Amit Shah: మత రిజర్వేషన్లను బీజేపీ ఎప్పటికీ అంగీకరించదు.. రాహుల్పై షా ఫైర్..
- ఆర్టికల్ 370 మీ నాలుగో తరం వల్ల కూడా కాదు..
- మత రిజర్వేషన్లను మోడీ ప్రభుత్వం అంగీకరించదు..
- రాహుల్ గాంధీపై అమిత్ షా తీవ్ర ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాహుల్ గాంధీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధినేత రాజ్యాంగానికి సంబంధించిన నకిలీ కాపీని చూపి అవమానిస్తు్న్నారడని అమిత్ షా మండిపడ్డారు. మైనారిటీలకు రిజర్వేషన్లు అమలు చేయడాన్ని బీజేపీ ఎప్పటికీ అంగీకరించడని షా అన్నారు. ‘‘ రాహుల్ గాంధీ రాజ్యాంగం కాపీని చూపించాడు. రెండు రోజుల క్రితం జరిగిన ఓ సమావేశంలో రాజ్యాంగం కాపీని పంపారు. కవర్పై భారత రాజ్యాంగం అని ఉంటే, లోపల మాత్రం ఖాళీ పేజీలు మాత్రమే దర్శనమిచ్చాయి. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేశాడు. బీఆర్ అంబేద్కర్ని కాంగ్రెస్ అవమానించింది’’ అని జార్ఖండ్లో పాలములో జరిగిన ఎన్నికల ప్రచారంలో అమిత్ షా అన్నారు.
Read Also: Huzurabad: హుజురాబాద్లో టెన్షన్ టెన్షన్.. కౌశిక్ రెడ్డికి అస్వస్థత
Also Read
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం నిర్వహించాలని ప్రధాని నరేంద్రమోడీ నిర్ణయించినట్లు చెప్పారు. ఓబీసీలు, దళితులు, గిరిజనుల నుంచి రిజర్వేషన్లు లాక్కోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, మైనారిటిలకు ఇవ్వాలని చూస్తోందని అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్ ఓబీసీ కోటాకు వ్యతిరేకం, ఉలేమాల బృందం కాంగ్రెస్ నాయకులను కలిసిన సందర్భంలో, మైనారిటీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారని, పీఎం మోడీ నాయకత్వం ఎప్పటికీ మత రిజర్వేషన్లను అనుమతించడని అమిత్ షా అన్నారు.
కాశ్మీర్లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కాశ్మీర్ భారత్లో అంతర్భాగమని, మీ నాలుగో తరం కూడా ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురాలేదని రాహుల్ గాంధీని అమిత్ షా హెచ్చరించారు. జేఎంఎం నేతృత్వంలోని జార్ఖండ్లోని ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని అభివర్ణించారు. 8181 మంది సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీకి నవంబర్ 13, 20 తేదీల్లో ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. మహారాష్ట్రలో నవంబర్ 20న 288 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు 23న జరుగుతుంది.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!