Himachal: హిమాచల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రెస్టారెంట్లపై యజమానుల పేర్లు ప్రదర్శించాలని ఆదేశం
- హిమాచల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
- రెస్టారెంట్లపై యజమానుల పేర్లు ప్రదర్శించాలని ఆదేశం
కాంగ్రెస్ నేతృత్వంలోని హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రెస్టారెంట్లు, తినుబండారాలు, ఫుడ్ స్టాల్స్ నిర్వహించే యజమానులు, నిర్వాహకుల పేర్లు, చిరునామాలను బోర్డులపై ప్రదర్శించాలని ఆదేశించింది. ఇటీవలే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా యోగి సర్కార్ మాదిరిగా నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఏదైనా సమస్య తలెత్తితే పారదర్శకంగా దర్యాప్తు జరిగేలా చూస్తామని రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్ అన్నారు.
ఇది కూడా చదవండి: Gaza War: 64 మంది ఇజ్రాయిలీ బందీలు ఎక్కడ..? ఏడాదైనా జాడ లేదు..
Also Read
- Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
- The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
ఉత్తర్వులు జారీ అయ్యాయని, జనవరి నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గుర్తింపు కార్డులు కూడా జారీ చేస్తామని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ మాదిరిగానే రాష్ట్రంలో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు పట్టణాభివృద్ధి మంత్రి విక్రమాదిత్య సింగ్ విలేకరులతో అన్నారు. పరిశుభ్రమైన ఆహారాన్ని సరఫరా చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు మునిసిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఫుడ్ స్టాల్స్లో ఆహార లభ్యతపై ప్రజల భయాలు పరిగణనలోకి తీసుకొని సమిష్టిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Manu bhaker: ప్రైవేట్ ఈవెంట్ల్లో మెడల్స్ ప్రదర్శనపై ట్రోల్స్.. మను భాకర్ ఏమన్నారంటే..!
ఇటీవలే ఉత్తరప్రదేశ్లోని యోగి ప్రభుత్వం కూడా నేమ్ బోర్డులు ప్రదర్శించాలని ఆదేశించింది. తినుబండారాల దుకాణ యజమానులు, నిర్వాహకులు, యజమానుల పేర్లను వారి ఆహార కేంద్రాల వెలుపల ప్రదర్శించడాన్ని తప్పనిసరి చేసింది. అంతేకాకుండా హోటళ్లు, రెస్టారెంట్లలో సీసీటీవీల ఏర్పాటును కూడా తప్పనిసరి చేసింది.
ఇది కూడా చదవండి: Minister Atchannaidu: అర్హత లేని వారూ పథకాలు పొందుతున్నారు.. వారిని కట్టడి చేస్తాం..
తాజావార్తలు
-
Riyan Parag: వరుస వివాదాల్లో రాజస్థాన్ రాయల్స్.. డ్రెస్సింగ్ రూమ్లో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ కెప్టెన్..
-
Lenin : రామ్ చరణ్ ‘పెద్ది’ దెబ్బతో మళ్లీ సైలెంట్ అయిన ‘లెనిన్’ !
-
Bajaj Chetak C2501 STD: బజాజ్ చేతక్ సిరీస్లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్లు & స్పెసిఫికేషన్స్
-
Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
-
Bank Holiday May 2026: మే నెలలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో