Amarinder Singh: బీజేపీలో చేరిన అమరీందర్ సింగ్.. పార్టీ కూడా విలీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amarinder Singh: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, కిరెన్ రిజిజు సమక్షంలో కాషాయ కండువాను కప్పుకున్నారు. అమరీందర్ సింగ్ తన పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ను కూడా బీజేపీలో విలీనం చేశారు. అంతకుముందు అమరీందర్ సింగ్ తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తారనే ఊహాగాహాలు వినిపించాయి. ఆ వార్తలను నిజం చేస్తూ కొన్ని రోజుల కిందట ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో కూడా ఆయనను అభ్యర్థిగా ఎన్నుకుంటారనే వార్తలు వచ్చాయి. కానీ బీజేపీ అనూహ్యంగా బెంగాల్ గవర్నర్గా పనిచేసిన జగదీప్ ధన్కర్ను ఎంచుకుంది.
ఆయన పార్టీలో చేరేముందు ఢిల్లీలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో అమరీందర్ సింగ్ భేటీ అయ్యారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన అమరీందర్ సింగ్, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు. అమరీందర్ సింగ్ పార్టీలో చేరడం పట్ల న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు హర్షం వ్యక్తం చేస్తూ దేశంలోని సరైన ఆలోచనాపరులు ఐక్యంగా ఉండాలని అన్నారు.”పంజాబ్ వంటి సున్నితమైన రాష్ట్రాన్ని జాగ్రత్తగా నిర్వహించాలి. ఆయన సీఎంగా ఉన్న సమయంలో ఎప్పుడూ దేశ భద్రతకు ముందు రాజకీయాలను ఉంచలేదు” అని రిజిజు అన్నారు.
Also Read
- Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
- Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
- IRCTC: తత్కాల్ టికెట్ దొరకలేదని బాధపడొద్దు.. మీకు ఈ ఆప్షన్ ఉందని తెలుసా!
- Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
Assembly Seats: ఈసీ, కేంద్ర ప్రభుత్వంతో పాటు ఏపీ, తెలంగాణ సర్కారులకు సుప్రీంకోర్టు నోటీసులు
సెప్టెంబర్ 12న ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన తర్వాత అమరీందర్ బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్లో పనిచేసిన అమరీందర్.. గతేడాది హస్తం పార్టీతో తెగదెంపులు చేసుకున్నారు. అప్పటి పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్తో విభేదాలు రావడంతో ఆయనను సీఎం పదవి నుంచి కాంగ్రెస్ తప్పించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై కాంగ్రెస్కు రాజీనామా చేసిన ఆయన.. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసి ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయారు. అమరీందర్ సింగ్ బీజేపీలో చేరడం ఆ పార్టీకి చాలా లాభమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
తాజావార్తలు
-
Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
-
Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
-
Russia: నాటో కూటమిలో చీలిక తెచ్చేందుకు పుతిన్ బిగ్ ప్లాన్.!
-
Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
-
Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!