Allu Arjun: ఇద్దరు పోరంబోకులకు నేషనల్ అవార్డు వచ్చింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ గా మారిపోయాడు. పుష్ప సినిమాకు గాను ఈ ఏడాది జాతీయ అవార్డు అందుకున్నాడు. 69 ఏళ్లుగా ఈ అవార్డును అందుకున్న ఏకైక టాలీవుడ్ హీరో బన్నీనే కావడం విశేషం. దీంతో బన్నీ పేరు మారుమ్రోగిపోతుంది. ఇక జాతీయ అవార్డు అందుకున్న విన్నర్స్ అందరికి ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ గండిపేట లో గ్రాండ్ పార్టీ నిర్వహించింది. ఈ పార్టీలో టాలీవుడ్ ప్రముఖులు మొత్తం హాజరయ్యారు. ఇక ఈ వేడుకలో బన్నీ ఎమోషనల్ అయ్యాడు. తన 20 ఏళ్ల కల నిజమైందని, తన మిత్రుడు దేవి శ్రీప్రసాద్ తో కలిసి ఈ అవార్డును అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు.
“బాలీవుడ్కు వెళ్లమని దేవిశ్రీ ప్రసాద్కి ఎన్నోసార్లు చెప్పా. దాదాపు 20 ఏళ్లలో ఎన్నిసార్లు చెప్పానో లెక్కలేదు. నేను ఆ మాట చెప్పిన ప్రతిసారీ.. ముందు నువ్వు వెళ్లు.. నీతో పాటు నేనూ వచ్చేస్తా అనేవాడు. అతడి మాటలు విని.. మనకెక్కడ సాధ్యమవుతుందిలే అనుకునేవాడిని. అలాంటిది మేమిద్దరం ఒకేసారి పుష్పతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాం. అక్కడా మంచి విజయాన్ని అందుకున్నాం. 20 ఏళ్ల నుంచి దేవితో అంటున్న మాట ఇలా నిజమైనందుకు నాకు సంతోషంగా అనిపించింది. జాతీయ అవార్డులకు మా ఇద్దరి పేర్లు ప్రకటించిన నాడు మా నాన్న ఎంతో ఆనందించారు. నేను కూడా ఢిల్లీ వస్తా.. దేవికి వాళ్ళ నాన్న సత్యమూర్తి లేకపోతే .. నేను ఉన్నానుగా.. నా ఇద్దరు కొడుకులకు జాతీయ అవార్డులు వచ్చినట్టు ఉందన్నారు. నాన్న మేము సాధించాం. మీ భాషలో చెప్పాలంటే.. చెన్నైలో తిరిగే ఇద్దరు పోరంబోకులు.. ప్రిన్సిపల్ దగ్గర టీసీలు తీసుకునే మేం.. ప్రెసిడెంట్ దగ్గర మెడల్స్ తీసుకుంటామని అనుకున్నావా? అని అడిగాను.
Also Read
- Hrudayam Murali: ‘బాయ్స్’ తర్వాత మళ్లీ నటుడిగా తమన్.. 'హృదయం మురళి' ట్రైలర్ చూశారా?
- Tollywood : నిర్మాతల్లో మొదలైన మార్పు.. ఇక హీరోలకు నో రెమ్యునరేషన్స్
- Jayam Ravi: "నన్ను క్షమించండి.. ఇకపై మోసం చేయను".. భావోద్వేగానికి గురైన స్టార్ హీరో!
- Tridha Choudhury : నరకం చూశాను.. గదిలో బందీనై రోజూ ఏడ్చేదాన్ని: స్టార్ నటి షాకింగ్ నిజాలు!
జీవితంలోని ప్రతి దశలో నేను ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటా. ఏదైనా గట్టిగా కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుందని సాధారణంగా మనం అనుకుంటాం. జాతీయ అవార్డు అందుకున్న తర్వాత నాకు తెలిసిన విషయం ఏమిటంటే.. మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్లు కూడా కోరుకుంటేనే ఏదైనా సరే జరుగుతుంది. జాతీయ అవార్డు అందుకోవాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా. కానీ, నాకు అవార్డు రావాలని సుకుమార్ మరెంతగానో కోరుకున్నారు. అందుకే నాకు ఈ అవార్డు వచ్చింది. దీని ఎఛీవర్ ఆయనే.. నేను కేవలం అఛీవ్మెంట్ మాత్రమే..” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Satya Dev: రావు బహదూర్’లో నగ్నంగా నటించాలన్నారు
-
Shreyas Iyer: మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేదు.. కెప్టెన్గా ఆ రికార్డ్ సాధించిన శ్రేయాస్ అయ్యర్..
-
IND Vs ENG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. జట్టులోకి యువ ప్లేయర్..
-
Hormuz Tank Attacks: హోర్ముజ్ జలసంధిలో యుద్ధ వాతావరణం.. 24 గంటల్లో 3 ఆయిల్ ట్యాంకర్లపై దాడులు!
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!