Delhi: భార్య హోటల్ వీడియోలు ఇవ్వాలని ఆర్మీ మేజర్ పిటిషన్.. కోర్టు ఏం చేసిందంటే..!
- భార్య హోటల్ వీడియోలు ఇవ్వాలని ఆర్మీ మేజర్ పిటిషన్
- విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన భార్య జూనియర్ అధికారితో వివాహేతర సంబంధం పెట్టుకుందని.. ప్రియుడితో హోటల్లో ఏకాంతంగా గడిపిన సీసీటీవీ ఫుటేజ్ను ఇవ్వాలని భారత సైన్యంలో మేజర్గా పని చేస్తున్న ఒక అధికారి ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశాడు. పిటిషన్ విచారించిన పాటియాలా హౌస్ కోర్టు న్యాయమూర్తి వైభవ్ ప్రతాప్ సింగ్ కొట్టేశారు. హోటల్లో బుకింగ్ వివరాలు, సీసీటీవీ ఫుటేజ్ అనేది గోప్యతకు సంబంధించిన విషయాలు అని తెలిపింది. ఒక వ్యక్తి.. మరొక వ్యక్తి భార్యను దొంగిలించాడనే ఆలోచన పాత విషయం అని వ్యాఖ్యానించారు. సీసీటీవీ ఫుటేజ్ కోరడమంటే మహిళల నుంచి స్వతంత్రతను తీసివేస్తుందని.. అంతేకాకుండా వారిని అమానవీయంగా మారుస్తుందని న్యాయమూర్తి పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Mahesh Babu : ఖలేజా రీ-రిలీజ్కు ఊహించని బుకింగ్స్..
Also Read
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్పింగ్.. బ్రిక్స్పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
- ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
భార్య.. తన జూనియర్ అధికారితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆర్మీ మేజర్ అనుమానించాడు. దీంతో ఆమెతో విడాకులు తీసుకునేందుకు సిద్ధపడ్డాడు. అయితే వివాహేతర సంబంధాన్ని బయటపెట్టేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. అందుకు ఆధారాలు లభించలేదు. అయితే భార్య.. ప్రియుడితో కలిసి హోటల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను బయటపెట్టాలని అనుకున్నాడు. కానీ ఫుటేజ్ ఇచ్చేందుకు హోటల్ సిబ్బంది నిరాకరించారు. దీంతో మేజర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. తనకు సీసీటీవీ ఫుటేజ్ ఇప్పించాలని అభ్యర్థించాడు. కానీ కోర్టు అందుకు అంగీకరించలేదు. ప్రైవేటు వివాదాలకు దర్యాప్తు సంస్థలుగా లేదా అంతర్గత విచారణల్లో సాక్ష్యాలను సేకరించే సాధానాలుగా న్యాయస్థానాలు పని చేయవని న్యాయూమూర్తి తెలిపారు. సాక్ష్యాలకు స్పష్టమైన చట్టపరమైన హక్కు లేనందున పిటిషన్ను కొట్టేస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. భార్య, ఆమె ప్రియుడితో హోటల్లో ఉండే హక్కు ఉందని.. వారి గోప్యతా ప్రాథమిక హక్కు అని కోర్టు అభిప్రాయపడింది.
ఇది కూడా చదవండి: Gold Rates: మళ్లీ భగ్గుమన్న పసిడి ధరలు.. రూ. 500 పెరిగిన తులం గోల్డ్ ధర
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!