ఢిల్లీ కారు బాంబ్ పేలుడు తర్వాత హర్యానాలోని ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ పేరు మార్మోగుతోంది. ఢిల్లీ బ్లాస్ట్లో పాల్గొన్న అనుమానిత వైద్యులు అల్ ఫలాహ్లోనే పని చేస్తున్నారు. పట్టుబడ్డ వైద్యులు.. యూనివర్సిటీలో కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీపై అనేక కథనాలు వెలువడుతున్నాయి.