Amit Shah: మోదీ ఫోటోతో ఓట్లు అడిగి.. కాంగ్రెస్,ఎన్సీపీ కాళ్లు పట్టుకున్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: శివసేన పార్టీ, ఆ పార్టీ ఎన్నికల గుర్తు ‘విల్లు-బాణం’ను సీఎం ఏక్ నాథ్ షిండే వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై ఉద్దవ్ ఠాక్రే వర్గం తీవ్రంగా స్పందించింది. మోదీకి మహారాష్ట్రలో ముఖం చెల్లకే బాలా సాహెబ్ ఠాక్రే ముఖాన్ని వాడుకునేందుకు పార్టీ పేరు, ఎన్నికల చిహ్నాన్ని దొంగిలించారని ఉద్ధవ్ ఠాక్రే బీజేపీపై విమర్శలు గుప్పించారు. సీఎం ఏక్ నాథ్ షిండేను దొంగగా అభివర్ణించారు.
Read Also: Taraka Ratna: నందమూరి తారక రత్న అకాల మరణం బాధాకరం- ప్రధాని మోదీ
Also Read
- Karnataka: కొత్త ప్రభుత్వం ఏర్పాటు వేళ హోంమంత్రి పరమేశ్వర అలక.. మరో సంక్షోభం తప్పదా?
- Karnataka High Court: చేతులు, కాళ్లు నరికేస్తే చట్టాలు పాటిస్తారేమో.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
- West Bengal Politics: మమతా పార్టీలో ‘‘షిండే’’ రాజకీయాలు.. తృణమూల్లో తీవ్ర సంక్షోభం..
- Trump: ‘ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ మోడీ’’ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఆసక్తి రేపుతోన్న కామెంట్స్
ఇదిలా ఉంటే ఉద్ధవ్ వర్గం విమర్శలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. నిజం, అబద్దాన్ని ఈసీ గుర్తించిందని.. అందుకే షిండే వర్గానికి శివసేనను కేటాయించిందని అన్నారు. సత్యమేవ జయతే అనేది ఈసీ నిర్ణయంతో తెలిసిందని అన్నారు. ఎన్నికల ముందు ప్రధాని మోదీ ఫోటోతో ఓట్లు అడిగి, ఎన్నికల తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీ కాళ్లు పట్టుకున్నారని ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు గుప్పించారు. సీఎం ఏక్ నాథ్ షిండే మాట్లాడుతూ.. సంక్షోభ సమయంలో నా వెనక అమిత్ షా అండగా నిలబడ్డారని.. ఆయన నాతో ‘షిండే జీ మీరు ముందుకెళ్లండి, మేం మీ వెనక గట్టిగా నిలబడతాం’’ అని అన్నారని, ఆయన చెప్పినట్లే చేశారని వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో మహారాష్ట్రలో ‘డబుల్ హార్స్పవర్’ ప్రభుత్వం కష్టపడి పనిచేస్తుందని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. గడిచిన రెండున్నరేళ్ల మహావికాస్ అఘాడీ ప్రభుత్వ పాలన వ్యర్థం అని.. మాకు మరో రెండున్నరేళ్లు మిగిలి ఉన్నాయని, చేయాల్సిన పని చాలా ఉందని ఆయన అన్నారు. గతేడాది శివసేన 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది తిరుగుబాటు చేశారు. వీరంతా ఏక్ నాథ్ షిండేకు మద్దతు ప్రకటించారు. 18 మంది ఎంపీల్లో 13 మంది షిండేకు జై కొట్టారు. దీంతో గతేడాది ఏక్ నాథ్ షిండే సీఎంగా, బీజేపీ మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
#WATCH | "The Election Commission established the difference between truth and lie yesterday. The formula of 'Satyameva Jayate' became significant yesterday…" says Union Home Minister Amit Shah in Pune, Maharashtra. #ShivSena pic.twitter.com/E82Kt3ok86
— ANI (@ANI) February 18, 2023
తాజావార్తలు
-
Buchi Babu Sana: ‘ఆ విషయంలో చిరంజీవి గారు ఫోన్ చేసి తిడతారేమో అనుకున్నా’: బుచ్చిబాబు
-
Karnataka: కొత్త ప్రభుత్వం ఏర్పాటు వేళ హోంమంత్రి పరమేశ్వర అలక.. మరో సంక్షోభం తప్పదా?
-
Karnataka High Court: చేతులు, కాళ్లు నరికేస్తే చట్టాలు పాటిస్తారేమో.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Palak Pakoda Recipe: సింపుల్గా ఇంటి వద్దే కరకరలాడే పాలక్ పకోడాలు.. ఇలా రెడీ తయారు చేయండి..
ట్రెండింగ్
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!