Punjab: అమృత్సర్ ఆలయంపై బాంబు దాడి.. పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధం..
- అమృత్సర్ ఆలయంపై బాంబు దాడి..
- ఆలయంపైకి బాంబులు విసిరిన గుర్తుతెలియని వ్యక్తులు..
- పాక్ ఐఎస్ఐతో సంఘటనకు సంబంధం ఉందన్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab: శుక్రవారం అర్థరాత్రి పంజాబ్ అమృత్సర్లోని ఓ దేవాలయంలో శక్తివంతమైన పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి కిటికీ అద్ధాలు, గోడలు దెబ్బతిన్నాయి. ఖాండ్వాలా ప్రాంతంలోని ఠాకూర్ ద్వార ఆలయం వద్ద ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మోటార్ సైకిల్ప వచ్చి, ఆలయంపై పేలుడు పదార్థాలు విసిరి పారిపోతున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యాయి.
ఆలయ పూజారి తెల్లవారుజామున 2 గంటలకు దాడి గురించి పోలీసులకు సమాచారం అందించారని అమృత్సర్ పోలీస్ కమిషనర్ గురుప్రీత్ సింగ్ భుల్లార్ ధృవీకరించారు. సీనియర్ పోలీస్ అధికారులు, ఫోరెన్సిక్ టీమ్స్ సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించాయి. ఈ ఘటనకు పాకిస్తాన గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)తో సంబంధం ఉందని కమిషనర్ భల్లార్ అన్నారు. పంజాబ్లో అల్లర్లు సృష్టించడానికి పాక్ ఐఎస్ఐ మన యువతను ఆకర్షిస్తోందని ఆయన అన్నారు. ఇలాంటి కేసుల్లో ఇరుక్కుని యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ఘటనకు కారణమైన వారిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.
Also Read
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
Read Also: CM Chandrababu: 47 ఏళ్ళ క్రితం ఇదే రోజు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశా.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ దాడి పంజాబ్లో రాజకీయ దుమారానికి కారణమైంది. రాష్ట్రంలోని ఆప్ ప్రభుత్వంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. శిరోమణి అకాలీదళ్ ఈ దాడిని తీవ్రమైన, సున్నితమైన సంఘటనగా అభివర్ణించింది. ఇది ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని చెప్పింది. బీజేపీ నేత రణవీత్ సింగ్ బిట్టూ మాట్లాడుతూ.. ఆలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని, శాంతిభద్రతల పర్యవేక్షణలో ఆప్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.
ఈ ఘటనపై సీఎం భగవంత్ మాన్ స్పందించారు. ‘‘పంజాబ్లో శాంతిని దెబ్బతీసేందుకు ఎల్లప్పుడూ అనేక ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మాదకద్రవ్యాలు, గ్యాంగ్స్టర్లు,దోపిడీ దానిలో భాగమే, పంజాబ్ ఒక కల్లోలిత రాష్ట్రంగా మారిందని చూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. హోలీ పండుగ సమయంలో, ఇతర రాష్ట్రాల్లో, ఊరేగింపుల సమయంలో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. కానీ పంజాబ్లో అలాంటివి జరగవు. పంజాబ్లో శాంతిభద్రతల పరిస్థితి బాగుంది’’ అని అన్నారు.
Grenade attack on Thakur Dwar mandir in Amritsar on Holi.
One of a dozen such attacks in the area recently.
If the snake of #Khalistan is again raising its head in Punjab, the Indian State should smash the head before lives are lost.pic.twitter.com/n5kSgdQ3KY— Abhijit Majumder (@abhijitmajumder) March 15, 2025
తాజావార్తలు
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
-
Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
-
Dal Dhokli Recipe : ఉల్లి, వెల్లుల్లి లేని ట్రెడిషనల్ గుజరాతీ ట్రెడిషనల్ వంటకం .. దీక్షలో ఉన్నప్పుడు భలే రుచిగా.!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..