Air India Express: ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ కు తప్పిన ప్రమాదం .. మస్కట్ లో ల్యాండింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India Express flight emergency landing in muscat: ఇండిగో ఫ్లైట్ కరాచీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ విషయాన్ని మరవకు ముందే మరో ఘటన చోటు చేసుకుంది. ఆదివారం ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానం కాలికట్ నుంచి దుబాయ్ కు వెళ్తున్న సయయంలో మార్గం మధ్యలో ఒమన్ రాజధాని మస్కట్ కు మళ్లించారు. బోయింగ్ 737(వీటీ-ఏఎక్స్ఎక్స్) ఐఎక్స్ -355 విమానం కాలికట్ నుంచి దుబాయ్ కు వెళ్తున్న క్రమంలో విమానంలో కాలిన వాసన వచ్చింది. దీంతో ముందుజాగ్రత్తగా పైలెట్లు విమానాన్ని మస్కట్ లో ల్యాండ్ చేశారు. ఫార్వర్డ్ గాలీలోని వెంట్లలో ఒక దాని నుంచి కాలిన వాసన వచ్చిందని దీంతో సమీపంలో ఉన్న మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేసినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది.
అంతకు ముందు షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పాకిస్తాన్ కరాచీ జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. ఇండిగో పైలెట్లు విమానంలోని ఒక ఇంజిన్ లో సాంకేతిక లోపం గుర్తించడంతో విమానాన్ని కరాచీకి మళ్లించారు. ప్రయాణికులను హైదరాబాద్ తరలించేందుకు మరో విమానం కరాచీ వెళ్లింది. ఈ రెండు ఘటనలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణ జరుపుతోంది.
Also Read
- Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
- Amul milk: సామాన్యుడి జేబుకు 'అముల్' చిల్లు.. రేపటి నుంచే పాలకు కొత్త రేట్లు! ఎంత ధర పెరిగాయంటే..
- Keralam: కేరళం సీఎం ఎంపికపై తర్జనభర్జన.. నిర్ణయం రేపటికి వాయిదా
- AIADMK: ముదిరిన అన్నాడీఎంకే సంక్షోభం.. విజయ్కు మద్దతు ఇచ్చిన నేతలపై వేటు..
Read Also: IndiGo: ఇండిగో ఫ్లైట్ సాంకేతిక లోపం.. కరాచీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఇటీవల కాలంలో ఇండియాకు చెందిన పలు అంతర్జాతీయ, దేశీయ విమానాల్లో సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయి. జూన్ 5న ఢిల్లీ నుంచి దుబాయ్ కి వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో ఇండికేటర్ లైట్ పనిచేయకపోవడంతో ఇదే కరాచీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండిగ్ చేశారు. ఇటీవల రెండు రోజుల ముందు ఇండిగోకు చెందిన విమానం ఢిల్లీ నుంచి వడోదర వెళ్తున్న క్రమంలో కొన్ని సెకన్ల పాటు కంపించడంతో జైపూర్ విమానాశ్రమంలో ల్యాండ్ చేశారు.
ఇదిలా ఉంటూ జూలై 16న పలు అంతర్జాతీయ విమాన సంస్థలకు చెందిన విమానాలు ఇండియాలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యాయి. ఇథియోపియా అడిస్ అబాబా నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ విమానంలో క్యాబిన్ ప్రెజర్ సమస్యలు రావడంతో కోల్ కతా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారని… శ్రీలంక ఎయిర్ లైన్స్ విమానంలో హైడ్రాలిక్స్ సమస్య రావడంతో చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు డీజీసీఏ వెల్లడించింది.
తాజావార్తలు
-
IPL 2026: RCB Vs KKR మ్యాచ్కు వర్షం గండం.. మ్యాచ్ రద్దయితే వీరికి పండగే.. RCB పరిస్థితి..?
-
Naga Vamsi: డిస్ట్రిబ్యూటర్లను చంపి ఎగ్జిబిటర్లను కాపాడటం సాధ్యమా?:
-
Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
-
CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Amul milk: సామాన్యుడి జేబుకు ‘అముల్’ చిల్లు.. రేపటి నుంచే పాలకు కొత్త రేట్లు! ఎంత ధర పెరిగాయంటే..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!