Delhi Car Blast: చాలా బాధాకరం.. దాడులతో సంబంధంలేదన్న అల్ ఫలాహ్ యూనివర్సిటీ
- చాలా బాధాకరం
- దాడులతో సంబంధంలేదన్న అల్ ఫలాహ్ యూనివర్సిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ కారు బాంబ్ పేలుడు తర్వాత హర్యానాలోని ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ పేరు మార్మోగుతోంది. ఢిల్లీ బ్లాస్ట్లో పాల్గొన్న అనుమానిత వైద్యులు అల్ ఫలాహ్లోనే పని చేస్తున్నారు. పట్టుబడ్డ వైద్యులు.. యూనివర్సిటీలో కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీపై అనేక కథనాలు వెలువడుతున్నాయి.
ఇది కూడా చదవండి: Hyderabad: శుభకార్యంలో రెచ్చిపోయిన హిజ్రాలు.. డబ్బులు ఇవ్వలేదని గుంపుగా దాడి
Also Read
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
- Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
- RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
ఈ నేపథ్యంలో అల్ ఫలాహ్ యూనివర్సిటీ యాజమాన్యం స్పందించింది. ఢిల్లీ పేలుడు దురదృష్టకర సంఘటనగా పేర్కొంది. ఢిల్లీ పరిణామాలు తమను ఎంతగానో బాధించాయని.. తమ సంస్థపై వస్తున్న కథనాలను ఖండిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ భూపిందర్ కౌర్ ఆనంద్ పేరిట ఒక ప్రకటన విడుదలైంది. వైద్యులతో తమకు వృత్తిపరమైన సంబంధం మాత్రమే ఉందని స్పష్టం చేసింది. 1997 నుంచి అనేక విద్యాసంస్థలు నిర్వహించామని.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్గా కూడా అధికారికంగా గుర్తించిందని వెల్లడించింది. 2019 నుంచి ఎంబీబీఎస్ కోర్సు నిర్వహిస్తున్నామని.. ఇక్కడ విద్యను అభ్యసించినవాళ్లు దేశ, విదేశాల్లో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నట్లు స్పష్టం చేసింది. అయితే ప్రస్తుత దురదృష్టకర సంఘటనలు బాధించినట్లుగా పేర్కొంది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయొద్దని విజ్ఞప్తి చేసింది. ఇటీవల ఫరీదాబాద్లో పట్టుబడిన వైద్యులు.. ఇదే యూనివర్సిటీలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: భూటాన్లో ‘కాలచక్ర అభిషేక’ను ప్రారంభించిన మోడీ
సోమవారం (10-11-2025) సాయంత్రం 6:50 గంటల ప్రాంతంలో ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్-1 సమీపంలో కారు బ్లాస్టింగ్ జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 12 మంది చనిపోగా.. పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు తీవ్రంగా విచారణ జరుపుతున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
-
Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!