Bengaluru: స్నేహితుడి భార్యతో ఎఫైర్.. చివరికిలా…!
- బెంగళూరులో దారుణం
- స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం
- అడ్డుగా ఉన్నాడని ఘాతుకం
దేశంలో రోజురోజుకు మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. భార్యాభర్తల మధ్య.. అన్నాదమ్ముల మధ్య.. తల్లిదండ్రులు.. పిల్లల మధ్య బంధాలు ఘోరంగా దెబ్బతింటున్నాయి. కుటుంబాల్లో మునుపటి అనురాగాలు నేడు కనుమరుగైపోతున్నాయి. కుటుంబ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తం అవుతోంది. దీంతో బంధాలు మరిచి.. రక్తసంబంధికులే కనికరం లేకుండా కడతేర్చేస్తున్నారు. ఇలాంటి నేరాలు-ఘోరాలు దేశంలో ఎక్కడో చోట జరుగుతూనే ఉంటున్నాయి. తాజాగా పడక సుఖం కోసం కట్టుకున్న భర్తనే ఓ ఇల్లాలు ప్రియుడితో కలిసి చంపేసింది. ఈ దారుణ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: PM Modi: టారిఫ్ ఉద్రిక్తతల వేళ అమెరికాకు మోడీ.. ఎప్పుడంటే..!
Also Read
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
విజయ్ కుమార్, ధనంజయ ఇద్దరూ బాల్య స్నేహితులు. బెంగళూరులోని మాగడి ప్రాంతంలో కలిసి పెరిగారు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా స్నేహం ఉంది. అయితే విజయ్ కుమార్(39) రియల్ ఎస్టేల్, ఫైనాన్స్ లావాదేవీలు ఉన్నాయి. విజయ్ పదేళ్ల క్రితం ఆశా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. అనంతరం కామాక్షిపాల్యలో కాపురం పెట్టారు. అయితే ఈ మధ్య స్నేహితుడు ధనంజయతో ఆశా ఏకాంతంగా ఉన్నప్పుడు విజయ్ చూసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నాడు. అంతేకాకుండా వారిద్దరికి సంబంధించిన ఫొటోలు కూడా కనిపించాయి. దీంతో స్నేహితుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో భార్య ఆశాను తీసుకుని కడబగెరె ప్రాంతంలోని మాచోహళ్లిలో అద్దె ఇంటికి మారారు. అయినా కూడా ధనంజయ-ఆశాలో ఏ మాత్రం మార్పు కనిపించలేదు. స్థలం మారినా.. ఇద్దరూ కూడా సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో తమ సుఖానికి విజయ్ అడ్డొస్తున్నాడని చంపేయాలని ఇద్దరూ కుట్ర పన్నారు.
ఇది కూడా చదవండి: AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు, రేపు ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
ఇందులో భాగంగా మాచోహల్లిలోని డీగ్రూప్ లేఅవుట్ దగ్గర విజయ్ శవమై కనిపించాడు. పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా హత్యగా భావించి దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఆశా-ధనంజయ అక్రమ సంబంధం బయటపడింది. ఇద్దరూ కలిసి విజయ్ను చంపేసినట్లుగా పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆశా పోలీసుల అదుపులో ఉండగా.. ధనంజయ పరారీలో ఉన్నాడు. వివాహేతర సంబంధానికి విజయ్ అడ్డుగా ఉన్నాడనే చంపేసినట్లుగా పోలీసులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?