Punjab: అమృత్సర్ ఆలయంపై బాంబు దాడి.. పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధం..
- అమృత్సర్ ఆలయంపై బాంబు దాడి..
- ఆలయంపైకి బాంబులు విసిరిన గుర్తుతెలియని వ్యక్తులు..
- పాక్ ఐఎస్ఐతో సంఘటనకు సంబంధం ఉందన్న పోలీసులు..
Punjab: శుక్రవారం అర్థరాత్రి పంజాబ్ అమృత్సర్లోని ఓ దేవాలయంలో శక్తివంతమైన పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి కిటికీ అద్ధాలు, గోడలు దెబ్బతిన్నాయి. ఖాండ్వాలా ప్రాంతంలోని ఠాకూర్ ద్వార ఆలయం వద్ద ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మోటార్ సైకిల్ప వచ్చి, ఆలయంపై పేలుడు పదార్థాలు విసిరి పారిపోతున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యాయి.
ఆలయ పూజారి తెల్లవారుజామున 2 గంటలకు దాడి గురించి పోలీసులకు సమాచారం అందించారని అమృత్సర్ పోలీస్ కమిషనర్ గురుప్రీత్ సింగ్ భుల్లార్ ధృవీకరించారు. సీనియర్ పోలీస్ అధికారులు, ఫోరెన్సిక్ టీమ్స్ సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించాయి. ఈ ఘటనకు పాకిస్తాన గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)తో సంబంధం ఉందని కమిషనర్ భల్లార్ అన్నారు. పంజాబ్లో అల్లర్లు సృష్టించడానికి పాక్ ఐఎస్ఐ మన యువతను ఆకర్షిస్తోందని ఆయన అన్నారు. ఇలాంటి కేసుల్లో ఇరుక్కుని యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ఘటనకు కారణమైన వారిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.
Also Read
- PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
- Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
- Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
- FASTag Major Changes: ఫాస్టాగ్ విధానంలో సంచలన మార్పులు.. నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
Read Also: CM Chandrababu: 47 ఏళ్ళ క్రితం ఇదే రోజు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశా.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ దాడి పంజాబ్లో రాజకీయ దుమారానికి కారణమైంది. రాష్ట్రంలోని ఆప్ ప్రభుత్వంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. శిరోమణి అకాలీదళ్ ఈ దాడిని తీవ్రమైన, సున్నితమైన సంఘటనగా అభివర్ణించింది. ఇది ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని చెప్పింది. బీజేపీ నేత రణవీత్ సింగ్ బిట్టూ మాట్లాడుతూ.. ఆలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని, శాంతిభద్రతల పర్యవేక్షణలో ఆప్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.
ఈ ఘటనపై సీఎం భగవంత్ మాన్ స్పందించారు. ‘‘పంజాబ్లో శాంతిని దెబ్బతీసేందుకు ఎల్లప్పుడూ అనేక ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మాదకద్రవ్యాలు, గ్యాంగ్స్టర్లు,దోపిడీ దానిలో భాగమే, పంజాబ్ ఒక కల్లోలిత రాష్ట్రంగా మారిందని చూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. హోలీ పండుగ సమయంలో, ఇతర రాష్ట్రాల్లో, ఊరేగింపుల సమయంలో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. కానీ పంజాబ్లో అలాంటివి జరగవు. పంజాబ్లో శాంతిభద్రతల పరిస్థితి బాగుంది’’ అని అన్నారు.
Grenade attack on Thakur Dwar mandir in Amritsar on Holi.
One of a dozen such attacks in the area recently.
If the snake of #Khalistan is again raising its head in Punjab, the Indian State should smash the head before lives are lost.pic.twitter.com/n5kSgdQ3KY— Abhijit Majumder (@abhijitmajumder) March 15, 2025
తాజావార్తలు
-
రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
-
MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!