Maharashtra: 15న మాంసం అమ్మకాలపై నిషేధం.. తప్పుపట్టిన అజిత్ పవార్
- మహారాష్ట్రలో 15న మాంసం అమ్మకాలపై నిషేధం
- తప్పుపట్టిన ఉప ముఖ్యమంత్రిఅజిత్ పవార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాంసం అమ్మకాల నిషేధంపై మహారాష్ట్రలో దుమారం చెలరేగుతోంది. ఆగస్టు 15న గోకులాష్టమి సందర్భంగా.. ఆగస్టు 20న జైన పండుగ పర్యుషణ్ పర్వ సందర్భంగా కబేళాలు, మాంసం దుకాణాలు మూసేయాలని ఛత్రపతి శంభాజీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున కబేళాలు, మాంసం దుకాణాలను మూసివేయాలని మున్సిపల్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే కళ్యాణ్ డోంబివ్లి మున్సిపల్ కార్పొరేషన్, మాలేగావ్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఆగస్టు 15న మాంసం అమ్మకాలు చేయొద్దని ఉత్తర్వులు జారీ చేశాయి.
ఇది కూడా చదవండి: Bengaluru: స్నేహితుడి భార్యతో ఎఫైర్.. చివరికిలా…!
Also Read
- Tamil Nadu Assembly: బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి భారీ మద్దతు..!
- TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
- Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
అయితే ఈ నిర్ణయాన్ని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తప్పుపట్టారు. ఈ నిర్ణయం సరైంది కాదన్నారు. ఆషాఢ ఏకాదశి, మహాశివరాత్రి, మహావీర్ జయంతి వంటి మతపరమైన పండుగల సమయంలో నిషేధం విధిస్తుంటారు. అలాంటి సమయంలో ఆంక్షలు అంగీకరిస్తామని.. కానీ మహారాష్ట్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల సమయాల్లో కూడా అలాంటి ఆదేశాలను అమలు చేయడం బాగోలేదన్నారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: టారిఫ్ ఉద్రిక్తతల వేళ అమెరికాకు మోడీ.. ఎప్పుడంటే..!
ఈ నిర్ణయాన్ని శివసేన (యూబీటీ) నాయకుడు ఆదిత్య థాకరే కూడా తప్పుపట్టారు. ప్రజలు తినే ఆహారంపై నిషేధం విధించే హక్కు కమిషనర్కు లేదన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఏమి తినాలో.. ఏమి తినకూడదో మీరు నిర్ణయిస్తారా? అంటూ ప్రశ్నించారు. కచ్చితంగా అదే రోజు తాము మాంసాహారం తింటామని చెప్పారు. ఆహారంపై దృష్టి పెట్టే కమిషనర్.. రోడ్ల గుంతలపై దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికారు.
ఎన్సీపీ (ఎస్పీ) నాయకుడు జితేంద్ర అవ్హాద్ కూడా తప్పుపట్టారు. మాంసం అమ్మకాలపై నిషేధం విధించడం ఇదేమీ పద్ధతి అని నిలదీశారు. ఆగస్టు 15న మాంసాహారం తింటామని ప్రకటించారు.
తాజావార్తలు
-
Peddi: సాలిడ్ మార్క్ క్రాస్ చేసి.. US మార్కెట్లో దుమ్మురేపుతున్న ‘పెద్ది’ .. !
-
Tamil Nadu Assembly: బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి భారీ మద్దతు..!
-
Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
-
బీచ్ లో స్థానిక ఆటగాళ్లతో కలిసి క్రికెట్ ఆడిన Sanju Samson.. వీడియో వైరల్
-
Bunny Vas: భారీ కలెక్షన్ల వెనుక అసలు నిజం బయటపెట్టిన బన్నీ వాస్!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!