Delhi: భార్య హోటల్ వీడియోలు ఇవ్వాలని ఆర్మీ మేజర్ పిటిషన్.. కోర్టు ఏం చేసిందంటే..!
- భార్య హోటల్ వీడియోలు ఇవ్వాలని ఆర్మీ మేజర్ పిటిషన్
- విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన భార్య జూనియర్ అధికారితో వివాహేతర సంబంధం పెట్టుకుందని.. ప్రియుడితో హోటల్లో ఏకాంతంగా గడిపిన సీసీటీవీ ఫుటేజ్ను ఇవ్వాలని భారత సైన్యంలో మేజర్గా పని చేస్తున్న ఒక అధికారి ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశాడు. పిటిషన్ విచారించిన పాటియాలా హౌస్ కోర్టు న్యాయమూర్తి వైభవ్ ప్రతాప్ సింగ్ కొట్టేశారు. హోటల్లో బుకింగ్ వివరాలు, సీసీటీవీ ఫుటేజ్ అనేది గోప్యతకు సంబంధించిన విషయాలు అని తెలిపింది. ఒక వ్యక్తి.. మరొక వ్యక్తి భార్యను దొంగిలించాడనే ఆలోచన పాత విషయం అని వ్యాఖ్యానించారు. సీసీటీవీ ఫుటేజ్ కోరడమంటే మహిళల నుంచి స్వతంత్రతను తీసివేస్తుందని.. అంతేకాకుండా వారిని అమానవీయంగా మారుస్తుందని న్యాయమూర్తి పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Mahesh Babu : ఖలేజా రీ-రిలీజ్కు ఊహించని బుకింగ్స్..
Also Read
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
- CNG Price Hike: రెండు రోజుల్లో రెండోసారి.. మళ్లీ పెరిగిన సీఎన్జీ ధరలు..
- Rajdhani Express Fire: రాజధాని ఎక్స్ప్రెస్ లో ప్రమాదం.. రెండు కోచ్లలో చెలరేగిన మంటలు
- Bulldozer Action: బెంగాల్లో బుల్డోజర్ చర్యలు.. హౌరా స్టేషన్ బయట ఆక్రమణలు తొలగింపు
భార్య.. తన జూనియర్ అధికారితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆర్మీ మేజర్ అనుమానించాడు. దీంతో ఆమెతో విడాకులు తీసుకునేందుకు సిద్ధపడ్డాడు. అయితే వివాహేతర సంబంధాన్ని బయటపెట్టేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. అందుకు ఆధారాలు లభించలేదు. అయితే భార్య.. ప్రియుడితో కలిసి హోటల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను బయటపెట్టాలని అనుకున్నాడు. కానీ ఫుటేజ్ ఇచ్చేందుకు హోటల్ సిబ్బంది నిరాకరించారు. దీంతో మేజర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. తనకు సీసీటీవీ ఫుటేజ్ ఇప్పించాలని అభ్యర్థించాడు. కానీ కోర్టు అందుకు అంగీకరించలేదు. ప్రైవేటు వివాదాలకు దర్యాప్తు సంస్థలుగా లేదా అంతర్గత విచారణల్లో సాక్ష్యాలను సేకరించే సాధానాలుగా న్యాయస్థానాలు పని చేయవని న్యాయూమూర్తి తెలిపారు. సాక్ష్యాలకు స్పష్టమైన చట్టపరమైన హక్కు లేనందున పిటిషన్ను కొట్టేస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. భార్య, ఆమె ప్రియుడితో హోటల్లో ఉండే హక్కు ఉందని.. వారి గోప్యతా ప్రాథమిక హక్కు అని కోర్టు అభిప్రాయపడింది.
ఇది కూడా చదవండి: Gold Rates: మళ్లీ భగ్గుమన్న పసిడి ధరలు.. రూ. 500 పెరిగిన తులం గోల్డ్ ధర
తాజావార్తలు
-
Australia: 61 మంది మహిళలపై పైశాచికత్వం! ఆస్ట్రేలియాలో భారత సంతతి చెందిన వ్యక్తికి 13 ఏళ్ల జైలు శిక్ష
-
Rajnikanth : విజయ్ CM అయినందుకు నాకు ఎలాంటి అసూయ లేదు
-
Story Board: దేశంలో S.I.R ఉద్దేశమేంటి..? జరుగుతున్నదేంటి..?
-
Natural Hair Color: తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ కిచెన్ చిట్కాలతో సహజమైన హెయిర్ కలర్ మీ సొంతం..!
-
MS Raju-Trisha“త్రిషకు నేనంటే ప్రాణం”.. ఎంఎస్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..