Sunita Kejriwal: కేజ్రీవాల్ సింహం.. ఎక్కువ కాలం జైలులో ఉంచలేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunita Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేయడంపై ఈ రోజు రామ్ లీలా మైదానంలో ‘లోక్తంత్ర బచావో’ పేరుతో ఇండియా కూటమి మెగా ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తన భర్త సింహమని, చాలా కాలం ఆయనను జైలులో ఉంచలేరని ఆమె అన్నారు.
Read Also: MK Stalin: బీజేపీలో 261 మంది రౌడీలు ఉన్నారు.. ప్రధాని మోడీపై స్టాలిన్ ఆరోపణ..
Also Read
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
ఇండియా కూటమి నేతృత్వంలో జరిగిన ఆ కార్యక్రమానికి పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, రాహుల్ గాంధీ, ఉద్ధవ్ ఠాక్రే, ప్రియాంకాగాంధీ, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, సంజయ్ రౌత్, తేజస్వీ యాదవ్, హేమంత్ సోరెన్ భార్య కల్పనా సొరెన్ తదితరులు హాజరయ్యారు. ప్రధాని నరేంద్రమోడీ నా భర్తను జైల్లో ఉంచలేరని, ప్రధాని చేసింది సరైనదా..? అని ప్రశ్నించారు. కేజ్రీవాల్ నిజమైన దేశభక్తుడని చెప్పారు. తాను ఈ రోజు ఓట్లు అడగం లేదని, నేను 140 కోట్ల మంది భారతీయులను కొత్త భారతదేశాన్ని తయారు చేయడానికి ఆహ్వానిస్తున్నాని సునీతా కేజ్రీవాల్ అన్నారు. ఇండియా కూటమికి ఒక అవకాశం ఇస్తే, తాము న్యూ ఇండియాను నిర్మిస్తామని అరవింద్ కేజ్రీవాల్ సందేశాన్ని ఆమె చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ ప్రజలకు ఆప్ 6 హామీలను ప్రకటించింది.
ఇదిలా ఉంటే ప్రతిపక్షాలు నిర్వహించిన ర్యాలీపై బీజేపీ మండిపడింది. బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది మాట్లాడుతూ.. తమ పాత నేరాలను దాచడానికి ఈ పార్టీలన్నీ రాంలీలా మైదాన్ని ఉపయోగించుకున్నాయని ఆయన విమర్శించారు. బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ మాట్లాడుతూ.. రామ్ లీలా మైదానంలో అవినీతిపరుల ముఠా అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు కేజ్రీవాల్ని ఈ వ్యక్తులంతా అవినీతిపరులని పిలిచి, అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ర్యాలీ నిర్వహించడంలో ఎలాంటి ఆంక్షలు లేవని, అయితే అవినీతిలో కూరుకుపోయిన వారు, ప్రజా ధనాన్ని దోచుకుని జైలుకు వెళ్లిన వారు నిజాయితీ ముసుగులో కొత్త తరహా రాజకీయాలు చేస్తున్నారని, ఇప్పుడు జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
-
AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!