Ajit Doval: అరుణాచల్లో ఉద్రిక్తతల వేళ చైనాకు అజిత్ దోవల్..
- సోమవారం చైనాకు వెళ్లనున్న NSA అజిత్ దోవల్.
- చైనా ప్రత్యేక ప్రతినిధి వాంగ్ యీతో 25వ విడత చర్చలు.
- భారత్-చైనా సరిహద్దు వివాదమే ప్రధాన అజెండా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajit Doval: జాతీయ భద్రతా సలహాదారు(NSA) అజిత్ దోవల్ సోమవారం చైనాలో పర్యటించనున్నారు. భారత్-చైనా సరిహద్దు నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భేటీ కానున్నారు. ఇద్దరు నేతలు భారత్-చైనా సరిహద్దు వివాదంపై 25వ విడత చర్చల్లో పాల్గొననున్నారు. దోవల్, వాంగ్ యీలు మంగళవారం చర్చలు జరపనున్నారు. దాదాపు 2,488 కిలోమీటర్ల పొడవైన భారత్-చైనా సరిహద్దు వివాదానికి పరిష్కారం కనుగొనే లక్ష్యంతో ఈ ప్రత్యేక ప్రతినిధుల చర్చల ప్రక్రియను 2003లో ప్రారంభించారు. ఇరు దేశాలకు చెందిన ప్రత్యేక ప్రతినిధులు కూడా ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. సరిహద్దు సమస్యతో పాటు భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి అనేక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
సెప్టెంబర్ నెలలో బ్రిక్స్ సదస్సు న్యూఢిల్లీలో జరగబోతోంది. ఈ సమావేశానికి ముందు భారత్, చైనాల మధ్య ఈ హైలెవల్ మీటింగ్ జరుగుతోంది. బ్రిక్స్ సమ్మిట్కు చైనా అధ్యక్షుడు సీ జిన్పింగ్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా అధికారిక ప్రకటన వెలువడకున్నా, షీ జిన్పింగ్ భారత్కు వస్తే ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లే అంశాలపై ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. చివరిసారిగా మోడీ, జిన్పింగ్లు గతేడాది ఆగస్టులో టియాంజిన్లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు సందర్భంగా చివరిసారిగా సమావేశమయ్యారు.
Also Read
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
- Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్కు త్రిషా కృష్ణన్.. విజయ్తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్లో చర్చ
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
ఈ నేపథ్యంలోనే దోవల్ చైనా పర్యటనకు చాలా ప్రాధాన్యం ఏర్పడింది. ఈ భేటికి ముందు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాతో సత్సంబంధాలు కొనసాగాలంటే సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వం అత్యంత అవసరమని చెప్పారు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లోని అప్పర్ సుబన్గిరి ప్రాంతంలోకి చైనా సైనికులు దురాక్రమణకు పాల్పడ్డారనే నివేదిక నేపథ్యంలో జైశంకర్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
తాజావార్తలు
-
Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!