Annamalai: అప్పుడు “నోటా” పార్టీ అంటూ ఎగతాళి, ఇప్పుడు పొత్తుల కోసం ఆరాటం..
- బీజేపీ పొత్తు కోసం ఇతర పార్టీలు ఎదురుచూస్తున్నాయి..
- నోటా పార్టీ అన్నవారే ఇప్పుడు తమ పొత్తు కోసం చూస్తున్నారు..
- తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annamalai: తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ప్రభావం పెరగడం వల్ల 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, బీజేపీతో పలు పార్టీలు పొత్తులు కోరుతున్నాయని అన్నారు. పరోక్షంగా అన్నాడీఎంకేని ఉద్దేశిస్తూ ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏఐడీఎంకే చీఫ్ పళనిస్వామి ఇటీవల మాట్లాడుతూ.. పొత్తుల కోసం తలుపులు తెరిచే ఉన్నాయని అన్నారు.
విలేకరులతో మాట్లాడిన అన్నామలై, బీజేపీ ఎదుగుదలకు పార్టీ కార్యకర్తల కృషి కారణమని అన్నారు. ఒకప్పుడు అంటరాని పార్టీగా తోసిపుచ్చారని, ‘‘నోటా పార్టీ’’ అంటూ ఎగతాళి చేశారని, కొందరు బీజేపీ పొత్తు వల్లే ఓడిపోయామని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు రాజకీయాలు మారిపోయాయని, ఇతర పార్టీలు బీజేపీ పొత్తు కోసం ఎదురుచూస్తున్నాయని అన్నారు.
Also Read
- NTA: నీట్ వివాదం.. NTAలో భారీ ప్రక్షాళన.. 47 మందిపై వేటు..
- Ravneet Singh Bittu: కేంద్రమంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు రాజీనామా.. ఆమోదం
- Delhi: చాట్జీపీటీకి శుభవార్త.. ఏఎన్ఐ కంటెంట్ వినియోగంపై ఢిల్లీ హైకోర్టులో ఊరట
- Modi-Instagram: వైరల్ వీడియోతో ప్రధాని మోడీకి భారీ క్రేజ్.. ఒక్క రాత్రిలోనే సరికొత్త చరిత్ర
Read Also: Fines with Drones: ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రయోగం.. వారి ఆట కట్టు..!
ఇటీవల సేలంలో పళనిస్వామి పొత్తులపై వ్యాఖ్యలు చేసిన తర్వాత అన్నామలై నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. అన్నాడీఎంకే ఏకైక శత్రువు అధికార డీఎంకే అని, బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా..? అని ప్రశ్నించిన నేపథ్యంలో, ఆరు నెలలు వేచి ఉండాలని అన్నారు.
అయితే, అన్నామలై మాట్లాడుతూ, అన్నాడీఎంకే పొత్తు కోసం బీజేపీ టీటీవీ దినకరన్ని వదులుకోదని స్పష్టం చేశారు. దినకరన్ అత్త వీకే శశికళతో పాటు అన్నాడీఎంకే నుంచి బహిష్కరించబడిన దినకర్, అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే)కి నాయకత్వం వహిస్తున్నారు. ఈయన, తమిళనాడు మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వంతో కలిసి బీజేపీ కూటమి ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నారు.
మిత్రులను విడిచిపెట్టడం ఎన్డీయేలో లేదని అన్నారు. అన్నాడీఎంకేకి అనుకూలంగా ఉండటానికి బీజేపీ దినకరన్తో సంబంధాలు తెంచుకోదని స్పష్టం చేశారు. 2023లో ఏఐడీఎంకే బీజేపీతో సంబంధాలు తెంచుకుంది. 2021 ఎన్నికల ఓటమికి బిజెపి పొత్తు కారణమని ఎఐఎడిఎంకె సీనియర్ నాయకుడు సి.వి. షణ్ముగం కూడా ఆరోపించారు, పార్టీలోని ఇతరులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్హౌస్కు జెలెన్స్కీ.. ట్రంప్తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!