Success Story: ఉద్యోగం పోవడమే వరంగా మారింది.. దీప్ సింగ్ చీమా సక్సెస్ స్టోరీ..
- ఉద్యోగం కోల్పోవడం వరమైంది
- పంజాబ్కు చెందిన మొహబ్బత్ దీప్ సింగ్ చీమా సక్సెస్ స్టోరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Success Story: కరోనా మహమ్మారి కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారు. అలాంటి వారిలో మొహబ్బత్ దీప్ సింగ్ చీమా కూడా ఒకరు. ఉద్యోగం పోవడంతో దీప్ సింగ్ చీమా(36) తన భవిష్యత్తును ప్లాన్ చేసుకోవడానికి తన సొంత రాష్ట్రం పంజాబ్కు తిరిగి వచ్చాడు. ధిల్వాన్లో తన సొంత ఫుడ్ ట్రక్ ‘ది పిజ్జా ఫ్యాక్టరీ’ని స్థాపించడానికి ఇదే మొదటి అడుగు అని కూడా అతనికి తెలియదు. తన ఉద్యోగాన్ని కోల్పోకపోతే మొహబ్బత్ దీప్ సింగ్ చీమా తన సొంత వ్యాపారం ప్రారంభించాలని ఎప్పుడూ ఆలోచించేవాడు కాదు. ఆ విధంగా ఉద్యోగం కోల్పోవడం అతనికి ఒక వరంగా మారింది. అది ఎలాగో తెలుసుకుందాం.
ఉద్యోగం పోయింది.. ఆలోచన పుట్టింది..
దీప్ సింగ్ చీమా పనిచేస్తున్నప్పుడు రూ.2.5 లక్షల జీతం వచ్చేది. ఆ ఆర్థిక భద్రతను హఠాత్తుగా కోల్పోవడంతో అతను ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కరోనా మహమ్మారి చాలా మంది ఉద్యోగాలను కొల్లగొట్టింది. 100 ఎకరాల భూమి ఉన్న ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన దీప్ సింగ్ చీమా వ్యవసాయం వైపు మొగ్గు చూపలేదు. మంచి పిజ్జా, బర్గర్లు అందించడానికి ధిల్వాన్లో ఎవరూ లేరని గ్రహించాడు.
Also Read
- Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
- Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
ఇక్కడ నుంచే దీప్ సింగ్ చీమాకు ఫుడ్ ట్రక్ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. 4 లక్షల తొలి పెట్టుబడితో ‘ది పిజ్జా ఫ్యాక్టరీ’ని ప్రారంభించాడు. జనాలు ముందు అతడిని ఎగతాళి చేసేవారు. ప్రారంభంలో కొన్ని నెలలు తీవ్రంగా శ్రమించాడు. చాలా మంది సమోసాలు, పకోడీలు తినడానికి అలవాటు పడ్డారు. ప్రేక్షకులకు కొత్త ఆహారాన్ని పరిచయం చేయడం కష్టం. కానీ దీప్ సింగ్ చీమా మనసు మార్చుకోలేదు. ప్రజలను ఆకర్షించేందుకు తన మెనూ ధరను రూ.199గా ఉంచాడు. ఈ ధరలో ఎవరైనా ఎన్ని పిజ్జాలు, బర్గర్లు, ఫ్రైస్ అయినా తినొచ్చు. స్కూల్కు వెళ్లే చిన్నతనంలో దీప్కి వంట చేయడం అంటే ఇష్టం, హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకున్నాడు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల అతను మరో దారిని ఎంచుకోవలసి వచ్చింది.
ఇప్పుడు నెలకు రూ.2 లక్షలు
దీప్ కు వంట పట్ల ఉన్న మక్కువ ‘ది పిజ్జా ఫ్యాక్టరీ’తో మళ్లీ పుంజుకుంది. అతను తన వంట పరిజ్ఞానాన్ని చెఫ్ రణ్వీర్ బ్రార్ నుంచి నేర్చుకున్నాడు. ఈరోజు డీప్ ధిల్వాన్లో ఫుడ్ ట్రక్కులను తెరవడానికి చాలా మందిని ప్రేరేపించాడు. ఫుడ్ ట్రక్ వ్యాపారం గురించి సలహా పొందడానికి గోరఖ్పూర్ నుండి ప్రజలు అతని వద్దకు వచ్చేవారు. ధిల్వాన్ జంక్షన్ను ఇప్పుడు ‘పిజ్జా-బర్గర్ జంక్షన్’ అని పిలుస్తారు. ప్రస్తుతం దీప్ సింగ్ చీమా ప్రతి నెలా రూ.2 లక్షలు సంపాదిస్తున్నారు. ఎంతో మందికి అతను స్ఫూర్తిగా నిలిచాడు. ఉద్యోగం లేకపోయినా వ్యాపారం పెట్టుకుని జీవించవచ్చనే భరోసాను కల్పించాడు. అతని స్ఫూర్తితో చాలా మంది ఫుడ్ ట్రక్ బిజినెస్ చేస్తున్నారంటే అతిశయోక్తి లేదు.
తాజావార్తలు
-
Maa Inti Bangaram: 73 కోట్ల వసూళ్లతో అన్-స్టాపబుల్ ‘బంగారం’!
-
Joker : నిర్మాతగా బన్నీ బెస్ట్ ఫ్రెండ్.. అల్లు అరవింద్ క్లాప్’తో ‘జోకర్’ గ్రాండ్ లాంచ్!
-
Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..