Amit Shah: రాహుల్, ప్రియాంకా గాంధీని చూసైనా కాస్త నేర్చుకో..
- ఏం భాష మాట్లాడుతున్నారు..?
- ప్రియాంకా గాంధీని చూసి నేర్చుకోండి..
- రాహుల్ గాంధీపై అమిత్ షా ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్లో వీగిపోవడంతో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించలేదు. కేంద్రం ప్రతిపాదించిన 3 బిల్లులపై లోక్సభలో వాడీవేడి చర్చ నడిచింది. అయితే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలను ప్రశ్నించగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా గట్టిగా ప్రతిస్పందించారు. ప్రియాంకా గాంధీతో సహా కాంగ్రెస్ సీనియర్ల నుంచి రాహుల్ గాంధీ మాట్లాడటం నేర్చుకోవాలని అమిత్ షా వ్యంగ్యంగా అన్నారు.
Read Also: Chia Seeds : మధుమేహానికి చెక్ పెట్టే చియా సీడ్స్.. షుగర్ లెవల్స్ తగ్గాలంటే ఇలా తిని చూడండి!
Also Read
- PM Modi: యూకే కొత్త ప్రధానికి మోడీ ఫోన్.. ఏం మాట్లాడారంటే!
- PM Modi: ‘తిట్లతో ఏ సమస్యా పరిష్కారం కాదు’.. తప్పుదారి పట్టిన యువతకు సరైన మార్గం చూపాలి.. ప్రధాని మోడీ కొత్త వీడియో..
- Bhogapuram International Airport: నేడే భోగాపురం ఎయిర్పోర్ట్ జాతికి అంకితం.. మోదీ పర్యటనకు సర్వం సిద్ధం.. పూర్తి షెడ్యూల్ ఇదే..
- August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
రాహుల్ గాంధీ సంస్థలను బలహీనపరుస్తున్నారని, రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని అమిత్ షా మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. భాష కేవలం భావోద్వేగాలనున మాత్రమే వ్యక్తీకరించకూడదని, సభలో మాట్లాడే కళను మీ సీనియర్ల నుంచి నేర్చుకోవాలని, మీ కన్నా సీనియర్ ఎవరూ లేకపోతే ప్రియాంకా గాంధీనే సీనియర్ ఆమె నుంచి నేర్చుకోండి అంటూ హితవు పలికారు. ఈ సభ గౌరవాన్ని కాపాడటం ప్రతిపక్ష నేతగా మీ బాధ్యత, మీరు ఉపయోగించిన భాష ఆ గౌరవాన్ని దెబ్బతీస్తోందని అన్నారు. రాహుల్ గాంధీపై తీవ్రంగా మండిపడుతూ.. ‘‘ఇది ఎలాంటి భాష, నువ్వు పిరికివాడివి, లొంగిపోతున్నావు, నాకు భయపడుతున్నావా? ఒక ప్రతిపక్ష నేత ఇలా ప్రవర్తించవచ్చా.? దేశం చూస్తోంది, మీ పార్టీని ప్రజలు పరిశీలిస్తున్నారు’’ అని ఆయన అన్నారు.
అంతకుముందు సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కేవలం బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండేందుకు మాత్రమే మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకువస్తోందని, ఇది నిజమైన బిల్లు కాదని ఆయన అన్నారు. ఈ బిల్లు ద్వారా దేశ రాజకీయ స్వరూపాన్ని మార్చాలని మోడీ సర్కార్ చూస్తోందని ఆరోపించారు. ఓబీసీలు, దళితులు, మహిళలకు ఈ బిల్లు ద్వారా నష్టం చేకూరుతోందని, రాజ్యాంగంపై మనువాదాన్ని రుద్దాలని చూస్తున్నారని విమర్శించారు.
తాజావార్తలు
-
NIA: నంద్యాలలో ఎన్ఐఏ విచారణ.. కేరళ ఎన్కౌంటర్ తర్వాత మరో ట్విస్ట్.. మవోయిస్టు జయమ్మ జీవించి ఉందా..?
-
Jana Nayagan: కావేరీ నీటిపై మళ్లీ ఉద్రిక్తత.. విజయ్ ‘జన నాయగన్’ స్క్రీనింగ్ను అడ్డుకున్న కార్యకర్తలు!
-
Dharmakshetra: టాలీవుడ్లో సరికొత్త చరిత్ర: 30 రోజుల్లోనే భారతదేశపు తొలి ఏఐ ఇండిపెండెంట్ మూవీ “ధర్మక్షేత్ర” ముస్తాబు!
-
Anna Konidela: మంచి మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్ భార్య.. పుట్టినరోజు సందర్భంగా ఏం చేశారంటే!
-
Tollywood : ఓవైపు గాయలు.. మరోవైపు షూటింగ్స్ బ్రేక్.. ఏమైంది మన టాలీవుడ్కి
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!