Akhilesh: అఖిలేష్ యాదవ్ బిగ్ ప్లాన్.. యూపీ ఎన్నికల కోసం ఐ-ప్యాక్తో డీల్
- ఎన్నికల కోసం అఖిలేష్ యాదవ్ బిగ్ ప్లాన్
- ఐ-ప్యాక్తో డీల్ కుదుర్చుకున్న అఖిలేష్ యాదవ్
- వచ్చే ఏడాదే యూపీ ఎన్నికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలో దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో కీలక ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల తర్వాత దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో 2027 ప్రారంభంలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు ఇప్పటికే ఎత్తులు.. పైఎత్తులు వేస్తున్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు యోగి ప్రభుత్వం నడుస్తోంది. ఈ సారైనా అధికారం చేజిక్కించుకోవాలని అఖిలేష్ యాదవ్, మాయావతి ప్రణాళికలు రచిస్తున్నారు.
ఈ క్రమంలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ బారీ స్కెచ్ వేశారు. ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సూచన మేరకు ఐ-ప్యాక్తో అఖిలేష్ యాదవ్ ఒప్పందం కుదుర్చుకున్నారు.
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
పార్టీ ప్రచారాన్ని జిల్లా, బూత్ స్థాయిలో తీసుకెళ్లేందుకు ఐ-ప్యాక్ను నియమించుకున్నట్లుగా అఖిలేష్ యాదవ్ తెలిపారు. ఐ-ప్యాక్ను నియమించుకోవాలని స్టాలిన్, మమతా బెనర్జీ సలహా ఇచ్చారని చెప్పారు. ఇక ఐ-ప్యాక్ సూచన మేరకు మార్చి 28న ఎన్నికల సమర శంఖారావం పూరించాలని నిర్ణయం తీసుకున్నారు. నోయిడా ర్యాలీతో అఖిలేష్ యాదవ్ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజలను కలవనున్నారు.
ఇది కూడా చదవండి: Bihar: బీహార్లో దారుణం.. వరుడి ముందే వధువును గన్తో కాల్చిన ప్రియుడు
ఐ-ప్యాక్… ప్రముఖ రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ. ఈ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడు కిరోన్మోయ్ నందా వెల్లడించారు. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (I-PAC) ను ప్రశాంత్ కిషోర్ స్థాపించారు. ప్రస్తుతం దీనికి ప్రతీక్ జైన్ నాయకత్వం వహిస్తున్నారు. కీలక వ్యూహకర్తగా.. నాయకుడిగా పనిచేస్తున్నారు. ఇక 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ 111 సీట్లు గెలుచుకుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ 37 సీట్లు గెలుచుకుంది.
ఇది కూడా చదవండి: UP: ఘజియాబాద్ పాఠశాలలో చిరుత హల్చల్.. విద్యార్థులు బెంబేలు.. వీడియో వైరల్
తాజావార్తలు
-
Loan Apps: అప్పు తీర్చడానికి మరో 10 అప్పులు.. లోన్ యాప్స్ ఊబిలో చిక్కుకుంటున్న కోట్లాది కుటుంబాలు!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
-
King 100: నాగ్100పై సస్పెన్స్కు తెర.. ఆగస్టు 29న ఫస్ట్ లుక్, స్పెషల్ గ్లింప్స్!
-
Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!