Annamalai: అప్పుడు “నోటా” పార్టీ అంటూ ఎగతాళి, ఇప్పుడు పొత్తుల కోసం ఆరాటం..
- బీజేపీ పొత్తు కోసం ఇతర పార్టీలు ఎదురుచూస్తున్నాయి..
- నోటా పార్టీ అన్నవారే ఇప్పుడు తమ పొత్తు కోసం చూస్తున్నారు..
- తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై..
Annamalai: తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ప్రభావం పెరగడం వల్ల 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, బీజేపీతో పలు పార్టీలు పొత్తులు కోరుతున్నాయని అన్నారు. పరోక్షంగా అన్నాడీఎంకేని ఉద్దేశిస్తూ ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏఐడీఎంకే చీఫ్ పళనిస్వామి ఇటీవల మాట్లాడుతూ.. పొత్తుల కోసం తలుపులు తెరిచే ఉన్నాయని అన్నారు.
విలేకరులతో మాట్లాడిన అన్నామలై, బీజేపీ ఎదుగుదలకు పార్టీ కార్యకర్తల కృషి కారణమని అన్నారు. ఒకప్పుడు అంటరాని పార్టీగా తోసిపుచ్చారని, ‘‘నోటా పార్టీ’’ అంటూ ఎగతాళి చేశారని, కొందరు బీజేపీ పొత్తు వల్లే ఓడిపోయామని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు రాజకీయాలు మారిపోయాయని, ఇతర పార్టీలు బీజేపీ పొత్తు కోసం ఎదురుచూస్తున్నాయని అన్నారు.
Also Read
- Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
- AC Blast: ఏసీ పేలుడు 9 మంది మృతికి ఎలా కారణమైంది.? ఢిల్లీ ఘటనలో కీలక విషయాలు..
- Jabalpur Boat Tragedy: "లైఫ్ జాకెట్" ఉన్నా తల్లి బిడ్డ ఎలా మరణించారు.?
- Marriage: ‘నాకు 67 ఏళ్లు.. నా పెళ్లి కచ్చితంగా జరుగుతుంది’.. సినీ హీరో సంచలన వ్యాఖ్యలు..
Read Also: Fines with Drones: ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రయోగం.. వారి ఆట కట్టు..!
ఇటీవల సేలంలో పళనిస్వామి పొత్తులపై వ్యాఖ్యలు చేసిన తర్వాత అన్నామలై నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. అన్నాడీఎంకే ఏకైక శత్రువు అధికార డీఎంకే అని, బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా..? అని ప్రశ్నించిన నేపథ్యంలో, ఆరు నెలలు వేచి ఉండాలని అన్నారు.
అయితే, అన్నామలై మాట్లాడుతూ, అన్నాడీఎంకే పొత్తు కోసం బీజేపీ టీటీవీ దినకరన్ని వదులుకోదని స్పష్టం చేశారు. దినకరన్ అత్త వీకే శశికళతో పాటు అన్నాడీఎంకే నుంచి బహిష్కరించబడిన దినకర్, అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే)కి నాయకత్వం వహిస్తున్నారు. ఈయన, తమిళనాడు మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వంతో కలిసి బీజేపీ కూటమి ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నారు.
మిత్రులను విడిచిపెట్టడం ఎన్డీయేలో లేదని అన్నారు. అన్నాడీఎంకేకి అనుకూలంగా ఉండటానికి బీజేపీ దినకరన్తో సంబంధాలు తెంచుకోదని స్పష్టం చేశారు. 2023లో ఏఐడీఎంకే బీజేపీతో సంబంధాలు తెంచుకుంది. 2021 ఎన్నికల ఓటమికి బిజెపి పొత్తు కారణమని ఎఐఎడిఎంకె సీనియర్ నాయకుడు సి.వి. షణ్ముగం కూడా ఆరోపించారు, పార్టీలోని ఇతరులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
-
Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
-
Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ ‘రాగి తీపి కుడుములు’ ఇలా ట్రై చేయండి!
-
GT VS PBKS: గుజరాత్ బౌలర్ల ధాటికి పంజాబ్ విలవిల.. తక్కువ స్కోర్కే పరిమితమైన PBKS..
-
Karimnagar PMJ Jewellery : పీఎంజే జ్యువెల్లరీ దొంగల ఫోటోలు విడుదల.. ఆచూకీ చెబితే లక్ష నజరానా.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!