Air India Incident: మహిళపై మూత్రవిసర్జన చేసిన వ్యక్తి.. ఉద్యోగం నుంచి తొలగించిన కంపెనీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India Incident: ఎయిర్ ఇండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిపై శంకర్ మిశ్రా అనే వ్యక్తి మూత్రవిసర్జన చేసిన ఘటన విమానయాన రంగంలో ప్రకంపనలు రేపుతోంది. నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానంలో శంకర్ మిశ్రా తన తోటి ప్రయాణికురాలు సీనియర్ సిటిజన్ అయిన మహిళపై మూత్ర విసర్జన చేశాడు. మద్యంమత్తులో ఇలాంటి అసభ్యకరంగా ప్రవర్తించాడు. అయితే ఆ సమయంలో ఎయిర్ ఇండియా క్యాబిన్ క్రూ మెంబర్లు కూడా చూసీచూడనట్లు వ్యవహరించారు. ఈ ఘటనపై మహిళ ఎయిర్ ఇండియా సిబ్బందికి తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) విచారణ జరుపుతోంది. దీంతో పాటు ఢిల్లీ పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలో జాతీయ మహిళా కమిషన్ కూడా ఇన్వాల్వ్ అయింది.
Read Also: CBI: ఎమ్మెల్యేల ఎర కేసు.. సీబీఐ ఢిల్లీ విభాగానికి అప్పగింత..
Also Read
- Bhojshala case: "భోజ్శాల ఒక దేవాలయం".. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
- Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
- PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
- Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
ఇదిలా ఉంటే శంకర్ మిశ్రా పనిచేస్తున్న వెల్స్ ఫార్గో అనే కంపెనీ అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. దీనికి సంబంధించి ఓ ప్రకటనను కూడా జారీ చేసింది. వెల్స్ ఫార్గో సంస్థ వృత్తిపరమైన, వ్యక్తిగతమైన అత్యున్నత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందని.. తమ కంపెనీ ఉద్యోగిపై వచ్చిన ఆరోపణ తీవ్రత కారణంగా అతడిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించింది. ఏదైనా అదనపు విచారణకు సిద్ధంగా ఉన్నామని కంపెనీ వెల్లడించింది. కాలిఫోర్నియా ప్రధాన కార్యాలయంగా వెల్ ఫార్గో సంస్థ పనిచేస్తుంది. శంకర్ మిశ్రా ఇండియా చాప్టర్కు వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు.
ప్రస్తుతం శంకర్ మిశ్రా కోసం ఢిల్లీ పోలీసులు లుక్ అవుట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేశారు. ముంబైలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి డీజీసీఏ, ఎయిర్ ఇండియా టాటా గ్రూపుకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనలో సిబ్బంది ‘అన్ప్రొఫెషనల్’ గా వ్యవహరించారని పేర్కొంది.
తాజావార్తలు
-
Bhojshala case: “భోజ్శాల ఒక దేవాలయం”.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
-
Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
-
Film Chamber Meeting : ‘పెద్ది’ సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!