత్, తేజస్వీ యాదవ్, హేమంత్ సోరెన్ భార్య కల్పనా సొరెన్ తదితరులు హాజరయ్యారు. ప్రధాని నరేంద్రమోడీ నా భర్తను జైల్లో ఉంచలేరని, ప్రధాని చేసింది సరైనదా..? అని ప్రశ్నించారు. కేజ్రీవాల్ నిజమైన దేశభక్తుడని చెప్పారు. తాను ఈ రోజు ఓట్లు అడగం లేదని, నేను 140 కోట్ల మంది భారతీయులను కొత్త భారతదేశాన్ని తయారు చేయడానికి ఆహ్వానిస్తున్నాని సునీతా కేజ్రీవాల్ అన్నారు. ఇండియా కూటమికి ఒక అవకాశం ఇస్తే, తాము న్యూ ఇండియాను నిర్మిస్తామని అరవింద్ కేజ్రీవాల్ సందేశాన్ని ఆమె చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ ప్రజలకు ఆప్ 6 హామీలను ప్రకటించింది.
ఇదిలా ఉంటే ప్రతిపక్షాలు నిర్వహించిన ర్యాలీపై బీజేపీ మండిపడింది. బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది మాట్లాడుతూ.. తమ పాత నేరాలను దాచడానికి ఈ పార్టీలన్నీ రాంలీలా మైదాన్ని ఉపయోగించుకున్నాయని ఆయన విమర్శించారు. బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ మాట్లాడుతూ.. రామ్ లీలా మైదానంలో అవినీతిపరుల ముఠా అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు కేజ్రీవాల్ని ఈ వ్యక్తులంతా అవినీతిపరులని పిలిచి, అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ర్యాలీ నిర్వహించడంలో ఎలాంటి ఆంక్షలు లేవని, అయితే అవినీతిలో కూరుకుపోయిన వారు, ప్రజా ధనాన్ని దోచుకుని జైలుకు వెళ్లిన వారు నిజాయితీ ముసుగులో కొత్త తరహా రాజకీయాలు చేస్తున్నారని, ఇప్పుడు జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
Oppo K14 Plus 5G: ఒప్పో K14 Plus 5G త్వరలో భారత్లో లాంచ్.. పనితీరు, డ్యూరబిలిటీపై ఫోకస్
-
Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
-
School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్పై మంత్రి కీలక ప్రకటన
-
Mahindra XUV 3X0 REVX Edge: మహీంద్రా XUV 3XO REVX Edge (O) లాంచ్.. సన్రూఫ్, 6 ఎయిర్బ్యాగ్స్తో అదిరిపోయే ఫీచర్లు
-
BCCI Umpires: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై అంపైర్లు అప్రమత్తంగా ఉండాల్సిందే.. లేదంటే..!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!