Umesh Pal murder case: యోగీతో అట్లుంటది.. వార్నింగ్ ఇచ్చిన రెండ్రోజుల్లోనే నిందితుడి ఎన్కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Umesh Pal murder case: యూపీ రాజకీయాలను ఉమేష్ పాల్ హత్య కేసు కుదిపేస్తోంది. ఇటీవల ఈ హత్యపై యూపీ అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), ఆ పార్టీ చీఫ్ పై ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. యూపీలో మాఫియాను మట్టిలో కలిపేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితుల కోసం 10 పోలీస్ టీములు రాష్ట్రాన్ని జల్లెడ పడుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు.
ప్రయాగ్ రాజ్ లోని నెహ్రూ పార్క్ నిందితుడు అర్బాజ్ ను ఉత్తర్ ప్రదేశ్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, జిల్లా పోలీసులు ఎన్ కౌంటర్ లో లేపేశారు. 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ ను గత శుక్రవారం సాయంత్రం ప్రయాగ్ రాజ్ లోని తన నివాసంలోనే కాల్చి చంపారు. కారు నుంచి దిగుతుండగా.. ఉమేష్ పాల్ ను గుర్తు తెలియని వ్యక్తి కాల్చి చంపాడు. మాజీ ఎంపీ, సమాజ్ వాదీ పార్టీ నేత అతిక్ అహ్మద్ సోదరుడు అతని బంధువులపై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులో బీజేపీ నేత రహీల్ హసన్ సోదరుడు గులామ్ పేరును కూడా చేర్చారు. పార్టీ నుంచి ఆయనను తొలగించారు.
Also Read
- Tejashwi Yadav: బ్యాలెట్తో ఎన్నికలు జరిపితే బీజేపీ గెలవదు.. తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు
- Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే...
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Jaya Bachchan: జాన్వీని ఒక వస్తువులా చూసినట్లున్నారు.. పెద్ది దర్శకుడిపై జయా బచ్చన్ విమర్శలు
Read Also: Cred CEO Kunal Shah: ఆ సంస్థ సీఈవో జీతం తెలిస్తే షాకే.. ఏంటి సారు ఇది..?
రాజు పాల్ 2005లో బీఎస్పీ తరుపున పోటీ చేసి అలహాబాద్ (పశ్చిమ) నియోజకవర్గం నుంచి గెలిచారు. ఈ ఎన్నికల్లో మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ తమ్ముడు ఖలీద్ అజీమ్ ను ఓడించారు. ఈ ఓటమితో అతిక్, అతని తమ్ముడే రాజుపాల్ ను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం నిందితులు అంతా జైలులో ఉన్నారు.
ఇదిలా ఉంటే ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ ను శుక్రవారం దుండగులు హత్య చేశారు. ఈ హత్య కేసులో అతిక్ బంధువులతో సహా 40 మందిని అదుపులోకి తీసుకున్నారు యూపీ పోలీసులు. అహ్మదాబాద్ లోని సబర్మతి జైలులో ఉన్న అతిక్ ఖాన్ ఈ కేసులో కుట్ర పన్నాడని యూపీ పోలీసులు భావిస్తున్నందున ఆయనను ప్రశ్నించేందుకు సిద్ధం అయ్యారు. కాగా, ఈ హత్య కేసులో సీబీఐ విచారణను డిమాండ్ చేస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు అతిక్ అహ్మద్ భార్య షాహిస్తా పర్వీన్ లేఖ రాశారు. ప్రయాగ్ రాజ్ పోలీస్ కమిషనర్ రమేష్ శర్మ, ఏడీజీ ఎస్టీఎఫ్ అమితాబ్ యాష్ ప్రత్యర్థులతో కుమ్మక్కయ్యారని.. తన భర్త అతిక్ అహ్మద్, ఆయన తమ్ముడు అష్రఫ్ లను హత్య చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
తాజావార్తలు
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
-
Tejashwi Yadav: బ్యాలెట్తో ఎన్నికలు జరిపితే బీజేపీ గెలవదు.. తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు
-
Kitchen Cleaning Tips: కొత్త పాత్రలపై ఉన్న మొండి స్టిక్కర్స్ పోవడం లేదా? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్!
-
Health Benefits of Silver : వెండి పాత్రలో నీరు తాగితే ఏమవుతుంది? కంగనా అలవాటు వైరల్.!
-
Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే…
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!