INDIA bloc: ఇండియా కూటమిలో లుకలుకలు.. కాంగ్రెస్పై అఖిలేష్ యాదవ్ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INDIA bloc: 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని, ప్రధాని నరేంద్రమోడీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ తో పాటు టీఎంసీ, ఆర్జేడీ, శివసేన(ఉద్ధవ్), జేడీయూ, ఆప్, సమజ్ వాదీ(ఎస్పీ) పార్టీలు ‘ఇండియా’ పేరుతో కూటమిని కట్టాయి. అయితే ఇప్పటికే ఈ కూటమికి సంబంధించి మూడు సమావేశాలు జరిగాయి. సీట్ల సర్దుబాటుపై కసరత్తు చేస్తోంది. ఇదిలా ఉంటే సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మాత్రం కూటమి తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు.
తాజాగా ఇండియా కూటమికి బదులుగా ‘పీడీఏ’ అస్త్రాన్ని బయటకు తీశారు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి ఆరు సీట్లు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్, ఆ మేరకు హామీని నిలబెట్టుకోలేదని అఖిలేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామంతో ఎస్పీ, కాంగ్రెస్ మధ్య విభేదాలు ఎక్కువయ్యాయి.
Also Read
- CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
- IMD Alert: దేశ వ్యాప్తంగా రుతుపవనాలు.. ఈ రాష్ట్రాలకు భారీ వర్షాలు
- Nitin Gadkari: 2016కు ముందు వాహనాలకు కొన్ని మార్పులు అవసరం.. E20 పెట్రోల్పై గడ్కరీ..
- Trump-Iran: జోర్డాన్లో అమెరికా స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి.. తీవ్ర ప్రతీకారం ఉంటుందని ట్రంప్ హెచ్చరిక
Read Also: Allu Arjun: ఇద్దరు పోరంబోకులకు నేషనల్ అవార్డు వచ్చింది..
తాజాగా ఆయన ఎక్స్(ట్విట్టర్)లో పెట్టిన పోస్టు చర్చనీయాంశంగా మారింది. ఎస్పీ కార్యకర్త ఫోటోను పోస్ట్ చేస్తూ.. ‘‘మిషన్ 2024 నేతాజా(ములాయం సింగ్ యాదవ్) అజరామరంగా ఉండనివ్వండి. ‘పీడీఏ’ ఈసారి ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ ని గెలిపించేలా చేస్తుంది. అఖిలేష్ యాదవ్ పేదలకు న్యాయం జరిగేలా చూస్తారు’’ అంటూ ట్వీట్ చేశారు. పీడీఏ అంటే వెనకబడిన తరగతులు, దళితులు, మైనారిటీలు అని అర్థం. మధ్యప్రదేశ్ ఎన్నికల అభ్యర్థుల లిస్టును కాంగ్రెస్ ప్రకటించిన తర్వాత ఇతర పార్టీలను కాంగ్రెస్ ఫూల్ చేస్తోందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.
రాష్ట్రంలో పొత్తులేదని తెలిస్తే మేం కాంగ్రెస్ వాళ్లతో కలిసేవాళ్లం కాదని ఆయన అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ మాట్లాడుతూ.. అఖిలేష్ యాదవ్ ఈ వివాదాన్ని వదిలేయాలని కోరారు. ఇండియా కూటమి కేంద్ర స్థాయిలో ఉందని అన్నారు. కాంగ్రెస్, ఎస్పీకి ద్రోహం చేయవద్దని, పొత్తు కావాలా..? వద్దా..? అనేది స్పష్టం చేయాలని కోరింది. గతంలో కులగణన లెక్కలు చెప్పని ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కులగణనపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని అఖిలేష్ యాదవ్ అన్నారు.
होगा 24 का चुनाव
PDA का इंक़लाब pic.twitter.com/K7RUPKPxl6— Akhilesh Yadav (@yadavakhilesh) October 22, 2023
తాజావార్తలు
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
-
Vaibhav Sooryavanshi: అప్పుడే వైభవ్ సూర్యవంశీకి ప్రమోషన్.. వైస్ కెప్టెన్గా ఎంపిక..
-
Story Board: దేశ రాజకీయం యువత చుట్టూ తిరగబోతోందా? అందుకే పార్టీలన్నీ Gen-Z జపం చేస్తున్నాయా?
-
Bhuma Akhila Priya: అహోబిలం అంశంపై స్పందించిన భూమా అఖిలప్రియ.. ‘వాస్తవాలు వెలుగులోకి రావాలి’
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!