Amit Shah: కాంగ్రెస్ కార్యక్రమాల్లో ‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ నినాదాలు.. రాహుల్గాంధీ మౌనం ఎందుకు..?
- రాహుల్ గాంధీ.. కాంగ్రెస్పై అమిత్ షా ఫైర్..
- కాంగ్రెస్ సమావేశాల్లో ‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ నినాదాలపై ఆగ్రహం..
- బుజ్జగింపు రాజకీయాలతో కాంగ్రెస్ కళ్లు మూసుకుపోయాయి..
- రాహుల్ గాంధీ మూడు తరాలు కూడా ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: హర్యానా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. హర్యానాలోని కాంగ్రెస్ కార్యక్రమాల్లో ‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ అనే నినాదాలు వినిపిస్తున్నాయని అన్నారు. బాద్షాపూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. బుజ్జగింపు రాజకీయాలతో కాంగ్రెస్ కళ్లు మూసుకుపోయాయని అన్నారు.
‘‘హర్యానాలో కొత్త ట్రెండ్ చూస్తున్నా. హతిన్ నుంచి థానేసర్ వరకు, థానేసర్ నుంచి పల్వాల్ వరకు కాంగ్రెస్ వేదికల వద్ద ‘‘పాకిస్తా జిందాబాద్’’ నినాదాలు వినిపిస్తున్నాయి. మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ నినాదాలను ఎందుకు లేవనెత్తుతున్నారు అని రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నా..పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలపై కాంగ్రెస్ బుజ్జగింపులతో ఎందుకు మౌనంగా ఉంటుంది..’’ అని అమిత్ షా అన్నారు.
Also Read
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
Read Also: Hassan Nasrallah: 60 అడుగుల లోతులో దుర్భేద్యమైన బంకర్.. అయినా, నస్రల్లాను ఎలా ఇజ్రాయిల్ చంపింది..?
‘‘జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని తిరిగి తీసుకువస్తామని కాంగ్రెస్ నేత ఇచ్చిన హామీపై రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. కాశ్మీర్ మనది కాదా..? ఆర్టికల్ 370ని తొలగించాలా వద్దా..? ఆర్టికల్ 370ని వెనక్కి తీసుకువస్తామని కాంగ్రెస్, రాహుల్ బాబాలు అంటున్నారు. రాహుల్ గాంధీ మూడు తరాలు కూడా ఆర్టికల్ 370ని వెనక్కి తీసుకురావు. హర్యానా యువత కాశ్మీర్ని రక్షించేందుకు ఎన్నో త్యాగాలు చేశారు. వాటిని వృథా కానివ్వబోం ’’ అని అమిత్ షా ధ్వజమెత్తారు.
ఈ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం వక్ఫ్ బిల్లులో సవరణలు తీసుకువస్తుందని హామీ ఇచ్చారు. వక్ఫ్ బోర్డు చట్టం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తాయని, ఈ శీతాకాల సమావేశాల్లో మెరుగుపరుస్తామని చెప్పారు. హర్యానాలో అక్టోబర్ 5న ఎన్నికలు జరుగుతుండగా.. అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీకి గుడ్న్యూస్.. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బద్దలే!
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25% వద్ద యథాతథం.. లక్షలాది మంది రుణగ్రహీతలకు ఊరట
-
Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
-
Ather Rizta Price Hike: పెరిగిన ఏథర్ రిజ్టా ధరలు.. ఏ వేరియంట్పై ఎంత ధర పెరిగిందో తెలుసా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..