PM Modi: ఈసారి సేవ చేసే అవకాశం బీజేపీకి ఇవ్వండి.. బెంగాలీయులకు మోడీ పిలుపు
- ఈసారి సేవ చేసే అవకాశం బీజేపీకి ఇవ్వండి
- బెంగాలీయులకు మోడీ పిలుపు
- ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈసారి బీజేపీ ప్రభుత్వానికి సేవ చేసే అవకాశం ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ ప్రజలను ప్రధాని మోడీ కోరారు. ఈ మేరకు బెంగాలీయులను ఉద్దేశించి బహిరంగ లేఖ విడుదల చేశారు. రాష్ట్ర అభివృద్ధి, శాంతి భద్రతలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ హిందీ, బెంగాల్ భాషల్లో లేఖలు రాశారు. లేఖ ప్రారంభంలో కాళీమాతను స్తుతిస్తూ రాశారు.
త్వరలోనే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ విడుదలకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ తరుణంలో ప్రధాని మోడీ లేఖ రాయడం కీలకంగా మారింది. రాబోయే నెలల్లో రాష్ట్ర భవిష్యత్ను నిర్ణయించే అధికారం ప్రజలదేనని లేఖలో పేర్కొన్నారు. అభివృద్ధి, సంపన్నమైన రాష్ట్రంగా మార్చేందుకు ఇదొక అవకాశం అని.. ఈ అభివృద్ధి ప్రయాణంలో బెంగాలీయులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- Siddaramaiah: డీకేకు చెక్ పెట్టాలని సిద్ధరామయ్య ప్లాన్.. హైకమాండ్ షాక్
- Congress: భారత్పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
- Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
బెంగాల్ భూమి దేశానికి అనేక మంది గొప్ప వ్యక్తులను అందించిందని.. నేతాజీ సుభాష్ చంద్రబోస్, రవీంద్రనాథ్ ఠాగూర్లను ఉదహరించారు. బెంగాల్కు కీర్తిని తెచ్చిన గొప్ప వ్యక్తులను, దానికి కొత్త దిశానిర్దేశం చేయవలసిన అవసరాన్ని తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ దార్శనికతను కూడా గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా.. అనేక కేంద్ర పథకాల ప్రయోజనాలు పశ్చిమ బెంగాల్లోని లక్షలాది మందికి చేరాయని పేర్కొన్నారు. రైతులు, యువత, మహిళలు, పేదల కోసం ప్రారంభించిన పథకాలు సానుకూల ఫలితాలను ఇచ్చాయని తెలిపారు. గత 11 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చిందని మోడీ గుర్తుచేశారు.
ఇటీవల కాలంలో రాష్ట్రం వెనుకబడి ఉందని లేఖలో రాశారు. రాజకీయ హింస, అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు రాష్ట్ర పురోగతికి ఆటంకం కలిగిస్తున్నాయని ఆరోపించారు. యువత వలసలు, పెట్టుబడుల కొరత గురించి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలంటే బీజేపీకి అవకాశం ఇవ్వాలని మోడీ కోరారు.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..