Bharat Taxi: గుడ్న్యూస్.. భారత్ టాక్సీ యాప్ను ఆవిష్కరించిన అమిత్ షా
- భారత్ టాక్సీ యాప్ను ఆవిష్కరించిన అమిత్ షా
- ఢిల్లీ, గుజరాత్లో సేవలు ప్రారంభించిన కేంద్రమంత్రి
- రెండేళ్లలో దేశ వ్యాప్తంగా సేవలు విస్తరణ
- రూ.500 పెట్టుబడితో డ్రైవర్లు వాటాదారులుగా మారొచ్చని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ నేతృత్వంలో మొట్టమొదటి సారిగా రైడ్-హెయిలింగ్ ప్లాట్ఫామ్ ప్రారంభమైంది. సోమవారం ఢిల్లీలో భారత్ టాక్సీ యాప్ను కేంద్ర హోం, సహకార మంత్రి అమిత్ షా ప్రారంభించారు.

Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- PM Modi: బీజేపీ కొత్త టీమ్తో మోడీ భేటీ.. జెన్-జీపై ప్రత్యేక ఫోకస్
- Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
ఎనిమిది అగ్ర సహకార సంస్థల మద్దతుతో డిసెంబర్ 2, 2025న ఢిల్లీ-ఎన్సీఆర్, గుజరాత్లో పైలట్ కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. ఈ పైలట్ ఆపరేషన్ రెండు నెలల్లో విజయవంతమైందని అమిత్ షా అన్నారు. ఈ సేవ మొదట ఢిల్లీ-ఎన్సీఆర్, గుజరాత్లో ప్రారంభించబడిందని.. రెండు సంవత్సరాల్లో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించనుందని చెప్పారు. మూడు సంవత్సరాల్లో భారత్ టాక్సీ దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ద్వారక నుంచి కామాఖ్య వరకు ప్రారంభించబడుతుందని అమిత్ షా పేర్కొన్నారు. లాభాలు భారత్ టాక్సీతో అనుబంధించబడిన డ్రైవర్లతో పంచుకుంటామని హామీ ఇచ్చారు. వినియోగదారులు ఈ ప్లాట్ఫామ్ ద్వారా కార్లు, త్రీ-వీలర్లు, ద్విచక్ర వాహనాలను సద్వినియోగం చేసుకోవచ్చన్నారు.
డ్రైవర్లు రూ.500 పెట్టుబడితో వాటాదారులుగా మారవచ్చని అమిత్ షా అన్నారు. మూడేళ్లలో రూ.25 కోట్లు సంపాదిస్తే.. మొత్తంలో 20 శాతం సహకార మూలధనంగా ఉండనుందని.. మిగిలిన 80 శాతం డ్రైవర్లకు నడిపిన కిలోమీటర్ల ఆధారంగా పంపిణీ చేస్తామని వివరించారు. డ్రైవర్లే యజమానులు కాబట్టి లాభంలో వాటా ఉంటుందన్నారు. ఇక డ్రైవర్లు, రైడర్లు ఇద్దరికీ ఫిర్యాదుల పరిష్కారానికి యాప్, వెబ్సైట్లో విండో అందుబాటులో ఉంటుందని చెప్పారు. మహిళా రైడర్ల కోసం ‘‘సారథి దీదీ’ ఫీచర్ను త్వరలో యాప్లో ఉంచుతామన్నారు.
సహకార మంత్రిత్వ శాఖ ప్రకారం.. భారత్ టాక్సీ ప్రపంచంలోనే మొట్టమొదటి, అతిపెద్ద సహకార ఆధారిత రైడ్-హెయిలింగ్ ప్లాట్ఫామ్గా అవతరించిందని వెల్లడించింది. పైలట్ ప్రారంభం నుంచి మూడు లక్షలకు పైగా డ్రైవర్లు ప్లాట్ఫామ్లో చేరారు. లక్ష మందికి పైగా వినియోగదారులు నమోదు చేసుకున్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్, గుజరాత్లో ప్రతిరోజూ 10,000 కంటే ఎక్కువ రైడ్లు పూర్తయ్యాయి.
ఇప్పటి వరకు రెండు నెలల్లో రూ.10 కోట్లు డ్రైవర్లకు నేరుగా పంపిణీ అయింది. ఇక ఈ ప్లాట్ఫామ్ ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, పదవీ విరమణ పొదుపులు, అంకితమైన మద్దతు వ్యవస్థ ద్వారా డ్రైవర్లకు సామాజిక భద్రతను ‘సారథిస్’గా పిలుస్తున్నారు. ఇక ఢిల్లీలోని ఏడు ప్రదేశాల్లో సహాయ కేంద్రాలు పని చేస్తున్నాయి.
ప్రస్తుతం దేశంలో రైడ్-హెయిలింగ్ సర్వీస్ మార్కెట్లో ఉబెర్, ఓలా, రాపిడో వంటి కొన్ని సంస్థలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇప్పుడు దీనికి పోటీగా సహకార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారత్ టాక్సీ అందుబాటులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: PM Modi: ఈసారి సేవ చేసే అవకాశం బీజేపీకి ఇవ్వండి.. బెంగాలీయులకు మోడీ పిలుపు
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!