Champavathi River: విజయనగరం జిల్లా జీవనాడిగా చంపావతి నది
- తూర్పు కనుమలలో ఉద్భవించిన చంపావతి నది
- కోనాడ సమీపంలో బంగాళాఖాతంలో కలుస్తున్న నది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయనగరం జిల్లా ప్రధాన జీవనాడిగా చంపావతి నది పేరు గాంచింది. చంపావతి నది తూర్పు కనుమలలో ఉద్భవించి, విజయనగరం జిల్లా గుండా తూర్పు వైపుకు ప్రవహించి, కోనాడ సమీపంలో బంగాళాఖాతంలో కలుస్తుంది.. ఇది ఈ ప్రాంతానికి జీవనాడి, డెంకాడ ఆనకట్ట మరియు తారకరామ తీర్థ సాగరం బ్యారేజీ వంటి బ్యారేజీలు, ఆనకట్టల ద్వారా భూమికి సాగునీరు అందిస్తుంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో వ్యవసాయానికి ఈ నది ముఖ్యమైనది.
Read Also: Fake Notes: దేశంలో చెలామణి అవుతున్న నకిలీ కరెన్సీ రూ. 500 నోటు
Also Read
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
- Poleramma Jatara 2026: వెదురుపాకలో పోలేరమ్మతల్లి జాతర.. సందడి చేసిన దేవిశ్రీ ప్రసాద్!
ఈ నది శ్రీకాకుళం జిల్లాలోని ఆండ్రా గ్రామం సమీపంలో 1,200 మీటర్ల ఎత్తులో తూర్పు కనుమలలో ఉద్భవించింది.ఇది తూర్పు వైపుకు ప్రవహించి, సాలూరు, గజపతినగరం, నెల్లిమర్ల, డెంకాడ వంటి ప్రాంతాల గుండా ప్రవహించి, చివరికి విజయనగరం జిల్లాలోకి ప్రవేశిస్తుంది.నదికి నాలుగు ప్రధాన ఉపనదులు ఉన్నాయి: ఏడువంపుల గెడ్డ, చిట్ట గెడ్డ, పోతుల గెడ్డ మరియు గడి గెడ్డ. ఇది చివరకు పూసపాటిరేగ మండలంలోని కోనాడ గ్రామం సమీపంలో బంగాళాఖాతంలో కలుస్తుంది. గజపతినగరం, నెల్లిమర్ల, సరిపల్లి, డెంకాడ, పాలెం, నటవలస వంటి కీలక ప్రాంతాల గుండా ఈ నది సాగి వేలాది ఎకరాలకు జీవనాడిగా నిలుస్తోంది.
Read Also:IIron-Rich Foods: ఐరన్ లోపంతో బాధపడుతున్నారా.. ఈ ఫుడ్స్ మీ మెనూలో చేర్చుకోండి
మొత్తం 1,410 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ నదీ పరీవాహక ప్రాంతం విస్తరించి ఉంది. సరిపల్లి వద్ద నిర్మించిన డెంకాడ బ్యారేజీ ద్వారా 5,153 ఎకరాలకు, సుమారు 20.85 కిమీ ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. ఈ ప్రాజెక్టు నెల్లిమర్ల మండలంలో వ్యవసాయంపై ప్రభావాన్ని చూపుతూ రైతులకు ప్రధాన వరంగా నిలుస్తోంది. ప్రజల ప్రయోజనం కోసం కుమిలి నదీ పరీవాహక ప్రాంతంలో నిర్మించిన ఆనకట్ట కూడా నీటి నిల్వ, పంపిణీలో కీలక భూమిక వహిస్తోంది. జిల్లాలో చంపావతి నదికి ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవహాం చూడచక్కగా ఉంది. నెల్లిమర్ల రామతీర్థాలకు వెళ్లే దారి కోసం నెల్లిమర్ల వద్ద వంతెన నిర్మించారు. అక్కడి నీటి ప్రవాహన్ని డ్రోన్ కెమెరాతో చిత్రించారు. చంపావతి ప్రవాహం ఉరకలేస్తున్న దృశ్యాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
తాజావార్తలు
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
-
TVK Vijay: గవర్నర్ ఆటంకం.. రేపటి విజయ్ ప్రమాణస్వీకారం రద్దు
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!