Rahul Gandhi: అన్ని వ్యవస్థలను ఆర్ఎస్ఎస్ నడుపుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వర్షాకాల పార్లమెంటు సమావేశాల అనంతరం వివిధ రాష్ట్రాల పర్యటనలు చేపడుతున్నారు. ఇప్పటికే రాజస్థాన్లో పర్యటను ముగించుకున్న రాహుల్ గాంధీ.. శుక్రవారం జమ్ము కాశ్మీర్ లడఖ్లో పర్యటించారు. రాబోయే ఎన్నికల్లో విజయవం సాధించడం కోసం రాహుల్ గాంధీ పర్యటనలను కొనసాగిస్తు్న్నారు. వచ్చే నెలలో భారత్ జోడో యాత్ర2ను ప్రారంభించే అవకాశం ఉన్నందు.. అంతకంటే ముందుగానే కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పర్యటనలు చేయాలని భావించిన రాహుల్ ఇలా పర్యటనలను కొనసాగిస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా ఫుట్బాల్ మ్యాచ్ను తిలకించారు. అలాగే కొద్దిసేపు బైక్ రైడ్ను చేశారు. ఈ సందర్భంగా ప్రజలతోనూ మాట్లాడారు. దేశంలోని అన్ని వ్యవస్థలను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) నడుపుతోందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. వ్యవస్థటన్నింటిలోనూ తన మనుషులను ఏర్పాటు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. జమ్మూ-కశ్మీరు రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత తొలిసారి రాహుల్ గాంధీ లడఖ్లో పర్యటిస్తున్నారు.
Read also: Over Exercise: ఎక్సర్సైజ్ ఎక్కువగా చేస్తే సమస్యలు వస్తాయా..! నిజమెంత..?
Also Read
- Snake bite: కానిస్టేబుల్ను కాటేసిన పాము.. AI సాయంతో దక్కిన ప్రాణాలు..
- Gold Coins: మురికి కాలువలో బంగారు నాణేలు.. తవ్వుతున్న కొద్దీ దొరుకుతూనే ఉన్నాయ్..
- Amit Shah: ‘‘దేశ ప్రజలు మీ పాపాలను క్షమించరు’’.. సోనియాగాంధీపై అమిత్ షా ఫైర్..
- Javed Akhtar: హిందువులపై పాక్ అధ్యక్షుడి వ్యాఖ్యలు.. "మిస్టర్ 10%" అంటూ జావెద్ అక్తర్ కౌంటర్..
కేంద్ర మంత్రుల్లో ఎవరిని అడిగినా తమ మంత్రిత్వ శాఖలను వాస్తవంగా నిర్వహిస్తున్నది తాము కాదని.. ఆర్ఎస్ఎస్ నియమించిన వ్యక్తులే నిర్వహిస్తున్నారని చెబుతారని రాహుల్ చెప్పారు. ప్రతి విషయంలోనూ ఆర్ఎస్ఎస్ వ్యక్తుల ప్రమేయం ఉంటోందన్నారు. అన్ని వ్యవస్థలనూ ఆర్ఎస్ఎస్సే నడుపుతోందని, ప్రతి వ్యవస్థలోనూ ఆర్ఎస్ఎస్ తన మనుషులను ఏర్పాటు చేస్తోందని రాహుల్ తెలిపారు. లేహ్లో జరిగిన కార్యక్రమంలో ఆయన రాహుల్ యువతతో మాట్లాడారు. అంతకుముందు రాహుల్ గాంధీ లేహ్లో ఫుట్బాల్ మ్యాచ్ను తిలకించారు. భారత దేశానికి 1947లో స్వాతంత్ర్యం లభించిందని, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఆ స్వాతంత్ర్యం బలపడిందని చెప్పారు. ఎన్నో నిబంధనల సమాహారమే రాజ్యాంగమని తెలిపారు. రాజ్యాంగ దార్శనికతకు అనుగుణంగా వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా అమలు చేయాలన్నారు.
తాజావార్తలు
-
Snake bite: కానిస్టేబుల్ను కాటేసిన పాము.. AI సాయంతో దక్కిన ప్రాణాలు..
-
Gold Coins: మురికి కాలువలో బంగారు నాణేలు.. తవ్వుతున్న కొద్దీ దొరుకుతూనే ఉన్నాయ్..
-
Amit Shah: ‘‘దేశ ప్రజలు మీ పాపాలను క్షమించరు’’.. సోనియాగాంధీపై అమిత్ షా ఫైర్..
-
VishwanathAndSons : రెండురోజుల్లో వంద కోట్ల వసూళ్లు రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’
-
Rajasthan Crime: తాత హత్యకు దారితీసిన పెళ్లి వివాదం
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?