Prasannajit Rangari: ప్రసన్నజీత్ మరో ‘‘సరబ్జీత్’’.. పాక్ జైలు నుంచి విడిపించేందుకు సోదరి పోరాటం..
- పాకిస్తాన్ జైలులో బందీగా ప్రసన్నజిత్..
- సోదరుడి విడుదల కోసం మహిళ పోరాటం..
- మరో సరబ్జిత్గా ప్రసన్నజిత్ కథ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prasannajit Rangari: మధ్యప్రదేశ్లోని బాలాఘాట్కి చెందిన సంఘమిత్ర ఖోబ్రగాడే తన సోదరుడు ప్రసన్న జిత్ రంగరిని పాకిస్తాన్ జైలు నుంచి విడుదల చేయించేందుకు పోరాడుతోంది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న ప్రసన్నజిత్ ఏడేళ్ల క్రితం ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. అతడి కోసం కుటుంబీకులు తీవ్రంగా గాలించినప్పటికీ ఆచూకీ కనుగొనలేకపోయారు. చివరకు అతను మరణించినట్లు భావించారు.
అయితే, 2021 చివర్లోల సంఘమిత్ర తన సోదరుడు బతికే ఉన్నాడని గుర్తించింది. పాకిస్తాన్ జైలులో ఉన్నాడని తెలియజేసే ఫోన్ వచ్చింది. అప్పటి నుంచి ఆమె తన సోదరుడిని ఇండియాకు తీసుకురావాలనే ఉద్దేశంతో అలుపెరగని పోరాటం చేస్తో్ంది. జమ్మూ కాశ్మీర్లోని కథువా నివాసి కులదీప్ సింగ్ కచ్వాహా అనే మాజీ ఖైదీ నుంచి తనకు 2021లో ఫోన్ వచ్చిందని సంఘమిత్ర తెలిపింది. పాకిస్తాన్ లాహోర్ లోని కోట్ లఖ్పత్ జైలులో 29 ఏళ్లు గడిపిన తర్వా కుల్దీప్ విడుదలయ్యారు. 2019లో తాను ప్రసన్నజిత్ని కలిశానని సంఘమిత్రతో చెప్పాడు.
Also Read
- Bomb Threat: రాజధానిలో హై అలర్ట్.. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ఢిల్లీలో బాంబు బెదిరింపులు..
- Survey: అమెరికా, శ్రీలంక నుంచి పాక్ వరకు.. భారత్ను ప్రేమించేది ఎవరు? ద్వేషించేది ఎవరు? సర్వేలో సంచలన నిజాలు..
- Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
- Independence Day 2026: ఇంతకీ ఇది 80వ స్వాతంత్య్ర దినోత్సవమా? లేక 79వదా? ఫుల్ క్లారిటీ ఇదిగో..
Read Also: Minister Thummala: రైతులకు గుడ్ న్యూస్.. పాలమూరు సభ ద్వారా రూ.3వేల కోట్ల రుణమాఫీ!
మొదట్లో మానసికంగా అస్థిరంగా ఉన్న ప్రసన్నజిత్ పరిస్థితి మెరుగుపడటంతో చివరకు తన గుర్తింపుని వెల్లడించినట్లు కుల్దీప్ చెప్పారు. ప్రసన్నజిత్ తన మానసిక ఆరోగ్యం క్షీణించకముందే జబల్పూర్లోని ఖల్సా ఇన్స్టిట్యూట్లో బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ పూర్తి చేశాడని ఆమె పేర్కొంది. ప్రస్తుతం సంఘమిత్ర కూలీగా పనిచేస్తూ తన సోదరుడిని ఇండియాకు తీసుకురావాలనే ఆశయంతో భోపాల్లోని కలెక్టరేట్, ఇతర ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది.
సంఘమిత్ర తండ్రి తన కుమారుడి రాక కోసం ఎదురుచూస్తే ఏప్రిల్ 2024లో కన్నుమూశారు. మానసిక అస్వస్థతకు గురైన తల్లి, ఇంకా తన కొడుకు జబల్ పూర్లో చదువుతున్నాడని అనుకుంటోంది. ప్రసన్నజిత్ 2019 నుంచి లాహోర్ సెంట్రల్ జైలులో ఉన్నట్లు హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. అతడిపై ఎలాంటి అభియోగాలు లేదా శిక్షలు లేవు. దీంతో అతడి విడుదల సులభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Asim Munir: అసిమ్ మునీర్కు కీలక బాధ్యతలు.. మతలబు ఏంటో..!?
-
Multibagger Stocks: ఏడాదిగా ముంచిన షేరు.. ఒకే ఒక్క వార్తతో మళ్లీ రాకెట్లా దూసుకెళ్లింది..
-
Prabhas Fauzi: ప్రభాస్లో ఊహించని మార్పు.. ‘ఫౌజీ’ కోసం డార్లింగ్ అంతలా పట్టించుకుంటున్నాడా?
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
R Ashwin: ఉన్నపళంగా ఇంటికి పోలీసులు.. షాక్కు గురైన అశ్విన్.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!
-
Indoor Plants: ఒక్క గ్లాస్ నీటితో ఇంట్లో గ్రీన్ డెకరేషన్.. ఈ మొక్కలను ఇలా పెంచండి!