Sunetra Pawar: రూ. 25,000 కోట్ల బ్యాంకు కుంభకోణంలో అజిత్ పవార్ భార్యకు క్లీన్ చిట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunetra Pawar: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్కి రూ. 25,000 కోట్ల కుంభకోణంలో ముంబై పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. ప్రస్తుతం సునేత్ర పవార్ బారామతి స్థానం నుంచి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేపై పోటీ చేస్తున్నారు. మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ (MSCB) కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) జనవరిలో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టులో ఎలాంటి క్రిమినల్ నేరం జరగలేదని పేర్కొంది.
ఈ కుంభకోణంలో అజిత్ పవార్ ఆయన భార్య సునేత్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముంబై పోలీసుల నిర్ణయంపై ప్రతిపక్ష శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) స్పందించింది, ఈ నిర్ణయాన్ని ఖండించింది. ‘‘ప్రధాని మోడీ గతంలో పవార్ల కుటుంబం అవినీతి కుటుంబం అని ఆరోపించారు. కానీ, ఈ రోజు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఆర్థిక నేరాల విభాగం ఎలాంటి నేరం లేదని ముగింపు నివేదికలో పేర్కొంది’’ అని శివసేన(ఉద్ధవ్) నేత ఆనంద్ దూబే అన్నారు.
Also Read
- Modi-Trump: మోడీ మంచి మిత్రుడు.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు.. ట్రంప్ ప్రశంసల వర్షం
- Ilhan Omar: జాతి నిర్మూలనలో 8వ దశకు చేరింది.. భారత్పై అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు సంచలన వ్యాఖ్యలు
- Supreme Court: ‘సైబర్ నేరగాళ్లు పరాన్నజీవులు’’.. నిందితులు జైల్లో ఉండడమే ఉత్తమమన్న సూర్యకాంత్
- Fraud: షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. లాభాలు చూపిస్తామంటూ బురిడీ..
Read Also: Asaduddin Owaisi: అల్లర్లు చెలరేగితే మీదే బాధ్యత.. ముస్లింలపై ప్రధాని వ్యాఖ్యలపై ఓవైసీ ఫైర్..
గతేడాది ఎన్సీపీలో అజిత్ పవార్ చీలిక తీసుకువచ్చారు. మెజారిటీ ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వైపు ఉండటంతో నిజమైన ఎన్సీపీ అతడిదే అని ఎన్నికల సంఘం చెప్పింది. దీంతో శరద్ పవార్కి షాక్ తగిలింది. ప్రస్తుతం బీజేపీ-శివసేన(షిండే) ప్రభుత్వంలో అజిత్ పవార్ కూటమి భాగంగా ఉంది. మరోవైపు శరద్ పవార్ కాంగ్రెస్ పక్షంతో ఇండియా కూటమిలో భాగంగా ఉన్నారు. ఎన్సీపీకి కంచుకోటగా ఉన్న బారామతిలో శరద్ పవార్ కుమార్తె, సిట్టింగ్ ఎంపీ సుప్రియా సూలేపై సునేత్ర పోటీ చేస్తోంది. దీంతో ఈ స్థానం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉంటే బీజేపీ ‘వాషింగ్ మెషన్’ విమర్శలను ప్రతిపక్షాలు మరోసారి లేవనెత్తాయి. బీజేపీ తన వ్యతిరేకులపై ఈడీ, సీబీఐ, ఐటీలను ప్రయోగిస్తోందని, వారు బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత విచారణ నెమ్మదించడం లేదా క్లీన్ చిట్ ఇస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీజేపీ వాషింగ్ మెషన్ అంటూ పిలుస్తున్నారు.
తాజావార్తలు
-
Rohit Sharma: సచిన్, కోహ్లీ సరసన రోహిత్ శర్మ.. 14 వేల క్లబ్లోకి చేరిన ఐదో భారతీయుడు..
-
Modi-Trump: మోడీ మంచి మిత్రుడు.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు.. ట్రంప్ ప్రశంసల వర్షం
-
AP Doctors: విధులకు గైర్హాజరైన 43 మoది డాక్టర్ల డిస్మిస్.. మరో 34 మంది రాజీనామా..
-
Ragi Pindi Upma: డయాబెటిస్, వెయిట్ లాస్ కోసం బెస్ట్ బ్రేక్ఫాస్ట్.. రాగి ఉప్మాను సింపుల్గా ఇలా చేసుకోండి!
-
Ragi Barfi : ఈ ఒక్క స్వీట్ తింటే ఎముకలకు కొండంత బలం.. నోరూరించే రాగి బర్ఫీ సీక్రెట్ రెసిపీ!
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!