Rajnikanth : ‘తలైవర్ 173 నుండి డైరెక్టర్ ఔట్.. రేసులోకి క్రేజీ డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో ‘జైలర్ 2’ చిత్రంలో నటిస్తున్న ఆయన తన 173వ సినిమాను కూడా లైన్లో పెట్టారు. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక సంచలన మార్పు చోటు చేసుకున్నట్లు సమాచారం. తొలుత ‘తలైవర్ 173’ చిత్రానికి ‘డాన్’ ఫేమ్ సిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తారని ప్రకటించారు. రజనీకాంత్ కూడా సీబీ చెప్పిన కథకు ఇంప్రెస్ అయ్యారు. కానీ తాజా సమాచారం ప్రకారం సిబి చక్రవర్తి ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఈ సినిమా నుండి బయటకు రావడంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ బాధ్యతలు ఎవరు తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also Read : Akkineni : అక్కినేని ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్.. నాగచైతన్య లైనప్లో ప్రాజెక్టులు!
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
వినిపిస్తున్న సమాచారం ప్రకారం సిబి చక్రవర్తి స్థానంలో ‘ ఓ మై కడవులే ఫేమ్ అశ్వత్ మరిముత్తు పేరు బలంగా వినిపిస్తోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అశ్వత్ మాట్లాడుతూ.. తాను ఇప్పటికే రజనీకాంత్కు ఒక అద్భుతమైన కథను వినిపించానని అది సూపర్ స్టార్కి బాగా నచ్చిందని వెల్లడించారు. అశ్వత్ మేకింగ్ స్టైల్ మరియు ఆయన చెప్పిన కథలోని కొత్తదనం రజనీని ఆకట్టుకోవడంతో ఆయనకే దర్శకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతానికి ఈ మార్పుపై చిత్ర యూనిట్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితేఅశ్వత్ మరిముత్తు మరియు రజనీకాంత్ కాంబినేషన్ దాదాపు ఖరారైనట్లు ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. దీనిపై అతి త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ చిత్రంపై అభిమానుల్లో అప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?