Amit Shah: రాహుల్, ప్రియాంకా గాంధీని చూసైనా కాస్త నేర్చుకో..
- ఏం భాష మాట్లాడుతున్నారు..?
- ప్రియాంకా గాంధీని చూసి నేర్చుకోండి..
- రాహుల్ గాంధీపై అమిత్ షా ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్లో వీగిపోవడంతో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించలేదు. కేంద్రం ప్రతిపాదించిన 3 బిల్లులపై లోక్సభలో వాడీవేడి చర్చ నడిచింది. అయితే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలను ప్రశ్నించగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా గట్టిగా ప్రతిస్పందించారు. ప్రియాంకా గాంధీతో సహా కాంగ్రెస్ సీనియర్ల నుంచి రాహుల్ గాంధీ మాట్లాడటం నేర్చుకోవాలని అమిత్ షా వ్యంగ్యంగా అన్నారు.
Read Also: Chia Seeds : మధుమేహానికి చెక్ పెట్టే చియా సీడ్స్.. షుగర్ లెవల్స్ తగ్గాలంటే ఇలా తిని చూడండి!
Also Read
- Parliament Session 2026: 2015 రికార్డు బ్రేక్.. పార్లమెంట్ సమావేశాల ముగింపులో జాప్యంపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు
- Assam Magic Rice: "మ్యాజిక్ బియ్యం".. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
- BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
- BRICS Summit 2026 ఎఫెక్ట్.. ఢిల్లీలో రైళ్లకు బ్రేక్! ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
రాహుల్ గాంధీ సంస్థలను బలహీనపరుస్తున్నారని, రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని అమిత్ షా మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. భాష కేవలం భావోద్వేగాలనున మాత్రమే వ్యక్తీకరించకూడదని, సభలో మాట్లాడే కళను మీ సీనియర్ల నుంచి నేర్చుకోవాలని, మీ కన్నా సీనియర్ ఎవరూ లేకపోతే ప్రియాంకా గాంధీనే సీనియర్ ఆమె నుంచి నేర్చుకోండి అంటూ హితవు పలికారు. ఈ సభ గౌరవాన్ని కాపాడటం ప్రతిపక్ష నేతగా మీ బాధ్యత, మీరు ఉపయోగించిన భాష ఆ గౌరవాన్ని దెబ్బతీస్తోందని అన్నారు. రాహుల్ గాంధీపై తీవ్రంగా మండిపడుతూ.. ‘‘ఇది ఎలాంటి భాష, నువ్వు పిరికివాడివి, లొంగిపోతున్నావు, నాకు భయపడుతున్నావా? ఒక ప్రతిపక్ష నేత ఇలా ప్రవర్తించవచ్చా.? దేశం చూస్తోంది, మీ పార్టీని ప్రజలు పరిశీలిస్తున్నారు’’ అని ఆయన అన్నారు.
అంతకుముందు సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కేవలం బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండేందుకు మాత్రమే మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకువస్తోందని, ఇది నిజమైన బిల్లు కాదని ఆయన అన్నారు. ఈ బిల్లు ద్వారా దేశ రాజకీయ స్వరూపాన్ని మార్చాలని మోడీ సర్కార్ చూస్తోందని ఆరోపించారు. ఓబీసీలు, దళితులు, మహిళలకు ఈ బిల్లు ద్వారా నష్టం చేకూరుతోందని, రాజ్యాంగంపై మనువాదాన్ని రుద్దాలని చూస్తున్నారని విమర్శించారు.
తాజావార్తలు
-
Parliament Session 2026: 2015 రికార్డు బ్రేక్.. పార్లమెంట్ సమావేశాల ముగింపులో జాప్యంపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు
-
Soori: భారీగా పెరిగిన కమెడియన్ సూరి రెమ్యూనరేషన్.. రేంజ్ చూస్తే షాకవ్వాల్సిందే!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
Realme 16T 5G: 8000mAh బ్యాటరీతో అదరగొట్టే 5G ఫోన్.. 50MP కెమెరా, 144Hz డిస్ప్లే
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
ట్రెండింగ్
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!