Wolf attacks: ‘‘తోడేళ్లు ప్రభుత్వం కన్నా తెలివైనవా..?’’ దాడులపై యూపీ మంత్రి అర్థం లేని మాటలు..
- తోడేళ్లు ప్రభుత్వం కన్నా తెలివైనవి..
- అందుకే పట్టుకోవడంలో ఆలస్యం అవుతుంది..
- తోడేళ్ల దాడులపై యూపీ మంత్రి వింత వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wolf attacks: ఉత్తర్ ప్రదేశ్ని తోడేళ్లు వణికిస్తున్నాయి. ముఖ్యంగా బహ్రైచ్ జిల్లాలో వరసగా దాడులకు తెగబడుతున్నాయి. నరమాంసానికి అలవాటు పడిన తోడేళ్లు పిల్లల్ని, వృద్ధుల్ని టార్గెట్ చేస్తూ చంపేసి, తింటున్నాయి. వీటిని పట్టుకునేందుకు 200 మందికి పైగా అటవీ, పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు. అయితే, ఇప్పటి వరకు 4 తోడేళ్లు బంధించారు. అయినా కూడా దాడులు ఆగడం లేదు. శుక్రవారం మహసీ తాహసీల్లో ఇంటి ముందు ఆడుకుంటున్న 8 ఏళ్ల బాలుడిపై తోడేలు దాడి చేసింది. బాలుడి కేకలు విని కుటుంబ సభ్యలు రక్షించడంతో ప్రాణాలు దక్కాయి. ప్రస్తుతం అతడిని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. గత రెండు నెలల్లో బహ్రైచ్లోని వివిధ గ్రామాల్లో తోడేళ్ల దాడుల వల్ల ఏడుగురు పిల్లలు, ఒక వ్యక్తి మరణించారు. 30కి పైగా మంది గాయపడ్డారు.
Read Also: Crime: బర్త్ డే పార్టీలో మత్తుమందు ఇచ్చి యువతిపై అత్యాచారం..
Also Read
- National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
- Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
- Karnataka: ‘‘చిల్లర లేకపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Monsoon: రైతులకు గుడ్ న్యూస్.. జోరందుకోనున్న రుతుపవనాలు.. జూలై 18-25 మధ్య భారీ వర్ష సూచన
ఇదిలా ఉంటే, తోడేళ్ల దాడులపై ఉత్తర్ ప్రదేశ్ అటవీ శాఖ మంత్రి బేబీ రాణి మౌర్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదంగా మారాయి. ఓ పక్క తోడేళ్ల దాడులు కొనసాగుతుంటే, వాటిని వేగంగా నియంత్రించడం సులభం కాదని వింత వాదనని తెరపైకి తెచ్చారు. ఝాన్సీలో ఈ రోజు తోడేళ్ల దాడులపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘జంతువులు ప్రభుత్వం కన్నా చాలా తెలివైనవి కాబట్టి తోడేళ్లను సులభంగా పట్టుకోలేము’’ అని అన్నారు. చాలా టీములు తోడేళ్ల కోసం అణ్వేషిస్తున్నారని చెప్పారు. తోడేళ్లు ప్రభుత్వం కన్నా తెలివైనవి కాబట్టి సమయం పడుతుందని, మేము ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.
గురువారం కూడా తోడేళ్లు పిల్లలపై దాడులు చేశాయిన మహసీ తాహసీల్లోని గోల్వా గ్రామంలో పిల్లాడు ఆడుకుంటున్న సమయంలో తోడేలు దాడి చేసింది. పిల్లాడు కేకలు వేయడంతో తాము రక్షించినట్లు బాలుడి తల్లి చెప్పింది. చిన్నారిపై తోడేలు వెనుక నుంచి దాడి చేసిందని స్థానిక వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంజయ్ ఖత్రి తెలిపారు. వర్షాకాలంలో జూలై 17 నుండి దాడులు పెరిగాయి మరియు ఇప్పటి వరకు, ఈ దాడుల కారణంగా ఏడుగురు పిల్లలతో సహా మొత్తం ఎనిమిది మంది మరణించారు.
తాజావార్తలు
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
-
Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..