Anti-rape bill: రేప్ చేస్తే మరణశిక్ష.. “అత్యాచార నిరోధక బిల్లు”కి బెంగాల్ అసెంబ్లీ ఆమోదం..
- అత్యాచార నిరోధక బిల్లుకు బెంగాల్ అసెంబ్లీ ఆమోదం..
- బిల్లుకు ప్రతిపక్షాల మద్దతు..
- కోల్కతా హత్యాచార ఘటన నేపథ్యంలో మమతా సర్కార్ కీలక ముందడుగు..
- బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి..
Anti-rape bill: కోల్కతా అత్యాచార ఉదంతం దేశవ్యాప్తం ఆందోళనకు కారణమైంది. 31 ఏళ్ల ట్రైనీ పీజీ వైద్యురాలు ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో నైట్ డ్యూటీ చేస్తున్న సమయంలో ఆమెపై దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. ఈ ఘటన కారణంగా ఇప్పటికే వెస్ట్ బెంగాల్లో నిరసన, ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సర్కారుకు ఈ ఘటన మాయని మచ్చగా మారింది. ప్రభుత్వం, పోలీసుల వైఫల్యంపై కలకత్తా హైకోర్టు కూడా మండిపడి ఈ కేసుని సీబీఐకి అప్పగించింది.
ఇదిలా ఉంటే, వరసగా ప్రతిపక్షాల నుంచి ఎదురవుతున్న విమర్శల నుంచి తప్పించుకునేందుకు ‘‘అత్యాచార నిరోధక బిల్లు’’ని మమతా సర్కార్ ఈ రోజు బెంగాల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అపరాజిత స్త్రీ మరియు పిల్లల బిల్లు (పశ్చిమ బెంగాల్ క్రిమినల్ చట్టాలు మరియు సవరణ) బిల్లు, 2024కి ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇవ్వడంతో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అత్యాచార దోషుల చర్యలు బాధితురాలి మరణానికి దారి తీస్తే మరణశిక్ష విధించేలా ఈ కొత్త బిల్లు రూపొందించబడింది.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
Read Also: CM Revanth Reddy: అశ్విని కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నాం..
అయితే, ఈ బిల్లు క్రిమినల్ చట్టం కిందికి వస్తుంది, ఇది ఉమ్మడి జాబితాలో ఉంది కాబట్టి చట్టానికి రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి, ఈ చట్టంపై గవర్నర్తో త్వరగా సంతకం చేయించాలని బీజేపీ నేత, ప్రతిపక్ష నేత సువేందు అధికారిని కోరారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల విషయంలో మన రాష్ట్రం మూడవ స్థానంలో ఉంది, సువేందు అధికారి బిల్లుకు మద్దతు ఇచ్చిన తర్వాత తృణమూల్ చీఫ్ అన్నారు. బీజేపీ నేత సువేందు అధికారి మాట్లాడుతూ.. రేపిస్టులకు కఠినమైన శిక్షలకు తాను ఎప్పుడూ మద్దతు ఇస్తానని చెప్పారు.
“ఈ (అత్యాచార నిరోధక) చట్టాన్ని తక్షణమే అమలు చేయాలనుకుంటున్నాము. ఇది మీ (రాష్ట్ర ప్రభుత్వం) బాధ్యత. మాకు ఫలితాలు కావాలి. ఇది ప్రభుత్వ బాధ్యత. మాకు ఎలాంటి విభజన వద్దు, మేము మీకు పూర్తిగా మద్దతు ఇస్తున్నాము… ఆమె (మమత ) ఏది కావాలంటే అది చెప్పగలదు, అయితే ఈ బిల్లు వెంటనే అమలు చేయబడుతుందని మీరు హామీ ఇవ్వాలి, ” అని సువేందు అధికారి కోరారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!