India- Afghan: భారత్కు తాలిబాన్ మంత్రి.. పాకిస్తాన్లో భయం ఎందుకంటే..?
- భారత పర్యటనకు వస్తున్న తాలిబాన్ మంత్రి..
- పాకిస్తాన్ గుండెల్లో భయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2021లో ఆఫ్ఘనిస్తాన్లో పౌర ప్రభుత్వాన్ని దించి తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అప్పటి నుంచి భారత్-ఆఫ్ఘాన్ మధ్య తెరవెనక దౌత్య సంబంధాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికీ, తాలిబాన్ ప్రభుత్వాన్ని భారత్ గుర్తించలేదు. కానీ, ఇప్పుడు మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య ఆఫ్ఘాన్ అవసరం భారత్కు ఎంతో ఉంది. అదే విధంగా తాలిబాన్లకు కూడా భారత్ కావాలి. ఈ నేపథ్యంలోనే, తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత పర్యటనకు వస్తున్నారు. ఈ పర్యటనలో ముత్తాకీ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో భేటీ అయ్యే అవకాశం ఉంది.
తాలిబాన్ నేత పర్యటనపై పాక్ పరిశీలన..
Also Read
- Ex-Terrorist: ఉగ్రవాదుల జేబుల్లో కండోమ్, ప్రేమ లేఖలు..ధురంధర్లో చూపించి నిజమే: మాజీ ఉగ్రవాది..
- Cockroach Janta Party: జంతర్ మంతర్ వద్ద హైటెన్షన్.. అరెస్ట్కు సిద్ధమన్న అభిజిత్ దీప్కే.
- NEET Exam: నాగ్పూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ సెంటర్.. అసలు నిజం ఇదే..
- Railway Rules: టికెట్ లేని ప్రయాణంపై రైల్వే రూల్స్ చేంజ్.. ఇకపై డబుల్ పెనాల్టీ..
అయితే, భారత్-ఆఫ్ఘాన్లు దగ్గర కావడం పాకిస్తాన్కు నచ్చడం లేదు. తాలిబాన్ మంత్రి భారత్ పర్యటనకు వస్తుంటే, పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఈ పరిణామాలను పాక్ నిశితంగా గమనిస్తోంది. పాకిస్తాన్ నిపుణుడు నజామ్, ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్లో రాసిన ఒక వ్యాసంలో.. తాలిబాన్ మంత్రిపై యూఎన్ ట్రావెల్ బ్యాన్ ఎత్తేయడం దక్షిణాసియా దౌత్యంలో ముఖ్యమైందని రాశాడు. రష్యాతో సమావేశాల తర్వాత ముత్తాకీ భారత పర్యటన, ఆఫ్ఘాన్ ప్రాంతీయ సంబంధాలను పునరుద్ధరించాలనే ఉద్దేశాన్ని సూచిస్తోందని అన్నారు. ఈ పరిణామం పాకిస్తాన్కు వ్యూహాత్మక, మానవతా, భద్రతాపరమైన చిక్కుల్ని తెస్తాయని వ్యాసంలో చెప్పుకొచ్చారు.
భారత్-ఆఫ్ఘాన్ల మధ్య చాలా ఏళ్లుగా సంబంధాలు ఉన్నాయి. 2001 తర్వాత భారత్, ఆ దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టింది. మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యంపై 3 బిలియన్ డాలర్లనున ఖర్చు చేసింది. అయితే, 2021లో తాలిబాన్లు తిరిగి రావడంతో, భారత్ కాబూల్లోని తన రాయబార కార్యాలయాన్ని మూసేసింది. తాలిబాన్ అధికారంలోకి వచ్చిన ఒక ఏడాది తర్వాత నుంచి మానవతా సాయాన్ని భారత్ అందిస్తోంది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు గాడినపడ్డాయి.
భయపడుతున్న పాకిస్తాన్:
అయితే, ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఆసక్తికి భారత్ కారణమని పాకిస్తాన్ భావిస్తోంది. భారత్, తమ దేశానికి వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్ ను వాడుకుంటుందని భయపడుతోంది. ముఖ్యంగా, తాలిబాన్లో భారత సంబంధాలు, బలూచిస్తాన్లో ‘‘బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA)’’, ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) మరింత బలోపేతం అవుతాయని పాక్ తీవ్ర ఆందోళనలో ఉంది. ఇప్పటికే, పాక్-ఆఫ్ఘాన్ల మధ్య డ్యూరాండ్ లైన్ రూపంలో వివాదం ఉంది. శత్రవుకు శత్రువు మిత్రుడనే సూత్రాన్ని భారత్ ఇక్కడ వర్తింప చేస్తుందనేది పాకిస్తాన్ అనుమానం.
ఇదే కాకుండా, పాకిస్తాన్ వ్యాప్తంగా ఇటీవల కాలంలో గుర్తుతెలియని వ్యక్తులు, భారత వ్యతిరేక ఉగ్రవాదుల్ని హతమారుస్తున్నారు. ఈ దాడులకు పాకిస్తాన్లో ఉంటున్న ఆఫ్ఘాన్ శరణార్థులే కారణమని పాక్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. పాక్ తాలిబాన్లకు, ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వం సహకరిస్తోందని విమర్శిస్తోంది. ఇక పాకిస్తాన్, చైనాల ఎకనామిక్ కారిడార్, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్పై భారత్ దృష్టికి ఆఫ్ఘాన్ స్నేహం సహకరించనుంది.
తాజావార్తలు
-
Rohit Sharma: హిట్మ్యాన్ హిస్టరీ.. సెహ్వాగ్ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. చరిత్రలో ఒకే ఒక్కడిగా..
-
APL 2026: మంగళగిరిలో ఏపీఎల్ జోష్.. సెమీస్, ఫైనల్కు భారీ ఏర్పాట్లు
-
Israel-Lebanon: శాంతి ఒప్పందానికి తూట్లు.. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు
-
Ex-Terrorist: ఉగ్రవాదుల జేబుల్లో కండోమ్, ప్రేమ లేఖలు..ధురంధర్లో చూపించి నిజమే: మాజీ ఉగ్రవాది..
-
Sajjala Ramakrishna Reddy: గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం.. వైసీపీ కొత్త వ్యూహం
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!