Amit Shah: “ఆ పోస్టులు ఖాళీగా లేవు”.. కాంగ్రెస్, ఆర్జేడీపై అమిత్ షా కామెంట్స్..
- ప్రధాని, సీఎం పోస్టులు ఖాళీ లేవు..
- లాలూ, సోనియాలకు అవకాశం లేదు..
- బీహార్ ఎన్నికల ర్యాలీలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు వ్యాఖ్యల పదును పెరిగింది. ఎన్డీయే సీఎం అభ్యర్థి ఎవరని ప్రశ్నిస్తున్న ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలను ఉద్దేశిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏన్డీయే సీఎం అభ్యర్థి నితీష్ కుమార్ అని స్పష్టం చేశారు. ‘‘బీహార్లో సీఎం పోస్టు, ఢిల్లీలో పీఎం పోస్టు ఖాళీగా లేవు. నితీష్ కుమార్ ఇక్కడ, మోడీ అక్కడ ఉన్నారు’’ అని బీహార్లో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా అన్నారు. లాలూ, సోనియా గాంధీలకు అవకాశం లభించదని చెప్పారు. జింగిల్ రాజ్ నుంచి బీహార్ను రక్షించుకోవడానికి ఈ ఎన్నికలు చాలా కీలమని, ఒక్క తప్పు చేసినా రాష్ట్రం 20 ఏళ్ల వెనక్కి వెళ్తుందని అమిత్ షా ప్రజల్ని హెచ్చరించారు.
Read Also: DK Shivakumar: “కారు” లేని అబ్బాయిలకు అమ్మాయిలను ఇవ్వడం లేదు.. బీజేపీ రెస్పాన్స్ ఇదే..
Also Read
- US Ambassador: ట్రంప్ కలవాలనుకునే టాప్ లీడర్ మోడీనే..
- Jewar Toll Plaza: కేంద్రం గుడ్న్యూస్.. 14 ఏళ్ల డిమాండ్కు పరిష్కారం.. అక్కడ టోల్ ఫ్రీ ప్రయాణం..
- Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లు జలమయం
- Nepal Floods: 170 మీటర్ల లోతులో 9 రోజులు.. "మహామంత్రం" జపిస్తూ ప్రాణాలతో బయటపడ్డ నేపాల్ కార్మికుడు..
‘‘బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి చాలా మంది యువకులకు టిక్కెట్లు ఇచ్చింది, కానీ ఆర్జేడీ మరియు కాంగ్రెస్ టిక్కెట్లు ఇవ్వలేదు. లాలూ జీ తన కుమారుడు తేజస్వి (యాదవ్) ను ముఖ్యమంత్రిని చేయాలని కోరుకుంటున్నారు. సోనియా జీ తన కుమారుడు రాహుల్ (గాంధీ) ను ప్రధానమంత్రిగా చేయాలని కోరుకుంటున్నారు. రెండు పదవులు ఖాళీగా లేవని నేను వారికి తెలియజేయాలనుకుంటున్నాను’’ అని దర్భాంగా ర్యాలీలో ఆయన అన్నారు.
‘‘పాట్నాలోని ఫుల్వారీ షరీఫ్ లో పీఎఫ్ఐ కార్యకర్తలు చురుగ్గా ఉన్నారు. దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించాం. వారిని జైలులో పెట్టాం. బీహార్లో ఆర్జేడీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారు జైలులో ఉంటారని మీరు భావిస్తున్నారా..?’’ అని ప్రశ్నించారు. చొరబాటుదారుల పేర్లు ఓటర్ జాబితాలో ఉండాలని రాహుల్ గాంధీ అనుకుంటున్నారని విమర్శించారు.
ప్రచారంలో జాప్యం, సీట్ల పంపకాల చర్చలు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ క్షేత్ర స్థాయిలో లేకపోవడంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల, మహాఘటబంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వీ యాదవ్ను ప్రకటించారు. దీంతో బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరని ప్రశ్నించిన నేపథ్యంలో అమిత్ షా నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. 2005లో ఆర్జేడీని గద్దె దించిన నితీష్ కుమార్ అప్పటి నుంచి సీఎంగా కొనసాగుతున్నారు.
తాజావార్తలు
-
Father-Daughter Bond: తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా.. Miss You మెసేజ్.. కూతురి కోసం 14 గంటల ప్రయాణం..
-
US Ambassador: ట్రంప్ కలవాలనుకునే టాప్ లీడర్ మోడీనే..
-
Ind Vs Japan: చరిత్రలో తొలిసారి.. భారత్–జపాన్ మధ్య టీ20 పోరు..
-
Jewar Toll Plaza: కేంద్రం గుడ్న్యూస్.. 14 ఏళ్ల డిమాండ్కు పరిష్కారం.. అక్కడ టోల్ ఫ్రీ ప్రయాణం..
-
Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లు జలమయం
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!