Akhilesh Yadav: సీఎం యోగి ఒక ‘‘చొరబాటుదారుడు’’.. అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు..
- సీఎం యోగి ఒక చొరబాటుదారుడు..
- అఖిలేష్ యాదవ్ సంచనల వ్యాఖ్యలు..
Akhilesh Yadav: సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) నేత అఖిలేష్ యాదవ్ ఆదివారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం యోగి ఓ ‘‘చొరబాటుదారుడు’’ అంటూ మండిపడ్డారు. ఆయన ఉత్తరాఖండ్ నుంచి, ఉత్తర్ ప్రదేశ్లోకి వచ్చాడని, ఆయన సొంత రాష్ట్రానికి తిరిగి పంపించాలని అన్నారు. రామ్ మనోహర్ లోహియా వర్ధంతి సందర్భంగా ఆదివారం లక్నోలోని లోహియా పార్క్లో విలేకరులతో మాట్లాడుతూ, బీజేపీ వద్ద నకిలీ లెక్కలు ఉన్నాయని, వాటిని నమ్మితే, తప్పిపోతారని అన్నారు.
‘‘వసలపై గణాంకాలు ఇస్తున్న వ్యక్తులు.. మాకు యూపీలో కూడా చొరబాటుదారులు ఉన్నారు. ముఖ్యమంత్రి ఉత్తరాఖండ్కు చెందినవారు. మేము అడిని ఉత్తరాఖండ్ పంపాలనుకుంటున్నాము. ఆయన చొరబాటుదారుడు మాత్రమే కాకుండా, సైద్ధాంతిక కోణం నుంచి కూడా చొరబాటుదారుడే’’ అని అఖిలేష్ అన్నారు. ఆయన బీజేపీ సభ్యుడు కాదని, మరొక పార్టీ సభ్యుడు అని, ఈ చొరబాటుదారుడిని ఎప్పుడు తొలగిస్తారు..? అని ప్రశ్నించారు.
Also Read
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
- Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
Read Also: Bihar Elections: ఎన్డీయే కూటమిలో తేలిన సీట్ల లెక్కలు.. ఎవరికి ఎన్ని సీట్లు అంటే..
కొన్ని రాజకీయ పార్టీలు చొరబాటుదారుల్ని ఓటు బ్యాంకుగా పరిగణిస్తున్నాయని, గుజారత్, రాజస్థాన్ సరిహద్దుల్లో చొరబాటు ఎందుకు జరగట్లేదు అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశ్నించిన కొన్ని రోజుల తర్వాత అఖిలేష్ యాదవ్ నుంచి ఈ వ్యాఖ్యలు చేశారు. అఖిలేష్ ఇటీవల రాయ్బరేలీలో జరిగిన మూకదాడి గురించి మాట్లాడుతూ..క్రైమ్ డేటాను పరిశీలిస్తే యోగి ప్రభుత్వ హయాంలోనే దళితులపై గరిష్ట దాడులు జరిగాయని స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. ఇటీవల వాల్మీకి వర్గానికి చెందిన యువకుడిని చంపారని, దళితులు, వెనకబడిన వర్గాలపై పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతోందని చెప్పారు. హర్యానాలో ఇటీవల ఐపీఎస్ అధికారి పురాణ్ కుమార్ ఆత్మహత్యను ప్రస్తావిస్తూ.. నేటికి కులం ఆధారంగా వివక్ష ఉందని, ఒక ఐపీఎస్ అధికారి ప్రాణాలు కోల్పోయారని, సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిపై బూట్లు విసిరారని అన్నారు.
తాజావార్తలు
-
Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి ‘ఫస్ట్’కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!