Air India Express: ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ కు తప్పిన ప్రమాదం .. మస్కట్ లో ల్యాండింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India Express flight emergency landing in muscat: ఇండిగో ఫ్లైట్ కరాచీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ విషయాన్ని మరవకు ముందే మరో ఘటన చోటు చేసుకుంది. ఆదివారం ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానం కాలికట్ నుంచి దుబాయ్ కు వెళ్తున్న సయయంలో మార్గం మధ్యలో ఒమన్ రాజధాని మస్కట్ కు మళ్లించారు. బోయింగ్ 737(వీటీ-ఏఎక్స్ఎక్స్) ఐఎక్స్ -355 విమానం కాలికట్ నుంచి దుబాయ్ కు వెళ్తున్న క్రమంలో విమానంలో కాలిన వాసన వచ్చింది. దీంతో ముందుజాగ్రత్తగా పైలెట్లు విమానాన్ని మస్కట్ లో ల్యాండ్ చేశారు. ఫార్వర్డ్ గాలీలోని వెంట్లలో ఒక దాని నుంచి కాలిన వాసన వచ్చిందని దీంతో సమీపంలో ఉన్న మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేసినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది.
అంతకు ముందు షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పాకిస్తాన్ కరాచీ జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. ఇండిగో పైలెట్లు విమానంలోని ఒక ఇంజిన్ లో సాంకేతిక లోపం గుర్తించడంతో విమానాన్ని కరాచీకి మళ్లించారు. ప్రయాణికులను హైదరాబాద్ తరలించేందుకు మరో విమానం కరాచీ వెళ్లింది. ఈ రెండు ఘటనలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణ జరుపుతోంది.
Also Read
- Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
- Ketan Agarwal case: కేతన్ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
- Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
Read Also: IndiGo: ఇండిగో ఫ్లైట్ సాంకేతిక లోపం.. కరాచీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఇటీవల కాలంలో ఇండియాకు చెందిన పలు అంతర్జాతీయ, దేశీయ విమానాల్లో సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయి. జూన్ 5న ఢిల్లీ నుంచి దుబాయ్ కి వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో ఇండికేటర్ లైట్ పనిచేయకపోవడంతో ఇదే కరాచీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండిగ్ చేశారు. ఇటీవల రెండు రోజుల ముందు ఇండిగోకు చెందిన విమానం ఢిల్లీ నుంచి వడోదర వెళ్తున్న క్రమంలో కొన్ని సెకన్ల పాటు కంపించడంతో జైపూర్ విమానాశ్రమంలో ల్యాండ్ చేశారు.
ఇదిలా ఉంటూ జూలై 16న పలు అంతర్జాతీయ విమాన సంస్థలకు చెందిన విమానాలు ఇండియాలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యాయి. ఇథియోపియా అడిస్ అబాబా నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ విమానంలో క్యాబిన్ ప్రెజర్ సమస్యలు రావడంతో కోల్ కతా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారని… శ్రీలంక ఎయిర్ లైన్స్ విమానంలో హైడ్రాలిక్స్ సమస్య రావడంతో చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు డీజీసీఏ వెల్లడించింది.
తాజావార్తలు
-
Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
-
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్లోకి స్వాగతం
-
Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
-
Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!