Maharashtra: 15న మాంసం అమ్మకాలపై నిషేధం.. తప్పుపట్టిన అజిత్ పవార్
- మహారాష్ట్రలో 15న మాంసం అమ్మకాలపై నిషేధం
- తప్పుపట్టిన ఉప ముఖ్యమంత్రిఅజిత్ పవార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాంసం అమ్మకాల నిషేధంపై మహారాష్ట్రలో దుమారం చెలరేగుతోంది. ఆగస్టు 15న గోకులాష్టమి సందర్భంగా.. ఆగస్టు 20న జైన పండుగ పర్యుషణ్ పర్వ సందర్భంగా కబేళాలు, మాంసం దుకాణాలు మూసేయాలని ఛత్రపతి శంభాజీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున కబేళాలు, మాంసం దుకాణాలను మూసివేయాలని మున్సిపల్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే కళ్యాణ్ డోంబివ్లి మున్సిపల్ కార్పొరేషన్, మాలేగావ్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఆగస్టు 15న మాంసం అమ్మకాలు చేయొద్దని ఉత్తర్వులు జారీ చేశాయి.
ఇది కూడా చదవండి: Bengaluru: స్నేహితుడి భార్యతో ఎఫైర్.. చివరికిలా…!
Also Read
- E20 పెట్రోల్పై కేంద్రం క్లారిటీ.. ఇథనాల్ కలపడం వెనుక అసలు ఉద్దేశం ఇదే.. ఎన్ని లక్షల కోట్లు ఆదా అంటే..?
- Siddaramaiah: మంత్రుల ప్రమాణస్వీరానికి సిద్ధరామయ్య డుమ్మా! మళ్లీ విభేదాలా?
- Madhya Pradesh: ప్రచారంలో నరోత్తమ్ మిశ్రా కన్నీళ్లు.. దతియాలో కాంగ్రెస్ విజయానికి కారణం ఏంటి..?
- Prashant Kishor: బీహారీయులు సామ్రాట్ చౌదరి నాయకత్వాన్ని తిరస్కరించారు.. గెలుపు తర్వాత ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
అయితే ఈ నిర్ణయాన్ని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తప్పుపట్టారు. ఈ నిర్ణయం సరైంది కాదన్నారు. ఆషాఢ ఏకాదశి, మహాశివరాత్రి, మహావీర్ జయంతి వంటి మతపరమైన పండుగల సమయంలో నిషేధం విధిస్తుంటారు. అలాంటి సమయంలో ఆంక్షలు అంగీకరిస్తామని.. కానీ మహారాష్ట్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల సమయాల్లో కూడా అలాంటి ఆదేశాలను అమలు చేయడం బాగోలేదన్నారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: టారిఫ్ ఉద్రిక్తతల వేళ అమెరికాకు మోడీ.. ఎప్పుడంటే..!
ఈ నిర్ణయాన్ని శివసేన (యూబీటీ) నాయకుడు ఆదిత్య థాకరే కూడా తప్పుపట్టారు. ప్రజలు తినే ఆహారంపై నిషేధం విధించే హక్కు కమిషనర్కు లేదన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఏమి తినాలో.. ఏమి తినకూడదో మీరు నిర్ణయిస్తారా? అంటూ ప్రశ్నించారు. కచ్చితంగా అదే రోజు తాము మాంసాహారం తింటామని చెప్పారు. ఆహారంపై దృష్టి పెట్టే కమిషనర్.. రోడ్ల గుంతలపై దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికారు.
ఎన్సీపీ (ఎస్పీ) నాయకుడు జితేంద్ర అవ్హాద్ కూడా తప్పుపట్టారు. మాంసం అమ్మకాలపై నిషేధం విధించడం ఇదేమీ పద్ధతి అని నిలదీశారు. ఆగస్టు 15న మాంసాహారం తింటామని ప్రకటించారు.
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ DSC పోరాటం.. కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్..!!
-
Hyderabad Rains : హైదరాబాద్ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
-
Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
-
Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి
-
Off The Record: ఆక్వా రైతుల తిరుగుబాటు.. కూటమికి భారీ షాక్..!!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!