Prasannajit Rangari: ప్రసన్నజీత్ మరో ‘‘సరబ్జీత్’’.. పాక్ జైలు నుంచి విడిపించేందుకు సోదరి పోరాటం..
- పాకిస్తాన్ జైలులో బందీగా ప్రసన్నజిత్..
- సోదరుడి విడుదల కోసం మహిళ పోరాటం..
- మరో సరబ్జిత్గా ప్రసన్నజిత్ కథ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prasannajit Rangari: మధ్యప్రదేశ్లోని బాలాఘాట్కి చెందిన సంఘమిత్ర ఖోబ్రగాడే తన సోదరుడు ప్రసన్న జిత్ రంగరిని పాకిస్తాన్ జైలు నుంచి విడుదల చేయించేందుకు పోరాడుతోంది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న ప్రసన్నజిత్ ఏడేళ్ల క్రితం ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. అతడి కోసం కుటుంబీకులు తీవ్రంగా గాలించినప్పటికీ ఆచూకీ కనుగొనలేకపోయారు. చివరకు అతను మరణించినట్లు భావించారు.
అయితే, 2021 చివర్లోల సంఘమిత్ర తన సోదరుడు బతికే ఉన్నాడని గుర్తించింది. పాకిస్తాన్ జైలులో ఉన్నాడని తెలియజేసే ఫోన్ వచ్చింది. అప్పటి నుంచి ఆమె తన సోదరుడిని ఇండియాకు తీసుకురావాలనే ఉద్దేశంతో అలుపెరగని పోరాటం చేస్తో్ంది. జమ్మూ కాశ్మీర్లోని కథువా నివాసి కులదీప్ సింగ్ కచ్వాహా అనే మాజీ ఖైదీ నుంచి తనకు 2021లో ఫోన్ వచ్చిందని సంఘమిత్ర తెలిపింది. పాకిస్తాన్ లాహోర్ లోని కోట్ లఖ్పత్ జైలులో 29 ఏళ్లు గడిపిన తర్వా కుల్దీప్ విడుదలయ్యారు. 2019లో తాను ప్రసన్నజిత్ని కలిశానని సంఘమిత్రతో చెప్పాడు.
Also Read
- Suvendu Adhikari: "సువేందు అధికారి అనే నేను".. శ్యామ ప్రసాద్ ముఖర్జీ గడ్డపై జెండా పాతిన బీజేపీ!
- Vijay TVK Controversy: సినిమా నిర్మాతకు లోక్ భవన్లో ఏం పని? విజయ్ గవర్నర్ భేటీలో బయటి వ్యక్తులు..
- Forbes Survey: ఆఫీస్ 'ప్రేమాయణం'.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు
- Vijay-Trisha: "గుసగుసలాడే వారికి ఇదే నా సమాధానం".. విజయ్తో అఫైర్ వార్తలపై త్రిష ఘాటు స్పందన!
Read Also: Minister Thummala: రైతులకు గుడ్ న్యూస్.. పాలమూరు సభ ద్వారా రూ.3వేల కోట్ల రుణమాఫీ!
మొదట్లో మానసికంగా అస్థిరంగా ఉన్న ప్రసన్నజిత్ పరిస్థితి మెరుగుపడటంతో చివరకు తన గుర్తింపుని వెల్లడించినట్లు కుల్దీప్ చెప్పారు. ప్రసన్నజిత్ తన మానసిక ఆరోగ్యం క్షీణించకముందే జబల్పూర్లోని ఖల్సా ఇన్స్టిట్యూట్లో బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ పూర్తి చేశాడని ఆమె పేర్కొంది. ప్రస్తుతం సంఘమిత్ర కూలీగా పనిచేస్తూ తన సోదరుడిని ఇండియాకు తీసుకురావాలనే ఆశయంతో భోపాల్లోని కలెక్టరేట్, ఇతర ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది.
సంఘమిత్ర తండ్రి తన కుమారుడి రాక కోసం ఎదురుచూస్తే ఏప్రిల్ 2024లో కన్నుమూశారు. మానసిక అస్వస్థతకు గురైన తల్లి, ఇంకా తన కొడుకు జబల్ పూర్లో చదువుతున్నాడని అనుకుంటోంది. ప్రసన్నజిత్ 2019 నుంచి లాహోర్ సెంట్రల్ జైలులో ఉన్నట్లు హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. అతడిపై ఎలాంటి అభియోగాలు లేదా శిక్షలు లేవు. దీంతో అతడి విడుదల సులభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Rohit Sharma TV Show: రెండు లైన్లకే ఇంత వైరల్ అయితే.. మొత్తం షో రిలీజ్ అయితే ఇంకెంత రచ్చ అవుతుందో!
-
Suvendu Adhikari: “సువేందు అధికారి అనే నేను”.. శ్యామ ప్రసాద్ ముఖర్జీ గడ్డపై జెండా పాతిన బీజేపీ!
-
Kalki 2: ప్రభాస్ ఫ్యాన్స్కు క్రేజీ అప్డేట్.. ‘కల్కి 2’ రిలీజ్ డేట్ లాక్ అయినట్టే?
-
Norovirus Outbreak: క్రూయిజ్ షిప్లో నోరోవైరస్ కలకలం.. 115 మందికి అస్వస్థత
-
Vijay TVK Controversy: సినిమా నిర్మాతకు లోక్ భవన్లో ఏం పని? విజయ్ గవర్నర్ భేటీలో బయటి వ్యక్తులు..