Jana Nayagan: కావేరీ నీటిపై మళ్లీ ఉద్రిక్తత.. విజయ్ ‘జన నాయగన్’ స్క్రీనింగ్ను అడ్డుకున్న కార్యకర్తలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jana Nayagan: కావేరీ జలాల వివాదం మరోసారి కర్ణాటక, తమిళనాడు మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. 15 రోజుల పాటు ప్రతిరోజూ 3,500 క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని కావేరీ జల నియంత్రణ కమిటీ (CWRC) ఆదేశించడంతో కర్ణాటకలో నిరసనలు ఉధృతమయ్యాయి. ముఖ్యంగా మండ్య, మైసూరు జిల్లాల్లో రైతులు, కన్నడ సంఘాల కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. మండ్యలో నిరసనకారులు తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా పోస్టర్లను చించివేశారు. ఆ సినిమా ప్రదర్శితమవుతున్న గురుశ్రీ థియేటర్ను ముట్టడించి ప్రదర్శన నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని థియేటర్ యాజమాన్యం ప్రదర్శనను నిలిపివేసినట్లు సమాచారం. అనంతరం కార్యకర్తలు థియేటర్ బయట నినాదాలు చేస్తూ తమ నిరసన కొనసాగించారు.
ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా తమిళనాడుకు నీరు విడుదల చేయవద్దని డిమాండ్ చేస్తూ నిరసనకారులు జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం కర్ణాటకలో తీవ్రమైన తాగునీటి కొరత ఉందని, ప్రజలకు, పశువులకు సరిపడా నీరు కూడా అందుబాటులో లేదని వారు పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క చుక్క నీటిని కూడా విడుదల చేయరాదని ప్రభుత్వాన్ని కోరారు. మండ్య ప్రజలు ఎప్పుడూ కర్ణాటక ప్రయోజనాల కోసం ముందుండి పోరాడారని, ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని నిరసనకారులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నీటిని విడుదల చేస్తే తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని కూడా హెచ్చరించారు. మరోవైపు మైసూరు-బెంగళూరు జాతీయ రహదారిపై సర్ ఎం. విశ్వేశ్వరయ్య విగ్రహం సమీపంలో నిరసనకారులు రోడ్డును దిగ్బంధించడంతో భారీ ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకుని పలువురిని అదుపులోకి తీసుకుని ముందుజాగ్రత్తగా నిర్బంధించారు. మైసూరులో కూడా ఖాళీ కుండలతో ప్రదర్శనలు నిర్వహిస్తూ కావేరీ నీటిని తమిళనాడుకు విడుదల చేయొద్దని డిమాండ్ చేశారు.
Also Read
- Dharmakshetra: టాలీవుడ్లో సరికొత్త చరిత్ర: 30 రోజుల్లోనే భారతదేశపు తొలి ఏఐ ఇండిపెండెంట్ మూవీ "ధర్మక్షేత్ర" ముస్తాబు!
- Anna Konidela: మంచి మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్ భార్య.. పుట్టినరోజు సందర్భంగా ఏం చేశారంటే!
- Tollywood : ఓవైపు గాయలు.. మరోవైపు షూటింగ్స్ బ్రేక్.. ఏమైంది మన టాలీవుడ్కి
- Kartik Aaryan: అస్సాం వరద బాధితులకు కార్తీక్ ఆర్యన్ భారీ సాయం.. సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.1 కోటి విరాళం
ఈ పరిణామాలపై స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, CWRC ఆదేశంపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేస్తుందని, న్యాయపరమైన చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు. అలాగే కర్ణాటకలో నెలకొన్న నీటి సంక్షోభాన్ని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు తమిళనాడు ప్రభుత్వ ప్రతినిధులను కావేరీ జలాశయాలు సందర్శించాలని ఆహ్వానించారు. త మంగళవారం జారీ చేసిన ఆదేశాల్లో భాగంగా సుమారు నాలుగు టీఎంసీల నీటిని అందించేందుకు 15 రోజుల పాటు రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని CWRC సూచించింది. ఈ నిర్ణయం నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం మరోసారి వాడి వేడి రాజకీయ చర్చలకు దారితీసింది.
- Tags
- cinema
- Jana Nayagan
తాజావార్తలు
-
Jana Nayagan: కావేరీ నీటిపై మళ్లీ ఉద్రిక్తత.. విజయ్ ‘జన నాయగన్’ స్క్రీనింగ్ను అడ్డుకున్న కార్యకర్తలు!
-
Dharmakshetra: టాలీవుడ్లో సరికొత్త చరిత్ర: 30 రోజుల్లోనే భారతదేశపు తొలి ఏఐ ఇండిపెండెంట్ మూవీ “ధర్మక్షేత్ర” ముస్తాబు!
-
Anna Konidela: మంచి మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్ భార్య.. పుట్టినరోజు సందర్భంగా ఏం చేశారంటే!
-
Tollywood : ఓవైపు గాయలు.. మరోవైపు షూటింగ్స్ బ్రేక్.. ఏమైంది మన టాలీవుడ్కి
-
Hero Vida VX2 GO FB: 128 KM రేంజ్తో విడా VX2 GO FB కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్లు ఇవే
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!