BJP: బీజేపీ టార్గెట్ 400.. ప్రతిపక్ష ఎంపీలను చేర్చుకునేందుకు ప్యానెల్ ఏర్పాటు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: బీజేపీ టార్గెట్ 400.. ప్రతిపక్ష ఎంపీలను చేర్చుకునేందుకు ప్యానెల్ ఏర్పాటు.. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలని వ్యూహాలు రచిస్తుంటే.. ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రధాని మోడీని అధికారంలోకి దించాలని భావిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సారి బీజేపీ 543 లోక్సభ స్థానాల్లో ఏకంగా 400 ఎంపీ స్థానాలను గెలవాలని టార్గెట్గా పెట్టుకుంది. దానిని సాధించేందుకు ఇతర పార్టీల ఎంపీలను బీజేపీలోకి ఆహ్వానించేందుకు పార్టీ వ్యూహాలను రూపొందిస్తున్నట్లు సమాచారం.
మంగళవారం జరిగిన బీజేపీ ముఖ్య సమావేశంలో, పార్టీ చీఫ్ జేపీ నడ్డా పార్టీ కార్యదర్శులకు వేర్వేరు బాధ్యతల్ని అప్పగించారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేకి ‘జాయినింగ్ కమిటీ’ బాధ్యతలను అప్పగించారు. ఈ పార్టీ ఇతర పార్టీల్లో ఉండే ప్రతిభావంతులైన నాయకులను, ఇతర సిట్టింగ్ ఎంపీలను బీజేపీలోకి తీసుకురావాలని చూస్తోంది. నియోజకవర్గంలో సదరు నేత ప్రభావం, ఎన్నికల్లో గెలిచే సామర్థ్యం ఆధారంగా కమిటీ నిర్ణయం తీసుకోనుంది. గత ఎన్నికల్లో కోల్పోయిన 160 సీట్లపై బీజేపీ దృష్టి పెట్టిన నేపథ్యంలో తాజా నిర్ణయం ముడిపడి ఉంది.
Also Read
- Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
- Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
- Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
- INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
Read Also: Karnataka: కర్ణాటక అసెంబ్లీ ముందు 8 మంది కుటుంబ సభ్యుల ఆత్మహత్యాయత్నం.. కారణం ఏంటంటే..?
1984లో చివరిసారిగా రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ 400కి మించి ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. అయితే గత రెండు పర్యాయాలుగా బీజేపీ సొంతబలంలో, మ్యాజిక్ ఫిగర్ దాటి ఎంపీ స్థానాలను సాధించినప్పటికీ.. 400ల మార్క్కి దూరంగానే ఉంది.
ఇదిలా ఉంటే 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్ను రూపొందించే బాధ్యతను పార్టీ ప్రధాన కార్యదర్శి రాధామోహన్ దాస్ అగర్వాల్కు అప్పగించారు. ఎన్నికల ప్రచారం, ప్రచారం మరియు ఇతర సంబంధిత పనులను సునీల్ బన్సాల్, ఇతర కార్యదర్శులు చూసుకుంటారు. ఈ సమావేశంలో బీజేపీ చీఫ్ నడ్డా పార్టీ ప్రధాన కార్యదర్శులు, కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, అశ్విని వైష్ణవ్, మన్సుఖ్ మాండవ్యలతో సమావేశమయ్యారు. అస్సాం సీఎం హిమంత బిశ్వసర్మ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
-
Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!