AI Technology in Tamil Nadu Election Campaign: తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఏఐ టెక్నాలజీ.. ఐడియా భలే ఉందే..
- తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఏఐ టెక్నాలజీ..
- టీవీకే అధినేత విజయ్ పార్టీ అభ్యర్థుల ఏఐ ప్లాన్..
- ‘హోలోగ్రాఫిక్ ఏఐ కమ్యూనికేషన్’ టెక్నాలజీ వినియోగం..
- విజయ్ ప్రత్యక్షంగా అక్కడ ఉన్నట్లే కనిపిస్తూ ఓటర్లతో మాట్లాడుతున్న వీడియోలు వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AI Technology in Tamil Nadu Election Campaign: టెక్నాలజీలో ఎప్పటికప్పుడూ కొత్త మార్పులు వస్తూనే ఉన్నాయి.. ఎన్నికల ప్రచారానికి కాదేది అనర్హం అనే రీతిలో నేతలు టెక్నాలజీని వాడేస్తూ ఔరా..! అనిపిస్తున్నారు.. తమిళనాడు ఎన్నికల రాజకీయం ఇప్పుడు టెక్నాలజీ వైపు మళ్లింది. ప్రచారంలో ఏఐ సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. ముఖ్యంగా తమిళ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ కోసం అభ్యర్థులు వాడుతున్న సాంకేతికత చర్చనీయాంశంగా మారింది. విజయ్ తన సినిమాలతో ఎంత పాపులరో, రాజకీయాల్లోనూ అంతే దూకుడుగా ఉన్నారు. అయితే, సమయాభావం వల్ల ఆయన అన్ని నియోజకవర్గాలకు స్వయంగా వెళ్లడం సాధ్యం కావడం లేదు. దీన్ని అధిగమించేందుకు టీవీకే అభ్యర్థులు ‘హోలోగ్రాఫిక్ ఏఐ కమ్యూనికేషన్’ అనే అత్యాధునిక సాంకేతికతను రంగంలోకి దించారు.
Read Also: Rajnikanth : ‘తలైవర్ 173 నుండి డైరెక్టర్ ఔట్.. రేసులోకి క్రేజీ డైరెక్టర్
Also Read
- TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
- Mohan Bhagwat: ప్రవర్తనతో భారతీయ కుటుంబాలు ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి
- India On Indus Waters: ఎంత మొత్తుకున్నా నీళ్లు ఇయ్యం.. పాక్కు భారత్ స్పష్టీకరణ..
- US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..
ఈ టెక్నాలజీ ద్వారా విజయ్ నేరుగా అక్కడికి వచ్చి ఓటర్లతో మాట్లాడుతున్నట్లే కనిపిస్తుంది. తాజాగా కుంభకోణంలో ఈ పద్ధతిలో నిర్వహించిన ప్రచారం అందరినీ ఆశ్చర్యపరిచింది. స్టేజ్ మీద విజయ్ ప్రత్యక్షంగా ఉన్నట్లు ఉండటంతో జనం భారీగా తరలివస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డిజిటల్ యుగంలో ప్రచార శైలి ఎలా మారుతుందో చెప్పడానికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.. కానీ, అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి.. కాగా, మొత్తం 234 నియోజకవర్గాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీకి ఈ నెల 23వ తేదీన పోలింగ్ జరగనుండగా.. మే 4వ తేదీన ఫలితాలు ప్రకటించనున్నారు..
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!