Amit Shah: మత రిజర్వేషన్లను బీజేపీ ఎప్పటికీ అంగీకరించదు.. రాహుల్పై షా ఫైర్..
- ఆర్టికల్ 370 మీ నాలుగో తరం వల్ల కూడా కాదు..
- మత రిజర్వేషన్లను మోడీ ప్రభుత్వం అంగీకరించదు..
- రాహుల్ గాంధీపై అమిత్ షా తీవ్ర ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాహుల్ గాంధీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధినేత రాజ్యాంగానికి సంబంధించిన నకిలీ కాపీని చూపి అవమానిస్తు్న్నారడని అమిత్ షా మండిపడ్డారు. మైనారిటీలకు రిజర్వేషన్లు అమలు చేయడాన్ని బీజేపీ ఎప్పటికీ అంగీకరించడని షా అన్నారు. ‘‘ రాహుల్ గాంధీ రాజ్యాంగం కాపీని చూపించాడు. రెండు రోజుల క్రితం జరిగిన ఓ సమావేశంలో రాజ్యాంగం కాపీని పంపారు. కవర్పై భారత రాజ్యాంగం అని ఉంటే, లోపల మాత్రం ఖాళీ పేజీలు మాత్రమే దర్శనమిచ్చాయి. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేశాడు. బీఆర్ అంబేద్కర్ని కాంగ్రెస్ అవమానించింది’’ అని జార్ఖండ్లో పాలములో జరిగిన ఎన్నికల ప్రచారంలో అమిత్ షా అన్నారు.
Read Also: Huzurabad: హుజురాబాద్లో టెన్షన్ టెన్షన్.. కౌశిక్ రెడ్డికి అస్వస్థత
Also Read
- El Nino: ఎల్నినోతో వర్షాలుండవన్నారు.. ఇప్పుడెందుకు భారత్ను ముంచెత్తున్నాయి.. కారణమేంటి?
- TMC: సొంత డబ్బులతో విమానం కొని, దానికే అద్దె చెల్లించారు.. తృణమూల్ స్కాంతో ఈడీ షాక్..
- TMC Crisis: మమతా బెనర్జీకి షాక్.. బీజేపీలోకి మాజీ టీఎంసీ ఎంపీలు..
- CJP: పార్లమెంట్ మార్చ్.. కాక్రోచ్ జనతా పార్టీ సంచలన ప్రకటన..
నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం నిర్వహించాలని ప్రధాని నరేంద్రమోడీ నిర్ణయించినట్లు చెప్పారు. ఓబీసీలు, దళితులు, గిరిజనుల నుంచి రిజర్వేషన్లు లాక్కోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, మైనారిటిలకు ఇవ్వాలని చూస్తోందని అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్ ఓబీసీ కోటాకు వ్యతిరేకం, ఉలేమాల బృందం కాంగ్రెస్ నాయకులను కలిసిన సందర్భంలో, మైనారిటీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారని, పీఎం మోడీ నాయకత్వం ఎప్పటికీ మత రిజర్వేషన్లను అనుమతించడని అమిత్ షా అన్నారు.
కాశ్మీర్లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కాశ్మీర్ భారత్లో అంతర్భాగమని, మీ నాలుగో తరం కూడా ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురాలేదని రాహుల్ గాంధీని అమిత్ షా హెచ్చరించారు. జేఎంఎం నేతృత్వంలోని జార్ఖండ్లోని ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని అభివర్ణించారు. 8181 మంది సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీకి నవంబర్ 13, 20 తేదీల్లో ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. మహారాష్ట్రలో నవంబర్ 20న 288 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు 23న జరుగుతుంది.
తాజావార్తలు
-
Iran: ఖమేనీ శవపేటికకు ఫైటర్ జెట్లలో పహారా..
-
Ponnam Prabhakar : వర్షాకాలం.. బస్తీ దవాఖానలపై ప్రభుత్వం అలర్ట్
-
El Nino: ఎల్నినోతో వర్షాలుండవన్నారు.. ఇప్పుడెందుకు భారత్ను ముంచెత్తున్నాయి.. కారణమేంటి?
-
TMC: సొంత డబ్బులతో విమానం కొని, దానికే అద్దె చెల్లించారు.. తృణమూల్ స్కాంతో ఈడీ షాక్..
-
Viral Video : “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా”.. మనవడితో సీఎం రేవంత్ రెడ్డి మధుర క్షణాలు
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!