Delhi: భార్య హోటల్ వీడియోలు ఇవ్వాలని ఆర్మీ మేజర్ పిటిషన్.. కోర్టు ఏం చేసిందంటే..!
- భార్య హోటల్ వీడియోలు ఇవ్వాలని ఆర్మీ మేజర్ పిటిషన్
- విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన భార్య జూనియర్ అధికారితో వివాహేతర సంబంధం పెట్టుకుందని.. ప్రియుడితో హోటల్లో ఏకాంతంగా గడిపిన సీసీటీవీ ఫుటేజ్ను ఇవ్వాలని భారత సైన్యంలో మేజర్గా పని చేస్తున్న ఒక అధికారి ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశాడు. పిటిషన్ విచారించిన పాటియాలా హౌస్ కోర్టు న్యాయమూర్తి వైభవ్ ప్రతాప్ సింగ్ కొట్టేశారు. హోటల్లో బుకింగ్ వివరాలు, సీసీటీవీ ఫుటేజ్ అనేది గోప్యతకు సంబంధించిన విషయాలు అని తెలిపింది. ఒక వ్యక్తి.. మరొక వ్యక్తి భార్యను దొంగిలించాడనే ఆలోచన పాత విషయం అని వ్యాఖ్యానించారు. సీసీటీవీ ఫుటేజ్ కోరడమంటే మహిళల నుంచి స్వతంత్రతను తీసివేస్తుందని.. అంతేకాకుండా వారిని అమానవీయంగా మారుస్తుందని న్యాయమూర్తి పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Mahesh Babu : ఖలేజా రీ-రిలీజ్కు ఊహించని బుకింగ్స్..
Also Read
- Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
భార్య.. తన జూనియర్ అధికారితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆర్మీ మేజర్ అనుమానించాడు. దీంతో ఆమెతో విడాకులు తీసుకునేందుకు సిద్ధపడ్డాడు. అయితే వివాహేతర సంబంధాన్ని బయటపెట్టేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. అందుకు ఆధారాలు లభించలేదు. అయితే భార్య.. ప్రియుడితో కలిసి హోటల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను బయటపెట్టాలని అనుకున్నాడు. కానీ ఫుటేజ్ ఇచ్చేందుకు హోటల్ సిబ్బంది నిరాకరించారు. దీంతో మేజర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. తనకు సీసీటీవీ ఫుటేజ్ ఇప్పించాలని అభ్యర్థించాడు. కానీ కోర్టు అందుకు అంగీకరించలేదు. ప్రైవేటు వివాదాలకు దర్యాప్తు సంస్థలుగా లేదా అంతర్గత విచారణల్లో సాక్ష్యాలను సేకరించే సాధానాలుగా న్యాయస్థానాలు పని చేయవని న్యాయూమూర్తి తెలిపారు. సాక్ష్యాలకు స్పష్టమైన చట్టపరమైన హక్కు లేనందున పిటిషన్ను కొట్టేస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. భార్య, ఆమె ప్రియుడితో హోటల్లో ఉండే హక్కు ఉందని.. వారి గోప్యతా ప్రాథమిక హక్కు అని కోర్టు అభిప్రాయపడింది.
ఇది కూడా చదవండి: Gold Rates: మళ్లీ భగ్గుమన్న పసిడి ధరలు.. రూ. 500 పెరిగిన తులం గోల్డ్ ధర
తాజావార్తలు
-
Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
-
Tollywood : ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని చూసి ఇతర సంగీత దర్శకులు చాలా నేర్చుకోవాలి
-
Shreyas Iyer-BCCI: బీసీసీఐ కీలక సమావేశంకు శ్రేయాస్ అయ్యర్.. టీమిండియా టీ20 కెప్టెన్గా ఫిక్స్!
-
Vivo X500 Pro Max: వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్.. 50MP + 50MP + 200MP కెమెరాలు.. 8000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!