Anushka Jaiswal: కార్పొరేట్ జాబ్ వదిలి.. కూరగాయలు పండిస్తూ.. ఏడాదికి రూ. కోటి
- పాలీహౌస్ ఫామ్ను ప్రారంభించి, క్యాప్సికమ్లు,
- ఇతర కూరగాయలతో ఏడాదికి రూ. కోటి టర్నోవర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర ప్రదేశ్ లోని లక్నోకు చెందిన ఓ యువతి కార్పొరేట్ జాబ్ వదులుకుని.. కూరగాయలు పండిస్తూ.. సంవత్సరానికి ఏకంగా కోటి రూపాయలు సంపాదిస్తుంది. లక్నోకు చెందిన అనుష్క జైస్వాల్ కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయాన్ని ఎంచుకుంది. తన టెర్రస్పై మొక్కలు పెంచడం ద్వారా స్ఫూర్తి పొంది, రక్షిత వ్యవసాయంలో శిక్షణ పొందింది. 2020లో పాలీహౌస్ ఫామ్ను ప్రారంభించి, క్యాప్సికమ్లు, ఇతర కూరగాయలతో కోటి రూపాయల వరకు టర్నోవర్ చేస్తూ.. ముందుకు వెళుతుంది.
Read Also: Online Fruad: ఆన్లైన్లో స్మార్ట్ఫోన్ బుక్ చేస్తే.. ఏం వచ్చిందో తెలుసా..
Also Read
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
2017లో ఢిల్లీలోని హిందూ కళాశాలలో ప్లేస్మెంట్ సీజన్లో, విద్యార్థులు ఇంటర్వ్యూలకు సిద్ధమవుతూ గంటల తరబడి గడిపినప్పటికీ, ఒక అమ్మాయి ఏమాత్రం భయపడకుండా ఉండిపోయింది. ప్లేస్మెంట్ సెల్ అధ్యక్షురాలు అనుష్క జైస్వాల్కు ఉద్యోగ ఆఫర్ వస్తుందని భావించారు, అయినప్పటికీ ఆమె దానిని అంగీకరించలేదు. ఆమె వ్యవసాయం చేయాలనే ఆలోచనతో ముందుకు సాగింది.
Read Also:Champavathi River: విజయనగరం జిల్లా జీవనాడిగా చంపావతి నది
ఆమె తన సోదరుడి ప్రోత్సాహంతో ఆమె ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ టెక్నాలజీ, నోయిడాలో హార్టికల్చర్ కోర్సు చేసింది. వ్యవసాయానికి సంబంధించిన మరికొన్ని కోర్సులు చేసిన తర్వాత, రక్షిత వ్యవసాయంపై ఆమెకు ఆసక్తి మరింత పెరిగింది. చాలా పరిశోధన చేసి అవసరమైన కోర్సులు పూర్తి చేసిన తర్వాత 2020లో ఒక ఎకరం భూమిలో పాలీహౌస్ ఫామ్ను ప్రారంభించారు. గత 5 సంవత్సరాలలో వారు తమ ప్రత్యేక కూరగాయలకు ముఖ్యంగా వివిధ రకాల క్యాప్సికమ్లకు లక్నో, పరిసర ప్రాంతాలలో తమకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు.
Read Also:IIron-Rich Foods: ఐరన్ లోపంతో బాధపడుతున్నారా.. ఈ ఫుడ్స్ మీ మెనూలో చేర్చుకోండి
అయితే ఆమె తన మొదటి పంటలో 51 టన్నులు ఉత్పత్తి చేసింది. ఇది సాంప్రదాయ రైతులు పొందే దానికంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ అని ఆమె తెలిపారు. ఈ సక్సెస్తో ఆమె మరింత ఉత్సాహంతో ఆమె ఎరుపు, పసుపు రంగు క్యాప్సికమ్లను కూడా పెంచింది. అవి బాగా వృద్ధి చెందాయి. ఒక ఎకరం భూమిలో ఆమె 35 టన్నుల క్యాప్సికమ్లను పండించింది. వాటిని ఆమె కిలోకు సగటున రూ.80 నుండి రూ.100 వరకు అమ్మింది. నేడు ఆమె ప్రతి సంవత్సరం 200 టన్నులకు పైగా క్యాప్సికమ్లను పండిస్తోంది..
Read Also:Indian Railways: ఆంధ్రప్రదేశ్ లో మెగా టెర్మినల్స్.. రైల్వే శాఖ భారీ ప్లాన్
నేడు అనుష్క 6 ఎకరాలకు పైగా భూమిలో కూరగాయలు పండిస్తోంది . ఆమె 2023-24లో రూ.1 కోటి కంటే ఎక్కువ టర్నోవర్ చేసింది. ఆమె కూరగాయలు బ్లింకిట్, బిగ్ బాస్కెట్ వంటి క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్లతో పాటు లులు హైపర్ మార్కెట్ వంటి స్టోర్లలో అమ్ముడవుతాయి. ఆమె కూరగాయలు ఢిల్లీ, వారణాసిలోని మండీలకు కూడా వెళ్తాయి. ప్రస్తుతం ఆమె 25-30 మందికి ఉపాధి కల్పిస్తుంది. వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!