Himachal: హిమాచల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రెస్టారెంట్లపై యజమానుల పేర్లు ప్రదర్శించాలని ఆదేశం
- హిమాచల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
- రెస్టారెంట్లపై యజమానుల పేర్లు ప్రదర్శించాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ నేతృత్వంలోని హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రెస్టారెంట్లు, తినుబండారాలు, ఫుడ్ స్టాల్స్ నిర్వహించే యజమానులు, నిర్వాహకుల పేర్లు, చిరునామాలను బోర్డులపై ప్రదర్శించాలని ఆదేశించింది. ఇటీవలే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా యోగి సర్కార్ మాదిరిగా నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఏదైనా సమస్య తలెత్తితే పారదర్శకంగా దర్యాప్తు జరిగేలా చూస్తామని రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్ అన్నారు.
ఇది కూడా చదవండి: Gaza War: 64 మంది ఇజ్రాయిలీ బందీలు ఎక్కడ..? ఏడాదైనా జాడ లేదు..
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
ఉత్తర్వులు జారీ అయ్యాయని, జనవరి నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గుర్తింపు కార్డులు కూడా జారీ చేస్తామని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ మాదిరిగానే రాష్ట్రంలో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు పట్టణాభివృద్ధి మంత్రి విక్రమాదిత్య సింగ్ విలేకరులతో అన్నారు. పరిశుభ్రమైన ఆహారాన్ని సరఫరా చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు మునిసిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఫుడ్ స్టాల్స్లో ఆహార లభ్యతపై ప్రజల భయాలు పరిగణనలోకి తీసుకొని సమిష్టిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Manu bhaker: ప్రైవేట్ ఈవెంట్ల్లో మెడల్స్ ప్రదర్శనపై ట్రోల్స్.. మను భాకర్ ఏమన్నారంటే..!
ఇటీవలే ఉత్తరప్రదేశ్లోని యోగి ప్రభుత్వం కూడా నేమ్ బోర్డులు ప్రదర్శించాలని ఆదేశించింది. తినుబండారాల దుకాణ యజమానులు, నిర్వాహకులు, యజమానుల పేర్లను వారి ఆహార కేంద్రాల వెలుపల ప్రదర్శించడాన్ని తప్పనిసరి చేసింది. అంతేకాకుండా హోటళ్లు, రెస్టారెంట్లలో సీసీటీవీల ఏర్పాటును కూడా తప్పనిసరి చేసింది.
ఇది కూడా చదవండి: Minister Atchannaidu: అర్హత లేని వారూ పథకాలు పొందుతున్నారు.. వారిని కట్టడి చేస్తాం..
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!