Amit Shah: కాంగ్రెస్ కార్యక్రమాల్లో ‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ నినాదాలు.. రాహుల్గాంధీ మౌనం ఎందుకు..?
- రాహుల్ గాంధీ.. కాంగ్రెస్పై అమిత్ షా ఫైర్..
- కాంగ్రెస్ సమావేశాల్లో ‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ నినాదాలపై ఆగ్రహం..
- బుజ్జగింపు రాజకీయాలతో కాంగ్రెస్ కళ్లు మూసుకుపోయాయి..
- రాహుల్ గాంధీ మూడు తరాలు కూడా ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: హర్యానా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. హర్యానాలోని కాంగ్రెస్ కార్యక్రమాల్లో ‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ అనే నినాదాలు వినిపిస్తున్నాయని అన్నారు. బాద్షాపూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. బుజ్జగింపు రాజకీయాలతో కాంగ్రెస్ కళ్లు మూసుకుపోయాయని అన్నారు.
‘‘హర్యానాలో కొత్త ట్రెండ్ చూస్తున్నా. హతిన్ నుంచి థానేసర్ వరకు, థానేసర్ నుంచి పల్వాల్ వరకు కాంగ్రెస్ వేదికల వద్ద ‘‘పాకిస్తా జిందాబాద్’’ నినాదాలు వినిపిస్తున్నాయి. మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ నినాదాలను ఎందుకు లేవనెత్తుతున్నారు అని రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నా..పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలపై కాంగ్రెస్ బుజ్జగింపులతో ఎందుకు మౌనంగా ఉంటుంది..’’ అని అమిత్ షా అన్నారు.
Also Read
- Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
- Plastic Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..! మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి..?
- Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
Read Also: Hassan Nasrallah: 60 అడుగుల లోతులో దుర్భేద్యమైన బంకర్.. అయినా, నస్రల్లాను ఎలా ఇజ్రాయిల్ చంపింది..?
‘‘జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని తిరిగి తీసుకువస్తామని కాంగ్రెస్ నేత ఇచ్చిన హామీపై రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. కాశ్మీర్ మనది కాదా..? ఆర్టికల్ 370ని తొలగించాలా వద్దా..? ఆర్టికల్ 370ని వెనక్కి తీసుకువస్తామని కాంగ్రెస్, రాహుల్ బాబాలు అంటున్నారు. రాహుల్ గాంధీ మూడు తరాలు కూడా ఆర్టికల్ 370ని వెనక్కి తీసుకురావు. హర్యానా యువత కాశ్మీర్ని రక్షించేందుకు ఎన్నో త్యాగాలు చేశారు. వాటిని వృథా కానివ్వబోం ’’ అని అమిత్ షా ధ్వజమెత్తారు.
ఈ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం వక్ఫ్ బిల్లులో సవరణలు తీసుకువస్తుందని హామీ ఇచ్చారు. వక్ఫ్ బోర్డు చట్టం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తాయని, ఈ శీతాకాల సమావేశాల్లో మెరుగుపరుస్తామని చెప్పారు. హర్యానాలో అక్టోబర్ 5న ఎన్నికలు జరుగుతుండగా.. అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
తాజావార్తలు
-
Suriya: 200 రోజులు కష్టపడ్డా ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే ఇండస్ట్రీ హిట్! ఆ రెండు సినిమాలపై సూర్య షాకింగ్ కామెంట్స్..
-
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
-
Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
-
Kitchen Hacks: ఫ్రిజ్లో పెట్టిన కొత్తిమీర త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే వారాల తరబడి ఫ్రెష్గా ఉంటుంది!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!