BJP: బీజేపీ టార్గెట్ 400.. ప్రతిపక్ష ఎంపీలను చేర్చుకునేందుకు ప్యానెల్ ఏర్పాటు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: బీజేపీ టార్గెట్ 400.. ప్రతిపక్ష ఎంపీలను చేర్చుకునేందుకు ప్యానెల్ ఏర్పాటు.. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలని వ్యూహాలు రచిస్తుంటే.. ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రధాని మోడీని అధికారంలోకి దించాలని భావిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సారి బీజేపీ 543 లోక్సభ స్థానాల్లో ఏకంగా 400 ఎంపీ స్థానాలను గెలవాలని టార్గెట్గా పెట్టుకుంది. దానిని సాధించేందుకు ఇతర పార్టీల ఎంపీలను బీజేపీలోకి ఆహ్వానించేందుకు పార్టీ వ్యూహాలను రూపొందిస్తున్నట్లు సమాచారం.
మంగళవారం జరిగిన బీజేపీ ముఖ్య సమావేశంలో, పార్టీ చీఫ్ జేపీ నడ్డా పార్టీ కార్యదర్శులకు వేర్వేరు బాధ్యతల్ని అప్పగించారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేకి ‘జాయినింగ్ కమిటీ’ బాధ్యతలను అప్పగించారు. ఈ పార్టీ ఇతర పార్టీల్లో ఉండే ప్రతిభావంతులైన నాయకులను, ఇతర సిట్టింగ్ ఎంపీలను బీజేపీలోకి తీసుకురావాలని చూస్తోంది. నియోజకవర్గంలో సదరు నేత ప్రభావం, ఎన్నికల్లో గెలిచే సామర్థ్యం ఆధారంగా కమిటీ నిర్ణయం తీసుకోనుంది. గత ఎన్నికల్లో కోల్పోయిన 160 సీట్లపై బీజేపీ దృష్టి పెట్టిన నేపథ్యంలో తాజా నిర్ణయం ముడిపడి ఉంది.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
Read Also: Karnataka: కర్ణాటక అసెంబ్లీ ముందు 8 మంది కుటుంబ సభ్యుల ఆత్మహత్యాయత్నం.. కారణం ఏంటంటే..?
1984లో చివరిసారిగా రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ 400కి మించి ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. అయితే గత రెండు పర్యాయాలుగా బీజేపీ సొంతబలంలో, మ్యాజిక్ ఫిగర్ దాటి ఎంపీ స్థానాలను సాధించినప్పటికీ.. 400ల మార్క్కి దూరంగానే ఉంది.
ఇదిలా ఉంటే 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్ను రూపొందించే బాధ్యతను పార్టీ ప్రధాన కార్యదర్శి రాధామోహన్ దాస్ అగర్వాల్కు అప్పగించారు. ఎన్నికల ప్రచారం, ప్రచారం మరియు ఇతర సంబంధిత పనులను సునీల్ బన్సాల్, ఇతర కార్యదర్శులు చూసుకుంటారు. ఈ సమావేశంలో బీజేపీ చీఫ్ నడ్డా పార్టీ ప్రధాన కార్యదర్శులు, కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, అశ్విని వైష్ణవ్, మన్సుఖ్ మాండవ్యలతో సమావేశమయ్యారు. అస్సాం సీఎం హిమంత బిశ్వసర్మ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!